Pages

Friday, July 31, 2009

వరలక్ష్మి దేవి

వరలక్ష్మీదేవి
మనింటికి ఎవరేనా వస్తున్నారంటే శ్రద్ధగా అలంకరిస్తాము.కొత్త కళతెస్తాము.
సాయంత్ర అందరిని గౌరవించి మర్యాదలు చేస్తాము.పిల్లలు కూడా ఇందులో
భాగం పంచుకొని ఆనందం పొందుతారు.
పిల్లవాళ్ళకు ఈఆనందాన్ని పంచుకోవడం పెద్దలే నేర్పాలి.పెద్దలే బద్దకించి పండగలు చేసుకోడంలో అశ్రద్ధ వహిస్తే,కొన్నాళ్ళకి పిల్లలకి
ఏమీ తెలియదు.భారత దేశంలో వున్నా ,విదేశంలో వున్నా మన సాంప్రదాయాలని ముందు తరాల వారికి అందించాలి.

Thursday, July 30, 2009

వరలక్ష్మి దేవి

వరలక్ష్మి దేవి

మన భారత దేశంలో పండుగలు పర్వదినాలు గొప్ప స్తానాన్నాక్రమించాయి. గానుగెద్దులా తిరుగుతున్న జీవితంలో ఈ పండుగలు ఒక చైతన్యాన్ని నింపుతాయి. సంక్రాంతి ,దీపావళి, వరలక్ష్మి వ్రతం, దేవి నవరాత్రులు

చాలా శోభాయమానంగా జరుపుకొంటాము. దేశకాల పరిస్థితులని బట్టి రోజులు శరవేగంతోదొర్లి పోతుంటే

ఈపూజలు పునస్కారాలతో దూరంగా పారిపోతున్నారు.దేముడున్నాడా? అని ప్రశ్నించే యువతరానికి

జవాబు వివరించలేకపోతున్నాము. ఇక వీటిని ఆచరించమంటే మనవంక తేరిపార చూస్తున్నారు యువత.

వీటిలోవున్న సాంఘిక మర్యాదలు, వినోదము,తృప్తి ఈతరం వారు అర్ధం చేసుకో లేకపొతున్నారు.

పండగలకి కళా పోషణకి సంబంధం ఏర్పరిచారు పెద్దలు.దసరాకో,సంక్రాంతి కో బొమ్మలు పెట్టడం ఆడపిల్లలున్న

ఇంట్లో ఆచారంగా వస్తున్నది. బొమ్మలుపెట్టడం అంటే హృదయంలో ని కళా తృష్ణని మేల్కొల్పటమే ! పూర్వపు

రోజుల్లో దశావతారాలు, గోపికా వస్త్రాపహరణం ,రామ పట్టాభిషేకం,త్రిమూర్తులు ,షావుకారు దుకాణం,కొన్ని పక్షుల

బొమ్మలు పెట్టేవారు. ఇప్పుడు ఎన్నో సంఘటనలని, నగరాలని బొమ్మలకోలువులో నిలుపుతున్నారు.

సంక్రాంతి అంటే నెలరోజుల పండగ. ఆడపిల్లల,యువతుల చేతి వ్రేల్లనించి ఎన్ని మనోహరమైన రంగ వల్లులు జాలువారుతాయో!దీపావళికి దీపాల అలంకరణ లో భావుకతని ప్రదర్శిస్తారు. వరలక్ష్మి వ్రతముఅలాగే!

లక్ష్మి దేవిని సర్వాలంకార భూషిత గా ఊహించి అలంకారం చేస్తారు.కొందరి ఇంటి ఆచారం బట్టి కొబ్బరికాయ కి పసుపురాసి బొట్టుపెట్టి రేవికలగుడ్డ మడిచి పైన పెట్టి ,బొట్టుపెట్టి వ్రతం చేసుకొంటారు.కొందరు అమ్మవారి మొఖం వెండిది పెట్టి బిందేపైన కొబ్బరికాయ పెట్టి ఆబిందేకి చీర కడతారు.కొత్త చీరగాని,పట్టు చీరగాని కడతారు. బిందె మెడకి అడ్డంగా పుల్లకట్టి చేతులలాగా రెవిక తొడిగి,గాజులు వేసి అచ్చంగా అమ్మవారు కూర్చున్నట్లే వుంటుంది.నగలు అలమ్కారంచేసి,సవరం పెట్టి పూల జడవేసి సింగారిస్తారు. జరీ అంచులున్న చీర కడితే మెరిసిపోతుంది.వరలక్ష్మి వ్రతానికి రెండు పెద్దపనులు,ఒకటి అమ్మవారిని తయారు చెయ్యడం,రెండోది తొమ్మిది పిండివంటలు చెయ్యడం.

చేతికి ఎవరు సాయం లేకుండా ఈ రెండు పనులు ఒక్కరే చేయడం కష్టము.క్రితం రోజు సాయంత్రమే అమ్మవారిని

తయారు చేసికొంటే తప్ప పూజనాడు ఖంగారు అయిపోతుంది.కొబ్బరికాయ మాత్రమె పెట్టేవాళ్ళు కొబ్బరికాయకు

పసుపు రాసి కాటుకతో కళ్లు దిద్ది,గోధుమపిండి కలిపి ముక్కు చెవులు పెట్టి కుంకుమ తడిచేసి పెదవులు దిద్దుతారు

పూజ నాడు ముత్తైదు వలని పిలిచి వాయనాలిస్తారు.వచ్చిన వాళ్లు అమ్మవారి అలంకారం చూసిపోగాడుతున్నపుడు

ఏంటో ఆనందం వస్తుంది.

మన ఇంటికి పేరంటానికి వస్తున్నారంటే మన ఇల్లు అందంగా ఆకర్షణీయంగా వుండాలని చక్కగా

దిద్దుకొంటారు.కొత్తదనం శుభ్రత కనిపించాలని కోరుకొంటాము.

Saturday, July 4, 2009

బినీ బేబీస్

బినీ బెబీస్
సమ్మర్ సెలవులు అనెసరికి పిల్లలకి కాలక్షెపం కొసంకొసం బొలెడు ప్రొగ్రాములు అనౌన్స్ చెస్తారు,ఫలానాచొట ఫలాన రొజు,ఫలానా టైముకి,ఫలాన పొటీ పిల్లలకి జరుగుతుంది మీ పిల్లలని
తీసుకురావాలంటె రిజిస్టెర్ చెయ్యండి అంటారు. అన్నిటికి మన కంప్యూటర్ మామయ్య వున్నాదుగా,ఆయనకి చెపుతె చెసెస్తాడు."శహనాకి ఇవాళ ""బినీ బెబీస్ "ప్రొగ్రాం వుంది దొడ్డా వెళ్దాము అంది రాధిక.పిల్లని తీసుకువెళ్ళాము. మిల్ వాలీ పబ్లిక్ లైబ్రరీ లొ చిల్డ్రెన్స్ రూంలొ జరిగింది.పిల్లలకొసం కెటాయించిన స్థలం,కొన్ని రూములొనూ కొన్ని వాతావరణం బాగుంటె ఆరు బయట చెస్తారు.బినీబెబీస్ ఆరుబయత చెసారు.సంఫ్రంచిస్చొ లొ రొడ్లన్ని ఎత్తులు పల్లాలు.మెలికలు.ఈ లైబ్రరీ కొండ
మీద చెట్ల మధ్య వుంది.బాగా ఎత్తుగా పైన గుబురుగా వుండె చెట్లు ఒకచొట గుంపుగా పదిమంది నులుచుని తలలు దగ్గర పెట్టి ఎదొ సమస్యని చర్చిస్తున్నట్లుగా వున్నాయి.వాటి నీడ ఇంటికప్పులా చల్లగా వుంది.అక్కడొక రాతి తిన్నెవుంది.అక్కడ జరిగింది. పక్కనె చిన్న సెలయెరు ఉషారుగా పరుగెత్తుతున్నది. మెము వెళ్ళెసరికి ప్రొగ్రాము నడిపె ఆవిడ సామాను తొ సహా సిధ్ధంగా వుంది.రెండున్నర ఎళ్ళ వయసు పిల్లల్ని కూడా తల్లులు తీసుకు వచ్చారు.అందరూ చెరాక పిల్లల్ని గుండ్రంగా కూర్చొ పెట్టి తల్లలు, వెంట వచ్చిన వాళ్ళు వాళ్ళ వెనకె కూర్చున్నారు.అందరూమట్టి నెల మీదే కూర్చున్నారు.ఆ చెట్ల నీడ మధ్య రెండుమూడు సూర్య కిరణాలు "ఎంచెస్తున్నారో? చూద్దాము అన్నట్లుగా దూసుకు వచ్చాయి.
ఒకామె బొమ్మల పుస్తకం తెచ్చి కధ చెప్పింది. చెట్లు కావాలంటె నెల బాగుచెసి,ఎరువు వెయాలి,గింజ నాటాలి,నీరుపొయాలి అని చూపించి చెప్పింది.తరువాత అందరికి టెర్రకొట
కుండీలు బుల్లివి ఇచ్చారు.వాటిమీద రంగులతొ డిజైన్స్ వెయ్యడానికి రంగు పెన్సిల్స్ ఇచ్చారు,అంటైంచ డానికి ఒక స్టిక్కెర్ ఇచ్చారు. పిల్లలు గబగబా రంగులు పూసెసారు,వాల్ల పెర్లు కుండీపై వ్రాయమన్నారు, వ్రాసెసారు.పిల్లలు పెయింట్ చెస్తూంటె తల్లులు ఆనంద పడిపొయారు,పిల్లలకి గర్వం చెసామని. తరువాత పిల్లలందరిని పొట్స్ తీసుకొని లైనుగా నిలబడమన్నారు.బుధ్ధిగా నుంచున్నారు.అప్పుదు వాళ్ళ కుండీలలొ ఒకావిడ మట్టిపొసింది,వాళ్ళెతెచ్చారు.మరో ఆవిడ బీన్స్ గింజ దానిలొ నాటింది,మరొ ఆవిడ నీళ్ళు పొసింది..ప్రింట్ చెసిన కార్డ్ ఒకటి ఇచ్చారు,దానిపై"చెట్లుపెంచాలంటెకొంచెం మట్టి,ఒక గింజ,కాసిని నీళ్ళు,కాస్త ఎండ,కాస్త ప్రెమ కావాలని వ్రాసారు.
ఇది అయిపొగానె పిల్ల లందరూ పొలో మంటూ నీళ్ళ దగ్గరికి పరుగ్ర్తారు,తల్లులు కాసెపు నీళ్ళతొ ఆడాక పక్కనున్న లైబ్రరీకి వెళ్ళాము.పెద్దపెద్ద అద్దాల కిటికీలున్న హాలుల్లొ లైబ్రరీ విసాలంగావుంది.బయటికి చూస్తె అందమైన ప్రక్రుతి.నిస్సబ్దం.అందరూ లాప్ తాప్లు తెచ్చుకొని కాఫీతాగుతూ చదువు కొంటున్నారు.లెఖ్ఖ లెనన్ని పుస్తకాలు.చిన్న జీవితం.జన్మంతా వెచ్చించినా
వాటి పేర్లుకూడా చదవలెమోమో?అనిపించింది.పిల్లలు తయారు చెసిన బొమ్మలతొ ఆవిభాగం అంతా అలంకరించారు.లైబ్రరీ వాళ్ళు బూక్ మార్కెలు ప్రింట్ చెసెందుకు బొమ్మలకొసం పిల్లలకి పొటీ పెద్తారట. ఫష్ట్ వచ్చిన వారి బొమ్మ తీసుకు చార్డ్ తయారు చెసి బొమ్మ వెసిన వారి పెరు,వయస్సు
వెస్తారు.ఇలాటివి ఎంతొ ప్రొత్సాహాన్నిస్తాయి.
రాధిక వాళ్ళతొ మెము ఇండియా వెల్తున్నాము వచ్చాక కలుస్తామని చెప్పింది. వాళ్ళు సహనాకి
ఒక తెల్లకాగితాల బూక్,పెంచిల్ ఇచ్చారు,అక్కడి విషెషాలు వ్రాయమని చెప్పారు.వాళ్ళకి ఉత్తరాలు వ్రాయమని కవర్లు,కాగితాలు,స్టాంపులు ఇచ్చారు.ఒకషీటుపై లైన్లు వెసివున్నాయి.రొజు 20 నిముషాలు పుస్తకం చదవాలి,చదివి అందులొ నొతె చెయ్యాలి. ఆకడినుంచి వ్రాసిన ఉత్తరాలు బాగుంటె లైబ్రరీలొ డిస్ప్లె చెస్తారట.చిన్నపిల్లల విభాగంలొ కూడా పెద్ద డిక్ష్నరీలు ఉన్నాయి,పిల్లకి వెరె వున్నాయి.పుస్తకాలు,డ్వ్డ్లు ఇంటికి ఇస్తారు,ఫ్రీగా.పిల్లలు పుస్తాకాలు చదివె అలవాటు పెంచడానికి తల్లులు కూడా శ్రమ్ పడతారు.చిన్నపిల్లల్ని తీసుకు వచి పుస్తకాలు చదివి వినిపిస్తారు. చక్కటి వాతావరణంలొ అక్కడకూర్చుని పుస్తకాలు చదువుకొవాలనిపించింది.

Wednesday, July 1, 2009

గ్రా డ్యుఎ షన్ gra







గ్రా డ్యు ఎ షన్
పిల్లల్ని బాగా పెంచాలి,చదివించాలి అని తలితండ్రులకి ఎన్నో ఆశ
లుంటాయి.ఆ ఆ శలకి దోహదం కలిగి మంచి వాతావరణం ,మంచి స్కూలు,
ఖర్చు పెట్టేందుకు తగినంత ధనమ్ వుంటే ముందుకు సాగ వచ్చు.తలితండ్రులకు ఉత్సాహం వున్నా కలిసిరాకపోవచ్చు.కొన్ని కొన్ని
ప్రదేశాలను బట్టి మంచి స్కూళ్ళు దొరుకుతాయి.ఈ రోజుల్లో పిల్లలకు మంచి అవకాశాలు,ప్రోత్సాహము లభిస్తున్నాయి.విదేశాలలో పిల్లల స్కూళ్ళు చూస్తె ఆహ్లాదకరంగా వుంటాయి.పిల్లల మనస్సులను స్కూలుపట్ల
ఆకర్శింప చేసేందుకు వారు ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూవుంటారు.
మా అబ్బాయి పిహెచ్ .డి కాన్వోకషనుకి యు.ఎస్ వచ్చాను.
అక్కడినుంచి రాధిక దగ్గరికి వచ్చాను."రేపు మా అమ్మాయికి గ్రాడ్యు ఎషన్
పంక్షన్ వుంది,సరిగా సమయానికి వచ్చావు దొడ్డమ్మా!'అంది.గ్రాడ్యుకెశనా అన్నాను.దాని కూతురు చాలా చిన్నది.'ఇక్కడ పిల్లలకి నర్సరీ అయిపోగానే స్కూలువాళ్ళు గ్రాద్యుకేషన్ చేస్తారు.రేపు చూద్దువుగాని'అంది.మర్నాడు రాధిక దానిపాప సహనకి చక్కటి డ్రెస్సు
వేసింది.ముత్యాలు పగడాలు కలిపిన దండ వేసింది.ఏడు నెలల పసివాడు
జయ కార్తిక్ ని తీసుకొని స్కూలుకి వెళ్ళాము.నర్సరీ స్కూలుఒక హాలు,వరెండా .హాలులో ఒక వేపు డైనింగ్ టేబిల్ వుంది,చిన్నచిన్న కుర్చీలు వేసారు.గోడలు కనిపించకుండా పిల్లలు వేసిన బొమ్మలు అతికించారు.పక్షులు ఎగిరిపోతున్నట్లు పెద్దచిత్రంగీసి,"వుయ్ ఆరఫ్లైయింగ్
ఆఫ్ టు కిన్దర్ గార్టెన్ అని వ్రాసారు.గోడకి పెద్ద పేపర్ అంటించి దానిపై పిల్లల పేర్లు వ్రాసి కవర్లు అంటించారు. తలితన్ద్రులతో ఏదైనా చెప్పాలంటే
కార్డ్ మీద వ్రాసి ఆ కవర్లలో పెడతారు.వాళ్లు వచ్చినపుడు చూసుకొని జీతాలు అవి కట్టాలంటే కడతారు.
స్కూలు అంతా పిల్లలతో అమ్మానాన్నలతో నిండిపోయింది.అందరి చేతుల్లో కెమెరాలు సిద్ధంగా వున్నాయి.నల్లటిబట్ట
నల్లటి అట్టలతో టోపీలు గ్రాడ్యుకెశన్కి తయారు చేసారు.టోపికి గోల్డ్ కలర్ త్రాడు,కుచ్చులు వ్రేలాడుతోంది.పిల్లలందరూ ముచ్చటగా డ్రేస్స్లు లు వేసుకొన్నారు,మెడలో దండలు వేసుకొన్నారు,హైర్పిన్నులు వాళ్ళంతా ఆత్రంగా వున్నారు.పిల్లలకి టోపీలు పెట్టి వరెండాలో వరసగా నిన్చోపెట్టారు
టైం అయాక వాళ్ళని లోపలికి తీసుకువచ్చి బెంచీలపై కూర్చోపెట్టారు.ప్రిన్సిపాల్ చిన్న స్పీచ్ ఇచ్చింది.వీళ్ళకి డిగ్రీలు చిన్నాకాగితాలపై వ్రాసి టీచర్ సంతకం చేసినవి రోల్ చేసి ఒక పేము బాస్కేట్లో పెట్టి ఒక పిల్లవాని చేతికిచ్చారు.స్టూడెంట్ పేరు చదవగానే ఆడిగ్రీ
టీచెర్ చేతిలో పెడతాడు,పిల్లలు వచ్చి తీసుకొంటారు.థాంక్స్ చెప్పి వెళ్లి వాళ్ల జాగాలో కూర్చుంటారు.కొందరు బిక్కుబిక్కు మంటూ తీసుకొన్నారు,కొందరు పరుగెత్తి తెచ్చుకొన్నారు,వాళ్ల హావభావాల్ని తలి తండ్రులు కెమెరాలో బంధించారు.అప్పుడు వాళ్లమొఖాలు వెలిగిపోయాయి.పిల్లలు తలి తండ్రులు,పిల్లలు ఫ్రెండ్స్ ,పిల్లలు టీచర్లు ఫోటోలు తీసుకొన్నారు.గార్డెన్లో పది తెగ గెంతారు.
లంచ్ కోసం అందరూ తలో ఐటం తెచ్చారు,పిల్లల్ని టేబిల్ చుట్టూ కూర్చో పెట్టి తల్లులు,టీచర్లు తినిపించారు.తరవాత మా అందరికి లంచ్
పెట్టారు.సహనని తీసుకు ఇంటికి వచ్చాము.