Tuesday, January 27, 2009
రిపబ్లిక్ ఢే
Sunday, January 18, 2009
వీరిరువురి మధ్య పరదా మరేమిటో కాదు ,"మాయ ".ఆతెర తొలగితెభాగావంతుడు భక్తుడు నాలుగు కళ్లు రెండు కళ్ళుగా చేసుకొని తన్మయులవుతారు.ముగ్ధ మోహనమూర్తి రాధ లోపల కృష్ణుడి పక్కనే వుంటుంది.పరదా వేసినప్పుడు కృష్ణుడు ఆమె కళ్ళలో కళ్లు నిలిపి రాధలోని బాధని బాపి మనసులో తియ్యదనం నింపుతాడు.
శివుణ్ణి చూడగానే కన్నయ్య కిల కిలా నవ్వడం మొదలు పెట్టాడు.సాధువు ఇంద్ర జాలికుడా!మామూలు సాధువు కాదని తెలుస్తూనేవుంది.
దాసీ నెమ్మదిగా పిల్లవాన్ని శివుని దగ్గరికి తీసుకు వెళ్ళింది.శివుడు కృష్ణుని చూసి కిల కిలా నవ్వాడు.శిరసు వంచి వందన మాచరించాడు.కృష్ణ దర్శనంతో మది పొంగింది,కానీ తృప్తి కలుగ లేదు.
"ఒకసారి కన్నయ్య నిలా ఇయ్యమ్మా!అలా దూరం నించి చూస్తె తృప్తి కలగడం లేదు.నా చేతికిస్తే నా వాళ్ళో పెట్టుకొని ఆనందిస్తాను.దూరంగా వుంటే ఆ ఆనందమేదీ?మేమిద్దరం కలుసుకోవాలి.మెత్తటి పాపాన్ని మదికి హత్తుకోవాలి.అద్వైతం లోనే ఆనందం.దూరంలో భయం,దగ్గరలో హాయి."అన్నాడుశివుడు.
కళ్ళుమూసుకొని"ఆహా!కృష్ణుడు ఒక్కసారి నా వడిలోకి వస్తే ఎంత బాగుంటుంది?"అనుకోని కళ్లు తెరచి,యశోదతో-
నీబిడ్డది భవిష్యత్ తెలుసుకోవాలని లేదా?పిల్లవాన్ని ఒక్కసారి నాచేతికిస్తే పాపడి అరిచేతిలోని రేఖలు స్పష్టంగా చూసి మీకు భవిష్య వాని చెపుతాను."
భవిష్య వాని అనగానే యశోడలో ఉత్ఖంట పెరిగింది.బాలున్ని శివుని చేతికిచ్చింది. ఆయన ఒడిలో పెట్టుకొన్నాడు.నిశ్చల సంమాధింలోకి వెళ్ళిపోయాడు. హరి,హరులు ఏకమయ్యారు.ఎవరూ ఏమీ మాట్లాడలేదు.కొంత సేపటికి శివుడు-
తల్లీ!నీబిడ్డ చక్రవర్తికానీ మామూలు వాడుకాదు."అన్నాడు.
మామిడిపండు దొరికితే ఆనందం తో గంతులు వేస్తాము,శివుడి చేతిలోకి చిన్మయ మూర్తి శివుడు వచ్చాడు.ఆయన తాండవ నృత్యం చేసాడు.తన్మయత్వంతో నృత్యం చేసి పిల్లవాన్ని యశోదకప్పగించి వెళ్లి పోయాడు.తన బిడ్డ ఇంట ఆనంద దాయకుడా?అని యశోద కళ్ళప్పగించి చూస్తూ నిలబడి పోయింది.
గోకులంలో శివుడు క్రుశ్నునికోసం వేచి నిల్చున్న స్థలంలో ఒక శివ మందిరం వెలిసింది. ఆ మందిరంలోని శివుణ్ణి "ఆశేస్వరుడు" అని పిలుస్తారు. వ్రజ చౌరాసీకి ప్రదక్షిణం జీవితంలో ఒక్కసారయినా చేయాలి.పాపాలన్నీ పటాపంచలవుతాయి.గోకులం కృష్ణుడి లీలా నాటక రంగం అక్కడకూర్చుని తపస్సు చేస్తే స్వయమ్గా కృష్ణుడే ప్రత్యక్షమయి లీలలు చూపిస్తాడట
రచన -టి.జ్ఞాన ప్రసూన . ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక నుంచి పునర్ముద్రితం .
బ్రహ్మ జ్ఞానము పొందటం కంటే బ్రహ్మజ్ఞానిని దర్శించుకోవాలనుకోవడం విశేషం .
యశోద తలుపు ఓరగా నిలబడి "సాధు పుంగవా! బిక్ష ఇచ్చినదానిలో తక్కువవున్నా,LoPAM జరిగినా,వేరేదైనా మీరు కోరినా ఇయ్యడానికి సిద్ధమే!కానీ పసివానిని వీధిలోకి తీసుకురాను. పైగా మీ మెడలో సర్ప రాజును చూసి నాకూనా బెదిరిపోతాడు."అంది.
తల్లీ! నీ బిడ్డడు సామాన్యుడు కాదమ్మా!కాల పురుషునికి యజమాని. బ్రహ్మ దేవుడి తండ్రి. అటువంటి వానికి భయమేమితమ్మాఅంతటి వానికి ఎవరి దృష్టి తగలదు.! నేను ఆయనకు తెలుసు,ఆయన నాకు తెలుసు.ఒక్కసారి చూపించంమా!"అన్నాడు శివుడు.
యశోద ఆశ్చర్యానికి అన్తులేకపోయింది.భీతురాలైంది."ఏమిటండీ మీరనేది?నాబిడ్డ పసికూన.మీరు పట్టు బట్టకండి" అంది."నేను కృష్ణున్ని చూడకుండా తిరిగి వెళ్ళనమ్మా!"అన్నాడు శివుడు.
వీరిద్దరూ ఇలా మాట్లాడుకొంటూ వుండగా లోపల కృష్ణుడికి కధంతా తెలిసిపోయింది.శివుడు తనని చూడటానికి వచ్చాడు.తల్లి తనని బయటికి తీసుకు వెళ్లి చూపించ నంటోంది.జోరుగా ఏడుపు సాగించాడు.
దాసీ యశోద దగ్గరకు వెళ్లి మెల్లగా "అమ్మగారూ!ఆ సాధువు కదలడం లేదు.పెదవులు కదుపుతూ లోలోపల ఏదో గోనుగుతున్నాడు.మీరు నమ్మితే నమ్మండి,లేకపోతేలేదు.ఆయన ఏదో మంత్రం వేసి వుంటాడు. లేకపోతె నీళ్లు పోసుకొని నిద్ర పోతున్న కన్నయ్య ఎందుకు ఏడుస్తాడు?ఇంతవరకూ ఇలాటి సాధువుని నేచూడలేదు బాబూ!వెళ్ళమంటే వెళ్ళాడు.నంద బాబు కూదావూల్లో లేరు.ఎందుకొచ్చింది కృష్ణుడిని ఒకసారి ఆయనకీ చూపించి ఆశీర్వాదం తీసుకోవడమే మంచిది!'అంది.
ఇదుగో!నాబిద్దని ఆసాదువుకు చూపిస్తే చూపించుకానీ ఇలా చూచి, అలా వెళ్లి పొమ్మని చెప్పు.కన్నార్పకుండా చూస్తె నాబిద్దకి దిష్టి తగులుతుంది."అంది యశోద.
స్వరూపాశక్తి లేకపోతె భక్తీ పెరగదు.మనసాటి,తోటి మనిషిని ప్రేమించి ఎంతగా చూడాలని తహతహ లాదతామో ఆ రూపాన్ని మనసులో ముద్రించుకోవాలని ఎంత తాపత్రయ పడతామో అలానే భగవంతునిపట్ల మరిన్ని రెట్లు ఎక్కువ మక్కువ పెంచుకోవాలి. అదే భక్తిగా మారి,ముక్తికి మార్గ మవుతుంది.
కృష్ణ మందిరంలో పరదా వేస్తారు.పరదా తీస్తే భక్తుడికి భగవంతుని దర్శన మవుతుంది.భక్తుడు జీవాత్మ,భగవంతుడు పరమాత్మ.
పశువుల కొట్టంలో కట్ట బడిన కర్రిఆవు బిడ్డ నోటి నుంచి పొడుగు వేరు చేయాలని బిడ్డని బ్రతిమాలుతోంది."కొంచెం పాలు కృష్ణుడికి ఇయ్యాలమ్మా!కాస్త ఉంచమ్మ అన్నీ నీకే ఇస్తే కన్నయ్య ఏమంటాడు?నీకంతా స్వార్ధం నీబిద్దడే నీకు గొప్పా? అంటాడు.మళ్ళి మళ్ళి కన్నయ్యకి నాపాలు ఇచ్చుకోగాలనా?ఈజన్మలో నందుని వాకిట్లో వున్నాను కనుక నాకీ అదృష్టం పట్టింది.నా జన్మ చరితార్ధం చేసుకొనీ తల్లీ!కాసినిపాలు కన్నయ్యకియ్యనియ్యమ్మా!అని బతిమాలి పక్కకు జరిగి అంబా!అంబా! అంటూంది.యశోదమ్మా!రామ్మా!నా పాలు సిద్ధంగా వున్నాయి .నేనిట కంటే కన్నయ్య కేమి ఇవ్వగలను?అన్నట్లున్నడా పిలుపు.శివుడు భిక్షాపాత్ర పుచ్చుకొన్నాడు కానీ బిక్షకుడుకాడు.
శివుని కంటే మహా ఐశ్వర్య వంతులు ఎవరూ లేరు.ఎమానవుడైనా ఈజన్మలో రవంత ధనాన్ని అనుభవిస్తున్నాడంటే ,సుఖిస్తున్నాడంటేక్రితం జన్మలో శివ భక్తుడై శివ పూజ చేసి వుంటాడు.అంటారు.ఆశివుడు ఈరోజు యాచకుడై,నందుని వాకిట నిలువబడి వున్నాడు.ఆ మహేశ్వరుని చూచిన వారు ఆయన ముక్కంటి వలె వున్నాడని ,మహా తేజస్సుతో వెలిగి పోతున్నాడని ఒకరితో ఒకరు ముచ్చటించుకొన్నారు. పవిత్రమైన,నిజమైన తేజస్సును ఎవరు దాచ గలరు?పార్వతీ పాటికి కూడా చేతకాలేదు.
వాకిట్లో నిలబడిన బిక్షువును చూచి పళ్ళెం నిండా పళ్ళు,పలహారాలూ సర్ది దాసిచేతికిచ్చి పంపిందియశోడ.
యశోదా దేవి మీకియ్యమని పంపారు.వీటిని స్వీకరించి బిడ్డని ఆశీర్వదించమని కోరింది. అంది దాసీ. నేను భిక్ష తీసుకొను. నాకు దేనిమీదా ఆశ లేదు.నేను కేవలం బాల కృష్ణుడిని చూడాలని వచ్చాను."అన్నాడు శివుడు.
దాసీ లోపలికి వెళ్లి యశోదతో చెప్పింది."ఆయనకీ ఇవేమీ అక్కర లేదటమ్మా! బాల కృష్ణుడిని చూడటానికి మాత్రమె వచ్చాడట. "అంది.సాధువులని పరిశీలించాలి అంటే వాళ్ల వేషమూ జాతి, ప్రాంతమూ కాదు ముఖ్యం. వాళ్ల కళ్ళలోని పరిభాష,నడవడిక తోనేగుర్తించవచ్చు.
నల్లని వాడంత
కమల నయనాల వాడన్త
దయగల వాదంత
ఆశేశ్వరుడు
Friday, January 2, 2009
చదవండి
కెనడా లో ఒక స్కూల్ వాళ్లు ఒకప్రకటన చేసారుట " చేతిలో పనులన్నీ
కిందపడేసి పుస్తకం చదవండి "అని.అది ఎలాగా కేవలం విద్యార్దు లేకాదు
స్కూలు లో పని చేసే ప్రతివారూ.ఒకరోజుకాదు,ఒక వారం రోజులు.ఒకేటైముకి ౨౦ నిముషాల పాటు అందరూ పుస్తకం చదవాలి.
వారి వుద్దేశ్యం అలా అందరూ చదవడం వల్ల యువతరం వారిలో ఒక
చైతన్యం వస్తుందని,అక్షరాస్యత పెరుగు తుందని, వారికి గ్రంధాలయాల
విలువ తెలుస్తుందని.అలా వరసగా వారం రోజులు చదివిన వారికి
బహుమతులు కూడా ఇచ్చారట. బహుమతులు బయట వారు అందిస్తే
వారికీ ప్రచారం కల్పిస్తామని చెప్పారట.బహుమతులు యువతకి పనికి వచ్చేలా పెన్నులు,పుస్తకాలు,సి.డి లు ,వార పత్రికలూ, విజ్ఞాన దాయక మైన సినిమాలు ఇయ్యాలని సూచించారట.
పిల్లలు అన్నం తినక పొతే ఎన్నివిధాల బ్రతిమాలి, రక రకాల కూరలు చేసి అమ్మ అన్నం తినిపిస్తుందో,పుస్తకము చదివించేందుకు కూడా అలా
శ్రద్ధ తీసుకోని చదివించాలి.
విదేశాలలో గ్రంధాలయాలు ఎంతో ఆకర్శణీయమ్గా వుంటాయి.ఒక
పేటలో నివసించేవారు అక్కడవున్న గ్రంధాలయంలో మెంబర్లయి పోతారు.
ఇంటికి పుస్తకాలు ఒకటికంటే ఎక్కువే తెచ్చు కోవచ్చు.పుష్టం పోస్టులో
వారికి పంపవచ్చు, మధ్యలో హుష్ కాకి అయిపోవు.పుస్తకం ఇచ్చేగడువుని వారు గుర్తు చేస్తారు. గ్రంధాలయాల లో ఎన్నో రకాల పోటి లు ఆబాల గోపాలానికి పెడతారు.పెద్ద వాళ్ల చేత ఉపన్యాసా లిప్పిస్తారు,
సంగిత కచేరీలు ఏర్పాటు చేస్తారు.మంచి సినిమా చూస్తూ భోజనాలు చేసే ఏర్పాటు చేస్తారు.వ్యాయామాలు,డాన్స్ కోర్సులు నడుపుతారు.ఫీజులు వుంటాయి,సమయ ము ఎప్పుడో,ఎంత కట్టాలో కరపత్రాలు అచ్చువేసి పంచుతారు.చిన్నపిల్లలకి వేరే పోటీలు వుంటాయి.ఎవరెక్కువ పుస్తకాలు చదివితే వారికి బహుమతులు వుంటాయి.
పిల్లల పుస్తకాలు చక్కటి పేపరు పై,ముచ్చటైన రంగులతో ముద్రించి నవి వుంటాయి.పుస్తక చౌర్యాలు జరగవు.ఏదైనా పుస్తకం కావాలని అడిగితె తెప్పించి మనకు తెలియ చేస్తారు.
గ్రంధాలయాలుచదివించాలనే ఆశయం తోనేకాక ఆశయ సిద్ది కోసం
ఎన్నో విధాలుగా ప్రజలని తమ వేపుకు తిప్పుకోటానికి ప్రయత్నాలు చేస్తే నిష్ఫలం కావు. పిల్లలకు పుస్తకాలు చదవమని చెప్పే పెద్దలు తామూ చదువుతూ వారిని చదివించాలి.మేము టి.వి చూస్తాము,మేము సినిమాకేల్తాము నువ్వు చదువు అంటే వారికి మనసు నిలవదు.చేసి చేయించండి అప్పుడే పిల్లలకి హేచ్చరించ వలసిన అవుసరం రాదు.పుస్తకాలు చదివితే ఏకాగ్రత, అవగాహనా శక్తి ,ధారణా శక్తి ,స్థిమితము ఏర్పడుతాయి.కొన్ని నిముషాలయినా పుస్తకం పుచ్చుకు
కూర్చునే వాతావరణంకల్పించి ఉత్సుకతను కల్పించండి.పెద్దయాక వాళ్ళకే తెలుస్తూంది పుస్తకాలని మించిన మిత్రులు లేరని. పైగా ౧౫ ఏళ్ళ లోపున చదివిన పాటా,మాటా, పద్యం జీవితాంతము గుర్తు వుంటాయి.
శివస్తుతి
కిస్ విధి వందన కరూ తిహారో,ఔఢరదానీ ,త్రిపురారీ
బలిహారీ,బలిహారీ,జయ మహేష్ బలిహారీ
నయన్ తీన్ ఉపవీత భుజంగా,శశి లలాట సోహేసిర గంగా
ముండమాల- గళ బీచ్ విరాజత్,మహిమా హై భారీ బలిహారీ
కరమె డమరు,త్రిశూల తిహారే,కటి మెహై వాఘంబర ధారే
ఉమాసహిత హిమశైల విరాజత్, శోభా హై న్యారీ బలిహారీ
పల్ మే తుమ హో ప్రభు ప్రళయంకర్, పల్ మే ప్రభో సదయ అభయంకర్
ఋషి ముని బేధ న పాయె తిహారో,హం తో హై సన్సారీ బలిహారీ
అగమ నిగమ తవ బేధ న జానే ,బ్రహ్మా,విష్ణు సదాశివమానే
దేవోంకె ఓ మహాదేవ అబ్ ,రక్షా కరొ హమారీ బలిహారీ
సేకరణ---- జ్ఞాన ప్రసూన
