Pages

Tuesday, January 27, 2009

రిపబ్లిక్ ఢే

రిపబ్లిక్ డే ఎన్ని సంవత్సరాలు గడిచినా మనో ఫలకమ్మీదనుంచి కొన్నిచిత్రాలు చెరిగిపోవు.రిపబ్లిక్ డే అనగానె నాచిన్నపుడు బందరులోడాబాపై నుంచుంటే దూరంగా ఒక మబ్బు నేపధ్యంలో పెద్ద ఝండా ఎగురుతూకనిపించింది.ఆరోజుల్లో గాంధీగారన్నా,ఖద్దరన్నా, కాంగ్రేసు ఝండా అన్నారాట్నం అన్నా మనసుగర్వంతో,గౌరవం తో నిండిపోయేవి.ఆవేళ ఝండాని అలా ఎంతసేపో చూస్తూ నిలబడ్డాను. ఈనాటికి అగష్ట్ 15 ,రిపబ్లిక్ డేఅనగానే ఆదృశ్యమే కళ్ళలో నిలబడుతుంది.ఆరోజుల్లో రెడియోలు అందరిళ్ళల్లో వుండేవి కావు,టీ.వి లు అసలేలేవు.ఇలాటి సందర్భాలలో నాన్నగారు సాయంత్రం పూట పార్క్ కి తీసుకెళ్ళేవారు,అక్కడ రేడియో వినేవాళ్ళము. వూళ్ళో ప్రతి కూడలి లోనూ ఒకదిమ్మ కట్టి ఝండాఎగరేసేవారు.పూలు,బుక్కాయలతొ పూజలు చేసే వారు.స్వచ్చ మైన దేశ భక్తి ప్రతివారి కళ్ళల్లో తొణికిసలాడుతూ వుండేది.అందరు ఖద్దరు కట్టేవారు. ప్రతి ఇంట్లో రాట్నం కదులుతూ వుండేది.దేశం పట్ల భక్తిని అలా ప్రకటించేవారు.హిందీ నేర్చుకొనేవారు,నేర్చుకోమని అందరినీ ప్రోత్సహిస్తూండెవారు. మొన్న మాకాలనీలో సొసైటీ వాళ్లు ముగ్గుల పోటీ పెట్టారు.కాలక్షేపం కోసమనుకోండి ,కానుకల కోసం అనుకోండి నేనూ వెళ్ళాను.నేనేమీ ప్రవీణురాల్నికాదు,గుప్పిటలో ముగ్గు గుమ్మంలోపారబొయ్యడమేతెలుసు.రిసల్ట్స్ రిపబ్లిక్ డే నాడు చెపుతామన్నారు.వెళదామనుకొన్నాను,స్వార్ధము,పరమార్ధము కలిసివస్తాయికదా!ఆడవాళ్ళకి ఎక్కడికైనా పక్కింటికైనాసరే వెళదామంటే ఏమి చీర కట్టుకు వెళ్ళాలి అని ప్రశ్న ఉదయిస్తుంది.అదేమి ఖర్మో గాని అగష్ట్ 15రోజున,రిపబ్లిక్ డే రోజున తప్ప ఖద్దరు చీర సంగతి జ్ఞాపకమేరాదు.హిందీ ప్రవీణ ప్రచారక్ ట్రైనింగ్ అయేటప్పుడు ప్రతి శుక్రవారం ఒక స్పెషల్ క్లాసు వుండేది, గీత చెప్పేవారు, ప్రార్ధనలు చేయించేవారు, ఆరోజు అందరు నీలం అంచున్న తెల్ల ఖద్దరు చీర ధరించేవారం.సందర్భానుసారంగా దుస్తులు ధరిస్తే సమంజసం గా వుంటుంది.ఝండా వందనానికి తప్పక ఎం.ఎల్.ఏ గారో,ఎం పి,గారోవస్తారు కదా!వారూ పక్కా ఖద్దరు ధారులై వుంటారు.కార్యక్రమం నడిపేవారు అలానె వుంటారని వూహించుకొన్నా.ఈమాటు ఖద్దరు చీరకొనాలి అనుకొని మళ్ళి ఏమిచీరధరించాలి అని ప్రశ్న తయారయింది.పాములు, మండ్రగబ్బలు వున్న ప్రింట్ కాకుండా వున్న స్వచ్చ మైన తెల్లచీరకోసం వెదికి కట్టుకువెళ్ళా.చివరి క్షణంలో ఫోనులు,వాళ్ళు చెప్పిన టైముకి అయిదు నిముషాలు దాటింది.మధ్యలోనే ఝండాలున్న అయిదారు కారులు నాముందునుంచి రయ్యిమని దూసుకు పోయాయి.ఇవాళ ఇలానే అందరూ బిజీ గా వుంటారు అనుకొని వెడితే ఆ అతిథి కరక్టుగా టైముకు వచ్చి ఝండా ఎగరేసి వెళ్ళిపోయారట. నాకొచ్చిన కానుక పుచ్చుకొని జనగణమన పాడి వచ్చేసా.రిపబ్లిక్ డే పరేడ్ చూద్దామని టి.వి. ముందు కూర్చున్నాను. ఏది ఎలావున్నా గాంధీ చౌక్ ,రాజ పథ్ చూస్తుంటె గుండెల్లో గర్వం పొంగుతుంది.ఢిల్లో వున్నపుడు ప్రత్యక్షంగా పరేడ్ చూసే అదృష్టం కలిగింది.ఆరోడ్డుమీద నడుస్తూంటేనె ఒక పులకరింత. ఒకసారి స్నేహితుల ఇంట్లోపెళ్ళి అయితే పెద్ద విందు చేసారు.అక్కడికి ఇందిరాగాంధీ వచ్చారు. గులాబీ పువ్వు వంటి మనీషి .ఆమె ఠీవి,సాదాతనం ,నవ్వు ఎంతో ఆరాధనని కల్పిస్తాయి. తిండి సంగతే మర్చిపోయి ఎంతో తృప్తిగా తిరిగి వచ్చాము.కలనిజమాయెగా! అనిపించింది.అప్పుడు మాఇళ్ళు పిల్లా మేకా తో నిండుగా వుండేది.పైగా అంధ్రా గెష్టహౌసులావుండేది. సెలవు రోజు వస్తే మావాళ్ళకి గొతెమ్మ కోరికలు పుట్టుకు వచ్చేవి.ఏం,ఏళ్,ఏ పెసరట్టు చేస్తావా?{పెసరెట్టు,ఉప్మా,అల్లపు పచ్చడి.లేకపోతే సాంబారు,దోసె,పచ్చ్డి.ఇడ్లి, సాంబారు,కారప్పొడి ,పచ్చడి.రిపబ్లిక్ డే నాడు ఈటిఫిన్లు చేయాలంటే కోపం వచ్చేది.హాలులోకి వంటింట్లో నుంచి ఒక ఖాళీ కిటికీ వుండేది. అందులోంచి టిఫిన్లు అందిన్స్తూ మధ్య మధ్య లోటి. వి. వీక్షించాల్సి వచ్చేది.విపరీత మైన చలి మంచు.స్నానాలు బాకీ ,వంట బాకీ సింక్ నిండా కప్పులు ప్లేట్లు ఆహ్వానిస్తూ వుండేవిరా!రా! అని.ఏ.పి శకటం కొసం చూసి దాన్ని మనమే తయారు చేసినట్లు సంతోష పడిపోయి బుజాలు చరుచుకొనేవాళ్ళం.ఈమాటైనా రిపబ్లిక్ డే కి పొందూరు ఖద్దరు చీర కొనుక్కు తీరాలి,అని డైరీలో వ్రాసుకొన్నా.

Sunday, January 18, 2009


వీరిరువురి మధ్య పరదా మరేమిటో కాదు ,"మాయ ".ఆతెర తొలగితెభాగావంతుడు భక్తుడు నాలుగు కళ్లు రెండు కళ్ళుగా చేసుకొని తన్మయులవుతారు.ముగ్ధ మోహనమూర్తి రాధ లోపల కృష్ణుడి పక్కనే వుంటుంది.పరదా వేసినప్పుడు కృష్ణుడు ఆమె కళ్ళలో కళ్లు నిలిపి రాధలోని బాధని బాపి మనసులో తియ్యదనం నింపుతాడు.


శివుణ్ణి చూడగానే కన్నయ్య కిల కిలా నవ్వడం మొదలు పెట్టాడు.సాధువు ఇంద్ర జాలికుడా!మామూలు సాధువు కాదని తెలుస్తూనేవుంది.


దాసీ నెమ్మదిగా పిల్లవాన్ని శివుని దగ్గరికి తీసుకు వెళ్ళింది.శివుడు కృష్ణుని చూసి కిల కిలా నవ్వాడు.శిరసు వంచి వందన మాచరించాడు.కృష్ణ దర్శనంతో మది పొంగింది,కానీ తృప్తి కలుగ లేదు.


"ఒకసారి కన్నయ్య నిలా ఇయ్యమ్మా!అలా దూరం నించి చూస్తె తృప్తి కలగడం లేదు.నా చేతికిస్తే నా వాళ్ళో పెట్టుకొని ఆనందిస్తాను.దూరంగా వుంటే ఆ ఆనందమేదీ?మేమిద్దరం కలుసుకోవాలి.మెత్తటి పాపాన్ని మదికి హత్తుకోవాలి.అద్వైతం లోనే ఆనందం.దూరంలో భయం,దగ్గరలో హాయి."అన్నాడుశివుడు.


కళ్ళుమూసుకొని"ఆహా!కృష్ణుడు ఒక్కసారి నా వడిలోకి వస్తే ఎంత బాగుంటుంది?"అనుకోని కళ్లు తెరచి,యశోదతో-


నీబిడ్డది భవిష్యత్ తెలుసుకోవాలని లేదా?పిల్లవాన్ని ఒక్కసారి నాచేతికిస్తే పాపడి అరిచేతిలోని రేఖలు స్పష్టంగా చూసి మీకు భవిష్య వాని చెపుతాను."


భవిష్య వాని అనగానే యశోడలో ఉత్ఖంట పెరిగింది.బాలున్ని శివుని చేతికిచ్చింది. ఆయన ఒడిలో పెట్టుకొన్నాడు.నిశ్చల సంమాధింలోకి వెళ్ళిపోయాడు. హరి,హరులు ఏకమయ్యారు.ఎవరూ ఏమీ మాట్లాడలేదు.కొంత సేపటికి శివుడు-


తల్లీ!నీబిడ్డ చక్రవర్తికానీ మామూలు వాడుకాదు."అన్నాడు.


మామిడిపండు దొరికితే ఆనందం తో గంతులు వేస్తాము,శివుడి చేతిలోకి చిన్మయ మూర్తి శివుడు వచ్చాడు.ఆయన తాండవ నృత్యం చేసాడు.తన్మయత్వంతో నృత్యం చేసి పిల్లవాన్ని యశోదకప్పగించి వెళ్లి పోయాడు.తన బిడ్డ ఇంట ఆనంద దాయకుడా?అని యశోద కళ్ళప్పగించి చూస్తూ నిలబడి పోయింది.


గోకులంలో శివుడు క్రుశ్నునికోసం వేచి నిల్చున్న స్థలంలో ఒక శివ మందిరం వెలిసింది. ఆ మందిరంలోని శివుణ్ణి "ఆశేస్వరుడు" అని పిలుస్తారు. వ్రజ చౌరాసీకి ప్రదక్షిణం జీవితంలో ఒక్కసారయినా చేయాలి.పాపాలన్నీ పటాపంచలవుతాయి.గోకులం కృష్ణుడి లీలా నాటక రంగం అక్కడకూర్చుని తపస్సు చేస్తే స్వయమ్గా కృష్ణుడే ప్రత్యక్షమయి లీలలు చూపిస్తాడట


రచన -టి.జ్ఞాన ప్రసూన . ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక నుంచి పునర్ముద్రితం .


బ్రహ్మ జ్ఞానము పొందటం కంటే బ్రహ్మజ్ఞానిని దర్శించుకోవాలనుకోవడం విశేషం .


యశోద తలుపు ఓరగా నిలబడి "సాధు పుంగవా! బిక్ష ఇచ్చినదానిలో తక్కువవున్నా,LoPAM జరిగినా,వేరేదైనా మీరు కోరినా ఇయ్యడానికి సిద్ధమే!కానీ పసివానిని వీధిలోకి తీసుకురాను. పైగా మీ మెడలో సర్ప రాజును చూసి నాకూనా బెదిరిపోతాడు."అంది.


తల్లీ! నీ బిడ్డడు సామాన్యుడు కాదమ్మా!కాల పురుషునికి యజమాని. బ్రహ్మ దేవుడి తండ్రి. అటువంటి వానికి భయమేమితమ్మాఅంతటి వానికి ఎవరి దృష్టి తగలదు.! నేను ఆయనకు తెలుసు,ఆయన నాకు తెలుసు.ఒక్కసారి చూపించంమా!"అన్నాడు శివుడు.


యశోద ఆశ్చర్యానికి అన్తులేకపోయింది.భీతురాలైంది."ఏమిటండీ మీరనేది?నాబిడ్డ పసికూన.మీరు పట్టు బట్టకండి" అంది."నేను కృష్ణున్ని చూడకుండా తిరిగి వెళ్ళనమ్మా!"అన్నాడు శివుడు.


వీరిద్దరూ ఇలా మాట్లాడుకొంటూ వుండగా లోపల కృష్ణుడికి కధంతా తెలిసిపోయింది.శివుడు తనని చూడటానికి వచ్చాడు.తల్లి తనని బయటికి తీసుకు వెళ్లి చూపించ నంటోంది.జోరుగా ఏడుపు సాగించాడు.


దాసీ యశోద దగ్గరకు వెళ్లి మెల్లగా "అమ్మగారూ!ఆ సాధువు కదలడం లేదు.పెదవులు కదుపుతూ లోలోపల ఏదో గోనుగుతున్నాడు.మీరు నమ్మితే నమ్మండి,లేకపోతేలేదు.ఆయన ఏదో మంత్రం వేసి వుంటాడు. లేకపోతె నీళ్లు పోసుకొని నిద్ర పోతున్న కన్నయ్య ఎందుకు ఏడుస్తాడు?ఇంతవరకూ ఇలాటి సాధువుని నేచూడలేదు బాబూ!వెళ్ళమంటే వెళ్ళాడు.నంద బాబు కూదావూల్లో లేరు.ఎందుకొచ్చింది కృష్ణుడిని ఒకసారి ఆయనకీ చూపించి ఆశీర్వాదం తీసుకోవడమే మంచిది!'అంది.


ఇదుగో!నాబిద్దని ఆసాదువుకు చూపిస్తే చూపించుకానీ ఇలా చూచి, అలా వెళ్లి పొమ్మని చెప్పు.కన్నార్పకుండా చూస్తె నాబిద్దకి దిష్టి తగులుతుంది."అంది యశోద.


స్వరూపాశక్తి లేకపోతె భక్తీ పెరగదు.మనసాటి,తోటి మనిషిని ప్రేమించి ఎంతగా చూడాలని తహతహ లాదతామో ఆ రూపాన్ని మనసులో ముద్రించుకోవాలని ఎంత తాపత్రయ పడతామో అలానే భగవంతునిపట్ల మరిన్ని రెట్లు ఎక్కువ మక్కువ పెంచుకోవాలి. అదే భక్తిగా మారి,ముక్తికి మార్గ మవుతుంది.


కృష్ణ మందిరంలో పరదా వేస్తారు.పరదా తీస్తే భక్తుడికి భగవంతుని దర్శన మవుతుంది.భక్తుడు జీవాత్మ,భగవంతుడు పరమాత్మ.


పశువుల కొట్టంలో కట్ట బడిన కర్రిఆవు బిడ్డ నోటి నుంచి పొడుగు వేరు చేయాలని బిడ్డని బ్రతిమాలుతోంది."కొంచెం పాలు కృష్ణుడికి ఇయ్యాలమ్మా!కాస్త ఉంచమ్మ అన్నీ నీకే ఇస్తే కన్నయ్య ఏమంటాడు?నీకంతా స్వార్ధం నీబిద్దడే నీకు గొప్పా? అంటాడు.మళ్ళి మళ్ళి కన్నయ్యకి నాపాలు ఇచ్చుకోగాలనా?ఈజన్మలో నందుని వాకిట్లో వున్నాను కనుక నాకీ అదృష్టం పట్టింది.నా జన్మ చరితార్ధం చేసుకొనీ తల్లీ!కాసినిపాలు కన్నయ్యకియ్యనియ్యమ్మా!అని బతిమాలి పక్కకు జరిగి అంబా!అంబా! అంటూంది.యశోదమ్మా!రామ్మా!నా పాలు సిద్ధంగా వున్నాయి .నేనిట కంటే కన్నయ్య కేమి ఇవ్వగలను?అన్నట్లున్నడా పిలుపు.శివుడు భిక్షాపాత్ర పుచ్చుకొన్నాడు కానీ బిక్షకుడుకాడు.


శివుని కంటే మహా ఐశ్వర్య వంతులు ఎవరూ లేరు.ఎమానవుడైనా ఈజన్మలో రవంత ధనాన్ని అనుభవిస్తున్నాడంటే ,సుఖిస్తున్నాడంటేక్రితం జన్మలో శివ భక్తుడై శివ పూజ చేసి వుంటాడు.అంటారు.ఆశివుడు ఈరోజు యాచకుడై,నందుని వాకిట నిలువబడి వున్నాడు.ఆ మహేశ్వరుని చూచిన వారు ఆయన ముక్కంటి వలె వున్నాడని ,మహా తేజస్సుతో వెలిగి పోతున్నాడని ఒకరితో ఒకరు ముచ్చటించుకొన్నారు. పవిత్రమైన,నిజమైన తేజస్సును ఎవరు దాచ గలరు?పార్వతీ పాటికి కూడా చేతకాలేదు.


వాకిట్లో నిలబడిన బిక్షువును చూచి పళ్ళెం నిండా పళ్ళు,పలహారాలూ సర్ది దాసిచేతికిచ్చి పంపిందియశోడ.


యశోదా దేవి మీకియ్యమని పంపారు.వీటిని స్వీకరించి బిడ్డని ఆశీర్వదించమని కోరింది. అంది దాసీ. నేను భిక్ష తీసుకొను. నాకు దేనిమీదా ఆశ లేదు.నేను కేవలం బాల కృష్ణుడిని చూడాలని వచ్చాను."అన్నాడు శివుడు.


దాసీ లోపలికి వెళ్లి యశోదతో చెప్పింది."ఆయనకీ ఇవేమీ అక్కర లేదటమ్మా! బాల కృష్ణుడిని చూడటానికి మాత్రమె వచ్చాడట. "అంది.సాధువులని పరిశీలించాలి అంటే వాళ్ల వేషమూ జాతి, ప్రాంతమూ కాదు ముఖ్యం. వాళ్ల కళ్ళలోని పరిభాష,నడవడిక తోనేగుర్తించవచ్చు.

పట్టు కమీజులు తొడిగి ,కాలి గజ్జెలు సవరించి నుదుట నామం దిద్ది రెండు బాదిత గింజలు అతికించి నట్లున్న చుబుకంపై నల్లని దిష్టి చుక్క పెట్టి మెడలో ముత్యాలు,పచ్చలు,పులిగోరు హారాలు, అలంకరించి నడుముకు మామిడి పిందెల మొలత్రాడుకట్టి శ్రావణ మేఘాలవంటి జుట్టును పొదివి మెరుపుతీగాతో బంధించి గిలక ఉయ్యాలలో పడుకోపెట్టింది యశోద. ఉయ్యాల పందిర్లో చిలకలు వ్రేలాడుతున్నాయి.కృష్ణయ్య ఊఁ,ఆ అంటాడేమో ఆ స్వరాలు నేర్చుకొందామని ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. స్వరాల సొగసులన్నీ మీ గొంతులో పెట్టి మిమ్మల్ని సృష్టి చేస్తే

ఇంకా తనివి తీరలేదా? అన్నట్లు నా నాదాలు కావాలా? అని కనురేప్పలతో వెక్కిరిస్తున్నాడు కృష్ణయ్య.రాత్రంతా కన్నయ్య పక్కలో ఆడుకొన్న వెన్నెలని వెనక్కి తోసి సూర్య కిరణాలు లోపలికి దూసుకు వచ్చాయి.గాలి మాత్రం అలుపు లేకుండా చల్లగా వీస్తూనేవుంది.కొంటె పిల్లలు వచ్చి కేరింతాలాడి కృష్ణయ్య నిద్ర చెడగొడతారని తలుపులు దగ్గర పెట్టి వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళబోయిన యశోద మళ్ళీ వెనక్కి వచ్చినది.కన్నయ్యకు కప్పిన జలతారు శాలువా సర్ది,ముంగురులు అద్ది వెళ్ళలేక వెళ్ళలేక వంటింట్లోకి వెళ్ళింది యశోద గది గుమ్మం దగ్గర ఇద్దరు ముద్దుగుమ్మలు వామన గుంతలాడుతున్నారు.ఇత్తడి వామన గుంటలలో తెల్లని చిన్ని చిన్ని గవ్వలు లెఖ్ఖ పెడుతూ వదులుతూంటే అవి ఝల్లు ఝల్లు శబ్దాలు చేస్తున్నాయి.వారి చేతి గాజులు ఘల్లు ఘల్లు మనే శబ్దాలు నిశ్శబ్దానికి హెచ్చరికలు చేస్తున్నాయి.మరో వేపు దృష్టి సారించాడు శివుడు.వాకిట్లో పారిజాతం వాళ్ళు తెలియకుండా విరగ బూసి ప్రాంగణం అంతా జలజలా పూలు రాల్చింది. భూమాత ఎంత ఘట్టిదో అంత గొప్పది.గుండె విచ్చిందంటే గుబాళిపులే

అని తెలియ దానికో లేక కన్నయ్య వచ్చి అక్కడ రెండడుగులు వేస్తాడని ఆశో ! ఎర్ర మందారాలు కొమ్మలు మరింత సాగ దీసుకొని ఊగి ఊగి కృష్ణుడిని చూడాలని వేర్రివై కళ్లు ఎర్రబడ్డ కన్నేపిల్లల్లావున్నాయి
విన్డుడైన నందుడు నరుడైనా నారాయణ ప్రభతో వెలిగిపోతున్నాడటమెత్తని పసివానిని హృదయానికి హత్తుకొని ఆనంద లోకాల ప్రాంగణాలు దాటి పరమార్దానందాబ్దిలో ఓలలాడే పవిత్రమూర్తి యశోద మామూలుతల్లా?వట్టి తల్లికాదు.భక్తీ ప్రపత్తుల నయగారపు పంటలు పండించుకొన్న భాగ్యలక్ష్మి. వైకుంఠం నుంచి వేలికివచ్చి ఒడిలో సయ్యాటలాడేఓంకార ప్రణవ నాద మూర్తి చిలికే చిరునవ్వుల జడిలో ఆది అలసిఅర్ధం తెలియని ఐశ్వర్యం గుండెల వాకిట్లో కోటి కాంతులు విర జిమ్ముతూంటే పరవశురాలయ్యే పిచ్చితల్లి యశోద తన బిడ్డ మామూలు పాపడని ఒప్పుకోలేదు_మహానీయుడని గొప్పలు చెప్పుకొందామంటే ఈ జీర్ణ వస్త్రం లోని వజ్రాన్ని ఎవరు దొంగిలిస్తారో నని భయం.తల్లిననే మమకారం జగత్పితకి తల్లిననే ధీరత్వం ఎభావం దాచుకోవాలో,ఏది వెలికి తేవాలో తెలియని అద్వైతం.కృష్ణుడిని దర్శించాలనే కోరిక అందరికి ప్రబల మై పోయింది.అందమైన దేవుడు అందమైన అవతారాలెత్తి మరింత అందమైన లీలలు చేస్తూంటే మనిషి కేమిటి? మహేశ్వరునికి కూడా ఆయన్ని చూడాలని తహతహ పుట్టిందిట.కైలాసం నుంచి కదిలాడు.పరమత గణాలు వెంట వస్తానన్నారు.మిమ్మల్ని విడిచి నేనుండలేను నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి' అంది పార్వతి.శివుడు అంగీకరించలేదు.నిజమైన ఆనందం ఎవరికివారే ఒంటరిగా పొందాలనుకొంటారు.గోకులంలో ఒక ఇంటినుంచి ఇలా పాట విన వచ్చింది.
నల్లని వాడంత
కమల నయనాల వాడన్త
దయగల వాదంత

దొరవంటి వాడంత

నెమలి కన్నులు దాల్చి

నటనలు చేస్తాడంట

నవ్వుల పువ్వులు

విరియించు వాడంత

నందుని పంటంతా

యశోద చంటి యత

ఒకసారి చూసితే

వదలనేలేరంతా

వాడెంత వాడతనే

ఈదేంతో లేదతనే

పలుకక నే పెదవి

మధువులోలుకునంత

అపుడే చిలికిన వెన్న వోలె

చిత్తము మెత్తనయత

మహేశ్వరుడు మెల్లగా నందుని గృహ ప్రాంగణం చేరాడు.తన నిజ రూపం వదిలి సాదు రూపం ధరించాడు.విభూతి,ఉరగము,డమరుకము,త్రిశూలము చేత బూనాడు.బిక్ష కోసం యాచించాడు.యశోద ఆదర్శ గృహిణి,అన్నార్తులకి,అతిథులకి ,సత్సంగులకి సాధువులకి బిక్ష వెయ్యడం ఆమెకి నిత్య విధి.

బిడ్డ ఒంటికి కస్తూరి,పునుగు,జవాది పులిమి

ఆశేశ్వరుడు

ఆశేశ్వరుడు

సిరివెన్నెల

మురిపెముగా జాలువారుతోంది యమైన ఒడ్డున.వెన్నెలంతా బృందావనం వేపే జరుగుతున్నట్లుగావుంది. పిల్లగాలి మెల్లగా వెళ్లి అడిగింది.

"అంత నిశ్శబ్దంగా బృందావనం వేపెచూస్తూ వెళ్తున్నావు ఏమిటి విశేషం?అని.

"ష్ ,మాట్లాడకు అపురూప మైన కృష్ణావతారాన్ని గుండెల్లో దాచుకు సంతోషాతిరేకం తో

ఉబ్బి తబ్బిబ్బవుతున్నది బృంద.గుండెల్లో ఆనందం గొంతులో చిక్కుకొని ,కపోలాలని కందించి వెలుతురుని వడబోసి కళ్ళల్లో నింపింది.బృంద కళ్లు వెండి చేపల్లా మిలమిల మంటున్నాయి.ఆ ఆనందం కాస్త నేనూ చవిచూద్దామని వెళ్తున్నాను.నేనయితే మూగగా వెళ్ళివస్తా,నువ్వు అలా కాదుగా,కాస్త ఆనందం వస్తే ఈలలు వేసి గోల చేస్తావు.చెట్టులో కొమ్మలో దూరి సంగీతాలు ఆలపిస్తావు.నువ్వు నాతొ రాకు బాబూ"అంది వెన్నెల.

"నాకామాత్రం తెలియదా?నీకు ప్రసరించడం ఎంత బాగా తెలుసో నాకు స్థంభించడం అంత బాగా తెలుసు.పద వెళ్దాము అన్నాడు మలయమారుతుడు.ఇద్దరూ బయలు దేరారు.

ఆదివిష్ణువు అందాల సుందరాకారుడై నందుని ఇంట అవతరిస్తే అమందానంద కందళిత హృదయార

Friday, January 2, 2009

చదవండి

చదవండి
కెనడా లో ఒక స్కూల్ వాళ్లు ఒకప్రకటన చేసారుట " చేతిలో పనులన్నీ
కిందపడేసి పుస్తకం చదవండి "అని.అది ఎలాగా కేవలం విద్యార్దు లేకాదు
స్కూలు లో పని చేసే ప్రతివారూ.ఒకరోజుకాదు,ఒక వారం రోజులు.ఒకేటైముకి ౨౦ నిముషాల పాటు అందరూ పుస్తకం చదవాలి.
వారి వుద్దేశ్యం అలా అందరూ చదవడం వల్ల యువతరం వారిలో ఒక
చైతన్యం వస్తుందని,అక్షరాస్యత పెరుగు తుందని, వారికి గ్రంధాలయాల
విలువ తెలుస్తుందని.అలా వరసగా వారం రోజులు చదివిన వారికి
బహుమతులు కూడా ఇచ్చారట. బహుమతులు బయట వారు అందిస్తే
వారికీ ప్రచారం కల్పిస్తామని చెప్పారట.బహుమతులు యువతకి పనికి వచ్చేలా పెన్నులు,పుస్తకాలు,సి.డి లు ,వార పత్రికలూ, విజ్ఞాన దాయక మైన సినిమాలు ఇయ్యాలని సూచించారట.
పిల్లలు అన్నం తినక పొతే ఎన్నివిధాల బ్రతిమాలి, రక రకాల కూరలు చేసి అమ్మ అన్నం తినిపిస్తుందో,పుస్తకము చదివించేందుకు కూడా అలా
శ్రద్ధ తీసుకోని చదివించాలి.
విదేశాలలో గ్రంధాలయాలు ఎంతో ఆకర్శణీయమ్గా వుంటాయి.ఒక
పేటలో నివసించేవారు అక్కడవున్న గ్రంధాలయంలో మెంబర్లయి పోతారు.
ఇంటికి పుస్తకాలు ఒకటికంటే ఎక్కువే తెచ్చు కోవచ్చు.పుష్టం పోస్టులో
వారికి పంపవచ్చు, మధ్యలో హుష్ కాకి అయిపోవు.పుస్తకం ఇచ్చేగడువుని వారు గుర్తు చేస్తారు. గ్రంధాలయాల లో ఎన్నో రకాల పోటి లు ఆబాల గోపాలానికి పెడతారు.పెద్ద వాళ్ల చేత ఉపన్యాసా లిప్పిస్తారు,
సంగిత కచేరీలు ఏర్పాటు చేస్తారు.మంచి సినిమా చూస్తూ భోజనాలు చేసే ఏర్పాటు చేస్తారు.వ్యాయామాలు,డాన్స్ కోర్సులు నడుపుతారు.ఫీజులు వుంటాయి,సమయ ము ఎప్పుడో,ఎంత కట్టాలో కరపత్రాలు అచ్చువేసి పంచుతారు.చిన్నపిల్లలకి వేరే పోటీలు వుంటాయి.ఎవరెక్కువ పుస్తకాలు చదివితే వారికి బహుమతులు వుంటాయి.
పిల్లల పుస్తకాలు చక్కటి పేపరు పై,ముచ్చటైన రంగులతో ముద్రించి నవి వుంటాయి.పుస్తక చౌర్యాలు జరగవు.ఏదైనా పుస్తకం కావాలని అడిగితె తెప్పించి మనకు తెలియ చేస్తారు.
గ్రంధాలయాలుచదివించాలనే ఆశయం తోనేకాక ఆశయ సిద్ది కోసం
ఎన్నో విధాలుగా ప్రజలని తమ వేపుకు తిప్పుకోటానికి ప్రయత్నాలు చేస్తే నిష్ఫలం కావు. పిల్లలకు పుస్తకాలు చదవమని చెప్పే పెద్దలు తామూ చదువుతూ వారిని చదివించాలి.మేము టి.వి చూస్తాము,మేము సినిమాకేల్తాము నువ్వు చదువు అంటే వారికి మనసు నిలవదు.చేసి చేయించండి అప్పుడే పిల్లలకి హేచ్చరించ వలసిన అవుసరం రాదు.పుస్తకాలు చదివితే ఏకాగ్రత, అవగాహనా శక్తి ,ధారణా శక్తి ,స్థిమితము ఏర్పడుతాయి.కొన్ని నిముషాలయినా పుస్తకం పుచ్చుకు
కూర్చునే వాతావరణంకల్పించి ఉత్సుకతను కల్పించండి.పెద్దయాక వాళ్ళకే తెలుస్తూంది పుస్తకాలని మించిన మిత్రులు లేరని. పైగా ౧౫ ఏళ్ళ లోపున చదివిన పాటా,మాటా, పద్యం జీవితాంతము గుర్తు వుంటాయి.

శివస్తుతి

శివస్తుతి
కిస్ విధి వందన కరూ తిహారో,ఔఢరదానీ ,త్రిపురారీ
బలిహారీ,బలిహారీ,జయ మహేష్ బలిహారీ
నయన్ తీన్ ఉపవీత భుజంగా,శశి లలాట సోహేసిర గంగా
ముండమాల- గళ బీచ్ విరాజత్,మహిమా హై భారీ బలిహారీ
కరమె డమరు,త్రిశూల తిహారే,కటి మెహై వాఘంబర ధారే
ఉమాసహిత హిమశైల విరాజత్, శోభా హై న్యారీ బలిహారీ
పల్ మే తుమ హో ప్రభు ప్రళయంకర్, పల్ మే ప్రభో సదయ అభయంకర్
ఋషి ముని బేధ న పాయె తిహారో,హం తో హై సన్సారీ బలిహారీ
అగమ నిగమ తవ బేధ న జానే ,బ్రహ్మా,విష్ణు సదాశివమానే
దేవోంకె ఓ మహాదేవ అబ్ ,రక్షా కరొ హమారీ బలిహారీ
సేకరణ---- జ్ఞాన ప్రసూన