"బాధ పడుతున్నావా"అందిపాంట్
చీర కనురెప్పలు కిందికి వాల్చింది.
ఇంతకంటే మంచి వాళ్ళే కొంటారులే!విలువ తెలియని వాళ్ళకి అమ్ముడు పోవడం కంటే ఆత్మ హాని మరొకటి లేదనుకో!అంది.
'ఏమిటో!రోజూ ఇలా దుమ్ములో వేలాడ వలసినదేనా!'అంది చీర.
ఇంతలో పొడుగ్గా సన్నగా వున్నా ఒక వ్యక్తీ లోపలికి వచ్చాడు.అతని వంటిపై లాల్చీ ,పంచ చూసిపాంట్ నీళ్లు గారిపోయింది.ఆ వ్యక్తీ లోపలికి వెళ్లి పై పంచాతో ఒకసారి మొహం తుడుచుకొని శాపంతా కలయ జూసాడు.
"పంచలు చూపించ మంటారా?"అన్నాడు గుమాస్తా.
వాకిట్లో పాంట్ కిసుక్కున నవ్వింది.అవును .అతనికి అంతకన్నా ఏమికావాలిలే!అని, చీరవంక చూసి "ఎంతకాల మైనా సరే!మాంచి దర్జాగా వుండే అందగాడి దగ్గరికి వెళ్ళాలి.అస్తమానూ బండనేసి బాడే వాళ్ల దగ్గరికి పోకూడదు బాబూ!ఎక్కడ నలిగిపోతానో,ఎక్కడ మాసిపోతానోఅనుకొనే వాళ్ల దగ్గరికి వెళ్ళాలి.మామూలు వాళ్ల దగ్గరికి వెడితే పోగుపోగుకి రంగు వెలిసెలా ఉతికి బతికుండగానే చంపేస్తారు.
"అవును నాకూ అలానే అనిపిస్తుంది.మొన్న ఆమధ్య కామాక్షమ్మ నూట యాభై పెట్టి ఎర్ర చీర కొనుక్కెల్లిండా? నిన్న కట్టుకొచ్చింది,తొంభై ఎల్ల తోక్కులా చేసింది చీరని.ఏమి మనుషులో!కొనేదాకా వుండే ఆరాటం కొన్నాక వుండదు. హాయిగా కాలేజి అమ్మాయి కొనుక్కొంది అనుకో ఎంత బాగా చూసుకొంటుంది? ప్రాణం కంటే ఎక్కువగా!ఎప్పుడన్నా తొందర పడి మనం ముడుచుకొన్నా,వెంటనే కనిపెట్టి ఎంత పనిలో వున్నా సర్ది సరి చేసుకొంటుంది.అసలు వాళ్లు విస్త్రీ చేసిన చీరకట్టి పొడుగ్గా పమిట వేసుకొంటే తెరచాప లా వుంటుంది."అని ముసిముసి నవ్వులు నవ్వింది.
తను నిజం గానే కాలేజి అమ్మాయి వంటి నలన్కరించినట్లు -రోడ్ల మీద పోయే ప్రతివారూ తననే చూస్తున్నట్లు ఉహల్లో తేలిపోయింది.తీరా చూస్తె అక్కడ పాంట్ లేదు. లోపలికి తొంగి చూసింది చీర.ఆపంచే కట్టు ఆయన పాంట్ ని చేతిలోకి తీసుకొని దీపం వెల్తురులో రంగు,డిజైను పరిశీలిస్తున్నాడు.చివరికి తృప్తి చెంది బిల్లు వ్రాయించాడు. పాంట్ కి ఆయన దగ్గరికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు.అన్చేతరెండు సార్లు ఆయన చేతిలోంచి కిందపడింది.మల్లి గుమాస్తా జాగ్రత్తగా మడిచి జైలు లాటి సంచీలోకి దోపి పిన్ చేసాడు.ఆ వ్యక్తీ పాకెట్ చేతి సంచీలోపెట్టుకొని వెళ్ళిపోయాడు.ఆఖరు సారి చూడలేక పోయినందుకు చీర చింతించింది.పోనీలే!తనయనా బయట పడ్డాడు.నిజానికి ఆ పాంట్ కొనుక్కొన్న మనిషికి మనసుంటే చీరకూడా కొంటాడు.అదే గనక నన్నే కొంటె ఇద్దరం ఒక చోటే ఉంటాము.
పంచెకట్టు వ్యక్తీ పాంట్ ని చాలా రోజులు పెట్టెలో దాచాడు.అతి స్వేచ్చని భరించలేక విసుక్కొంటే చీకటి జైలు వచ్చింది. అనుకోండి పాంట్.తెచ్చిన పెద్ద మనిషి కుట్టించుకోని వేసుకోదేమి?
పెట్టెలో పక్కనున్న చీరలు తగిలి నప్పుడల్లా పూల చీర గుర్తుకు వచ్చేది.పాపమెలావుందో?ఎవరైనా కొనుక్కోన్నారో,లేదో?ఎలాగైతేనేమి పంచకట్టు ఆసామి పంటని ఒకరోజు బయటికి తీసాడు.టైలర్ షాపుకి వెళుతున్నా అనుకోండి పాంట్ బట్ట.కాని చాలా హడావుడిగా వున్నా ఒక ఇంటికి తీసుకు వెళ్ళాడు.తను వుండి వచ్చిన షాపును మించి లైట్లు వేలుగుతున్నాయక్కడ.రంగు రంగుల కాగితం పొట్లాలు చేతిలో పట్టుకు,రకరకాల దుస్తులు ధరించిన వాళ్లు వస్తూనే వున్నారు.పంచెకట్టు వ్యక్తీ అక్కడ ఓమూల నుంచున్నాడు.ఆ ఇంటి యజమాని ఒకసారి తన వంక చూస్తాడేమో,వచ్చాను అని ఇకిలిద్దామని ఆశ పడుతూ.చాలా సేపటికి చూసి తల పంకిన్చాడాయన.మల్లి తన వంక చూడడేమో అని తన చేతిలో వున్నా పోట్లాము గభాలున ఆయన చేతిలో పెట్టేసాడు.యజమాని ఒకసారి తల పంకించి పొట్లం పక్క నున్న నౌకరు చేతికిచ్చాడు.ఆవాల పంచెకట్టు ఆయన అధికారి ఇంట్లో గృహ ప్రవేశం.ఉద్యోగ రీత్యా వెళ్లక తప్పదు.వెళితే ఏదో ప్రెజెంట్ తీసుకు వెళ్ళాకా తప్పదు.గృహ ప్రవేశం కదా!కొత్త బట్ట పెట్టినట్లున్తుందని
తీసుకొచ్చాడు. దానితో అతనికి పదినెలల వాయిదాల అప్పు కూడా వచ్చింది. తన కర్తవ్యమ్ నేర వేర్చా
ననుకొన్నాడు.ఆ ఇంట్లో రకరకాల ప్రేజేంట్ల మధ్య ఒక రోజు గడిపింది పాంట్.ఆ ప్రేజెంట్లలో స్టీలు బిందెలూ వున్నాయి,ఎలెక్ట్రిక్ సామాన్లూ వున్నాయి.వెండి బగారు ఆభరణాలు వున్నాయి.ఇస్త్రీ పెట్టె ఎర్రని కంటితో చూస్తూ స్టీలు బిందెతో అంది
"ఎవరు తెచ్చారు !నిన్ను!
"అదే! రామలింగం -ఆయన ఏది తెచ్చినా కళ్ళకి నిండుగా ఉండాలంటాడు.
"ఆ!దీనికింత లాభం ఏదో పొందే ఉంటాడులే!పక్కనున్న ప్లాస్టిక్ డబ్బాలోని గొలుసు ఒళ్ళు విరుచుకోండి.తననయినా గొప్పగా చూసుకొంటారేమో అనుకొంది.వీళ్ళకి బంగారం అన్నా లెఖ్ఖ లేడుకాబోలు?అనుకొందిగోలుసు.ఆ మర్నాడు నౌకరు ఇంటి యజమానురాలు కలిసి అన్నిటిని సర్దారు.పాంట్ బట్ట చక్క బీరువాలో అడుగుకు వెళ్ళింది.
అబ్బ! మళ్లిజైలా ?అనుకొంది.
* * * * * *
అనుకోకుండా ఎరియర్స్ వచ్చాయి వేణు మాధవ్ కి ,చాలాకాలంగా సుజాతకి ఒక చీర కొని ఇయ్యాలని ఉహ.వాళ్ళాయన బోలెడు కొంటాడు.నిజానికి తను కొనాల్సిన అవుసరం లేదు.కాని అది ఒక కోరిక.తనుకొన్న చీర సుజాత కట్టుకొంటే చూడాలని.తీరా కొని ఇస్తే కట్టుకొంతుందో లేదో?అయినా కాని ప్రయత్నం చేస్తే పోయేదేముంది? కల్పనా షో రూములోనికి జొరబడ్డాడు వేణు.వేల్తూన్డగానే పూల చీర తలకి తగిలింది.అదే పాక్ చేయించి తీసుకు వెళ్ళాడు.సాయంత్రం ఆరున్నర దాటాక సుజాత ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడో సుజాత తనకి అప్పు ఇచ్చింది. అది ఇలా తీర్చాలని అనుకొన్నాడు.సుజాత అది అప్పుగా ఇవ్వలేదు.చీరకిదేమీ అర్ధం కాలేదు.పాకెట్లో గిల గిలా కొట్టుకొంది.తన యజమానురాలు ఎలావుందో?సుజాత పనిలో మునిగి వుండి.ఆమె భర్త తో కాసేపు మాట్లాడి వేణు పాకెట్ బల్ల మీద పెట్టాడు."ఇదేమిటి?"అన్నాడు సుజాత భర్త.
"అబ్బే!ఏమిలేదు.నిన్న మా ఆవిడ బజారు వెళ్లి చీరలుకోంది.ఈ చీర సుజాత కి బాగుంటుంది అనిపించి పంపించింది.అన్నాడు.
"ఎంత?అన్నాడు సుజాత భర్త.
అదేమీ వద్దు అని వేణు లేచి వెళ్ళిపోయాడు.
భర్త సుజాత నిపిలిచి చీర ఇచ్చాడు.
చిచి ఆవిడ నాకు చీర కొనదమేమిటి.కొంటె తనే తెచ్చి ఇయ్యోచ్చుగా మధ్య ఈ మాంధాత ఎందుకు? అనవసరం చనువు తీసుకొని పనులు చేసే వాళ్ళంటే నాకు మహా చిరాకు"అని ఆ చీరని పురుగులా విసిరేసింది సుజ్స్స్త."మళ్లి వస్తే ఇచ్చెయ్యండి"అంది.
"వెనక్కి ఇస్తే ఏమి బాగుంటుంది?చీర చించి రెండు ఓణి లు cheyyi,ఒకటి పనిపిల్ల పోచంమకి,రెందోదిమా కామ్పౌందర్ చేల్లెలికియ్యి.చిన్న వయస్సు లోనే పక్ష వాటం వచ్చి మంచంలో పడివుంది". అన్నాడు.
వాళ్ల మాతలువినగానే చీర గుండె రెండుగా చీలిపోయింది.ఏమి ఉహించింది తను?ఏమి జరుగుటింది?బల్లిలా వుండే పనిమనిషి ఒంటిమీదికా?మరోకతిరోగా గ్రస్తురాలైన కామపౌందర్ చేల్లెలికా?అనికుమిలింది.సుజాత వెంటనే నిర్దాక్షిణ్యం గా చీరని రెండు ముక్కలు చేసింది.చేరోకరికి అమ్పిందికూడా!
* * * * *
ఆఫీసరుగారి బామ్మరిదికి ఖర్చుకి చేతులో డబ్బులులేక ఆత్రంగా బీరువాలన్నీ వెదికాడు.ఏది తీసినా ఆచూకి తెలియ కుండా వుండాలి.బీరువా అడుగు అరలో అయిదారు పాంట్ బట్టలున్నాయి.అందులో ఒకటి పోయినా పట్టించుకోరులే!అని పంచెకట్టు ఆసామీ ఇచ్చిన పాంట్ బట్ట తీసుకొన్నాడు.అది పట్టుకుపోయి కనిపించిన రిక్షా వాడికి అమ్మి ఆపూటకి అవసరం తీర్చుకొన్నాడు.పాంట్ కుట్టించుకొన్న క్షణం నుంచి వదల లేదు గంగన్న.వానలో ఎండలో అదే శరణ్యం.కనీసం ఒక్కసారి ఒళ్ళు రుద్దుకు స్నానం చేయాలనిపాంట్ కోరిక,rప్చ్ తీరలేదు.రిక్షాలోంచి పెట్టెలూ,బెదాలూ లాగుతూంటే పాంట్ కోర్రులు పట్టిపోయింది.తెల్లటి మాసికలు వేయించాడు గంగన్న. పోనీ ఇప్పుడయినా నన్నోదలకూదడూ?అనుకొంది పాంట్.
చాలా రోజులకి రిక్షాలో తనకు తెలిసిన చీర hకనిపించింది పాంట్ కి .కాని సగామయిపోయింది.తనకంటే మురుకిగ అయింది.బాగా ఎరుగున్నాడుకనక తను గుర్తు పట్టాడుకానిమరోకరయితే పూల చీరని గుర్తు పట్టే వారే కాదు.
"బాగున్నావా?" అని పలకరించాడు.
ఉలిక్కిపడింది సగం చీర.అటూఇటూ చూసింది.రిక్షా గంగన్న వంటిపై మాసికలతో పాంట్ బట్ట.అయ్యో!ఎలా అయిపోయాడో!
'చూస్తున్నావుగా?"అంది.
"నేనూ నీలాగే " షాపులో బతుకే బాగుంది.పాట ముందు వచ్చే వాయిద్యం లాగా జీవితం ఉహలలోనే బాగుంటుంది.చాలా nరోజులకి క్యలిసాం.ఎప్పుడయినా కష్టం,సుఖం కనుక్కొంటూ హుషారుగా ఎగిరింది ఓణి -అంటే రిక్షా చక్రంలో చుట్టుకుపోయి కట్టిరించుకు పోయింది.మిగిలిన కాస్త ముక్క గుండెల కడ్డం పెట్టుకొని పరుగెత్తింది పనిపిల్ల. aసైకిలు చక్రానికి అజేబులో కుక్కు కొన్నాడు రిక్షా వాడు,ఉతుక్కొంటే మొఖం తుడుచుకొందుకు పనికి వస్తుందని.పాంట్ జేబులో ముడుచుకు కూర్చున్న చీరముక్క ఇప్పటికింతే చాలు అనుకొంది,కన్నీళ్ళలో పన్నీటి పరిమళాలు నిండాయి
Monday, November 30, 2009
పూల చీర - 3
Posted by
జ్ఞాన ప్రసూన
at
Monday, November 30, 2009
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
కథ
Sunday, November 29, 2009
పూల చీర -2
పాంట్ సంతోషంగా "నేచేప్పానా!చూడుఆవిడ కొంతున్దిలే వెళ్ళు వెళ్ళు.'అంది.
శాపుకుర్రవాడు కర్రతో చీర కిందికి దించాడు.ఒళ్ళు ఝల్లు మనేలా ఒకసారి విడలించాడు.గాలిలో తేలిపోతూ చీర లోపలికి వెళ్ళింది,వచ్చిన ఇల్లాలు చీరపట్టుకొని తిరగ మరగ చూసింది.పువ్వులను గోటితో గీకింది.పమిట కొంగు చేతి మీద వేసుకోండి.
"ఎంతబ్బాయి ఇది?అంది.వాడు చీరంతా వెతికి ఒక మూల వేసిన అంకెలు చూసి"అరవై నాలుగు"అన్నాడు."నాలుగు కూడా ఎందుకుపైన?అని ఆవిడ మూతితిప్పింది.
చీరలు చూస్తోంది.దాతియైన రంగుల్లో ఉలిపిరి కాయితాలలా వున్నయవి.ఈ ఇల్లాలు చేతిలో చీరనలా వదిలేసిఅటువంగి ఆచీరలు చూడటం ప్రారంభించింది.ఆ పడుచు రెండు చీరలు ఏరి పాక్ చేయమంది.గుమాస్తా ఆ చీరల్ని లున్గాగా చుట్టి నౌకరు మొహం మీద విసిరేసి,పాక్ చేసి,బిల్లు రాయిన్చారా!అన్నాడు.చెప్పకుండా మొహం మీద పన్నీరు జల్లి నట్లయింది,ఇల్లాలికి.తనూ అదే తీసుకొంటా ననుకొంది.
అవి ఎంతబ్బాయ్? అని అడిగింది.
"ఇవండీ!ఎనభై మూడు అన్నాడతను.చీరమాడట పెడుతూ.చీర ధర వినేసరికి భర్త జ్ఞాపకం వచ్చాడు ఇల్లాలికి .ఏరీ!ఈయన!అని వెతుక్కొంది.తన తాలూకు పెద్దమనిషి వాకిట్లో నిలబడి పాంట్ బట్టల రెట్లు పరీక్షిస్తున్నాడు.ఆ ఇల్లలికి భయం వేసింది.కొంప దీసి అందులో ఒక పాంట్ ఆయనకీ నచ్చిందంటే,చెల్లెలికి చీరకి డబ్బు చాలదు.గబా గబా బయటికి వచ్చి "ఒసారిలా రండి."అంది.
నేనెందుకు?నువ్వు చూసుకో!
చూసానులెండి.మీరుకూడా ఒకసారి చూస్తె-
ఆ ఇల్లాలు ఉద్దేశ్యం చీర చూసి సెలెక్టు చెయ్యమని కాదు-ఖరీదుకు,ఊ అంటాడా లేదా?అని.ఆయన తప్పని సరిగా లోపలికి వచ్చాడు.ఆవిడ తను ఎన్నిక చేసిన చీర పరచి"ఇదుగో!ఈచారాల్ చీరండీ!బాగుందికడూ!
నీలంచారలమీద,పచ్చని పువ్వులు కొట్టొచ్చినట్లు న్నాయి.అంది.పూలేమోకానీ,ఖరీదు ఆయన్ని కొట్టింది.కాని వద్దనడానికి వీలు లేదు.రెండు రోజుల్లో మరదలు పెళ్లి.ప్రెజెంటేషను ఇవ్వాలి.తనయితే అట్లాకాడో,అప్పడాల కర్రో చదివిన్చేవాడు.కాని ఆవిడ రాత్రివేళ చల్లగా ఏమండీ మా చెల్లెలికి బాగా గుర్తుండేలా మంచి ప్రెజెంట్ ఇయ్యాలి,వెండి దేదయినా ఇస్తే నాలుగు కాలాల పాటువుంటుంది"అంది."ఇయ్యి,ఏదైనా ఇంట్లో వుంటే"!అన్నాడు.
"ఇంట్లోనా!భలేవారే!ఎప్పుడయినా చూసారా?అంది.
సరే!వెండి లోంచి వలువల్లోకి తెచ్చేందుకు ఆర్ధిక శాస్త్ర మంతా అప్ప జెప్పాల్సి వచ్చింది.అంచేత మాట్లాడకుండా "ఊ!తీసుకో!'అన్నాడు.వెంటనే ఆ చీర తీసుకోండి ఇల్లాలు.పూల చీరని తెచ్చిన దానికంటే విసురుగా తీసుకెళ్ళి వాకిట్లో పైన తగిలించాడు కుర్రవాడు.పూల చీర పాంట్ వంక చూడలేక తల పక్కకు తిప్పుకొంది.పాంట్ ఎవరికీ వినపడ కుండా"ఏయ్ !ఓయ్!అంటూ పిల్చింది.అరగంటకి తల తిప్పి చూసింది పూల చీర.
శాపుకుర్రవాడు కర్రతో చీర కిందికి దించాడు.ఒళ్ళు ఝల్లు మనేలా ఒకసారి విడలించాడు.గాలిలో తేలిపోతూ చీర లోపలికి వెళ్ళింది,వచ్చిన ఇల్లాలు చీరపట్టుకొని తిరగ మరగ చూసింది.పువ్వులను గోటితో గీకింది.పమిట కొంగు చేతి మీద వేసుకోండి.
"ఎంతబ్బాయి ఇది?అంది.వాడు చీరంతా వెతికి ఒక మూల వేసిన అంకెలు చూసి"అరవై నాలుగు"అన్నాడు."నాలుగు కూడా ఎందుకుపైన?అని ఆవిడ మూతితిప్పింది.
చీరలు చూస్తోంది.దాతియైన రంగుల్లో ఉలిపిరి కాయితాలలా వున్నయవి.ఈ ఇల్లాలు చేతిలో చీరనలా వదిలేసిఅటువంగి ఆచీరలు చూడటం ప్రారంభించింది.ఆ పడుచు రెండు చీరలు ఏరి పాక్ చేయమంది.గుమాస్తా ఆ చీరల్ని లున్గాగా చుట్టి నౌకరు మొహం మీద విసిరేసి,పాక్ చేసి,బిల్లు రాయిన్చారా!అన్నాడు.చెప్పకుండా మొహం మీద పన్నీరు జల్లి నట్లయింది,ఇల్లాలికి.తనూ అదే తీసుకొంటా ననుకొంది.
అవి ఎంతబ్బాయ్? అని అడిగింది.
"ఇవండీ!ఎనభై మూడు అన్నాడతను.చీరమాడట పెడుతూ.చీర ధర వినేసరికి భర్త జ్ఞాపకం వచ్చాడు ఇల్లాలికి .ఏరీ!ఈయన!అని వెతుక్కొంది.తన తాలూకు పెద్దమనిషి వాకిట్లో నిలబడి పాంట్ బట్టల రెట్లు పరీక్షిస్తున్నాడు.ఆ ఇల్లలికి భయం వేసింది.కొంప దీసి అందులో ఒక పాంట్ ఆయనకీ నచ్చిందంటే,చెల్లెలికి చీరకి డబ్బు చాలదు.గబా గబా బయటికి వచ్చి "ఒసారిలా రండి."అంది.
నేనెందుకు?నువ్వు చూసుకో!
చూసానులెండి.మీరుకూడా ఒకసారి చూస్తె-
ఆ ఇల్లాలు ఉద్దేశ్యం చీర చూసి సెలెక్టు చెయ్యమని కాదు-ఖరీదుకు,ఊ అంటాడా లేదా?అని.ఆయన తప్పని సరిగా లోపలికి వచ్చాడు.ఆవిడ తను ఎన్నిక చేసిన చీర పరచి"ఇదుగో!ఈచారాల్ చీరండీ!బాగుందికడూ!
నీలంచారలమీద,పచ్చని పువ్వులు కొట్టొచ్చినట్లు న్నాయి.అంది.పూలేమోకానీ,ఖరీదు ఆయన్ని కొట్టింది.కాని వద్దనడానికి వీలు లేదు.రెండు రోజుల్లో మరదలు పెళ్లి.ప్రెజెంటేషను ఇవ్వాలి.తనయితే అట్లాకాడో,అప్పడాల కర్రో చదివిన్చేవాడు.కాని ఆవిడ రాత్రివేళ చల్లగా ఏమండీ మా చెల్లెలికి బాగా గుర్తుండేలా మంచి ప్రెజెంట్ ఇయ్యాలి,వెండి దేదయినా ఇస్తే నాలుగు కాలాల పాటువుంటుంది"అంది."ఇయ్యి,ఏదైనా ఇంట్లో వుంటే"!అన్నాడు.
"ఇంట్లోనా!భలేవారే!ఎప్పుడయినా చూసారా?అంది.
సరే!వెండి లోంచి వలువల్లోకి తెచ్చేందుకు ఆర్ధిక శాస్త్ర మంతా అప్ప జెప్పాల్సి వచ్చింది.అంచేత మాట్లాడకుండా "ఊ!తీసుకో!'అన్నాడు.వెంటనే ఆ చీర తీసుకోండి ఇల్లాలు.పూల చీరని తెచ్చిన దానికంటే విసురుగా తీసుకెళ్ళి వాకిట్లో పైన తగిలించాడు కుర్రవాడు.పూల చీర పాంట్ వంక చూడలేక తల పక్కకు తిప్పుకొంది.పాంట్ ఎవరికీ వినపడ కుండా"ఏయ్ !ఓయ్!అంటూ పిల్చింది.అరగంటకి తల తిప్పి చూసింది పూల చీర.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Sunday, November 29, 2009
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
కథ
పూల చీర - 1
పూలచీర రచన: టి.జ్ఞాన ప్రసూన
చిక్కని నియాన్ లైట్ల కాంతిలో బజారు పెళ్లి పందిరిలా వుంది.మనుష్యులుకూడా పెళ్లి పందిట్లో లాగే హడావుడిగా తిరుగుతున్నారు. అవునుమరి,నెలలో మొదటివారం -ఎంత లేని వాడికయినా అంతో,ఇంతో లక్ష్మి దర్శనమిచ్చేవారం.
కల్పనా షోరూం చిన్న బల్బులు,పెద్ద బల్బులు,ట్యూబ్ లైట్ల మధ్య ఒయారాలు పోతోంది.షో కేసులో వున్నా బొమ్మ మరీ సోకు తిప్పుకొనే గొప్పింటి గారాల బిడ్డలా వుంది.కాక పొతే ఉండాల్సిన చోట్ల బట్ట లేదు..చీరలంటే నామ్కే వాస్తే గానీ ,చలికాలంలో బొంతలా కప్పుకోతానికి కాదు అని సందేశం ఇస్తోంది. కట్టిన చీర మాత్రం చాలా ఖరీదైన సిల్క్ చీర.బొమ్మ గర్వంగా నిలబడి వుంది.చీర ఇంకా నిర్లక్ష్యం గావుంది.నన్నే కదా ఎన్నుకొని అలంకరించారు -అని తననే కదా వచ్చేపోయే వాళ్లు ఆకలి కళ్ళతో ఆరాదిస్తున్నారని కాబోలు.పక్కనే నవ యువకుడి బొమ్మ.దానికి ఖరీదైన పాంట్.,సరిపడిన షర్ట్ అలంకరించారు.రెండిటికీ విడ దీయరాని అనుబంధం. ఎపాంట్ కి ఎషర్ట్ కొనాలో కొట్టులో గుమాస్టాలే చెప్తారు.ఒకవేళ ఎసామాన్యుడో కష్ట పడి డబ్బు దాచి పాంట్ కొనుక్కొందామని వెడితే ఆ షో కేసులో పాంట్ కొందామంటే ,ఆ షర్ట్ కూడా తీసుకొంటే తప్ప పాంట్ ఒక్కటి ఇయ్యడానికి ఒప్పుకోరు. సౌందర్యారాధన తెలియని అనాగరికుడిని చూసినట్టు చూసి,"పోనీ మరో పాంట్ తీసుకోండి."అంటాడు.
"కాదయ్యా షోకేసులోది బాగుంది.'
అయితే షర్టు కూదాతీసుకోండి "'
"అబ్బే! రెండూ ఇప్పుడు కొనలేనయ్యా!"
అయితే మీరు ఎంత డబ్బు తెచ్చారు!చెప్పండి. ఆ డబ్బుకు సరిపడా వేరే పాంట్ షర్ట్ చూపిస్తాను.
"షర్ట్ అఖ్ఖరలేదయ్యా!అన్తోంటే వినవేం "
"మల్లి మీరు వేరే షర్ట్ కొనుక్కోరుసార్ "
"బతుకంతా వాడు ఆ పెద్ద మనిషి వెనకే వున్నట్లు-ఆ పెద్ద మనిషి ఎప్పుడూ పాంట్లు మాత్రం కొని షర్ట్లు కొన్నట్లు మాట్లాడతాడు.ఇవన్నీ నాగరికపు మేర మేచ్చులు,మనిషిని ఊపిరాడనియ్యని ఉచ్చులు.మొత్తని కేలాగాయితేనేమి-షోకేసులో పాంట్లు, షర్ట్లు,చీరలు ఆలస్యంగానే అమ్ముతారు.
షాపు వీధి వేపు గుమ్మంలో కుచ్చెళ్లు పెట్టి వ్రేలాడదీసిన చీరలున్నాయి.రకానికొకటి చొప్పున వ్రేలాడదీసాడు యజమాని.వాటిలో ఒకటి చిన్న చిన్న పూలు అద్దిన చీర వుంది.అడికోట్లోకి వచ్చి ఎన్నో రోజులయింది.దాన్ని యజమాని ప్రతి నేలా మొదటి వారంలో బయట వ్రేలాడకడతాడు.ఆ వారమంతా ఆ చీర ఉదాసీనంగా వుంటుంది.దాని కల్లెప్పుడూ షో కేసులో వున్నా బొమ్మ మీదే వుంటాయి.ప్రతి రోజు ఆ బొమ్మ కట్టిన చీరని గుచ్చి గుచ్చి చూస్తూ వుంటాయి .చీర మీదున్న చిన్నచిన్న పూలు "ఎం మేముబాగాలేమా?"అని గునుస్తాయి.
ఒకసారి ఆబొమ్మకి నన్ను కట్టి చూడు పూల పూల తో ఎంత బాగుంటానో!అనియజమానికి ఎన్నో సార్లు సైగ చేసింది.
అయితేనేం ఆటను వినిపించుకోడు.ఆటను దేశ కాల పరిస్థితిని బట్టి వాడుస్తాడు.ఆ పూల పూల నేత చీరని షోకేసులో బొమ్మకి కదితెచూసే వాళ్ళంతా తన శాపునిండా అలాటి చీరలే వున్నాయని రారేమో?అని భయం.అంచేత సరికొత్త వెరైటీ,సరికొత్త డిజైను ఏరి ఆబోమ్మకు కడతాడు.పొరపాటు, కట్టిస్తాడు.షోకేసులో బొమ్మకి చీర కట్టడానికి చాలాకాలంగా ఒక తాత వస్తుంటాడు.ఆటను చీర కడితే అప్సరస దిగి వచ్చినట్లే ఉంటుందిట.అంచేత యజమాని ఆ తాత అడిగినంత ఇచ్చేవాడు.ఈమధ్య తాత రావడం లేదు.మనమడిని పంపిస్తున్నాడు.మనుమడు వచ్చాక ఆకర్షణీయమైన మార్పులు జరిగాయి.ఇతను బొమ్మకి చీర కట్టడామేకాడు,మూడువేపులా మూడు చీరలు వెనక కడుతున్నాడు.పమిట కొంగులు పైకి వచ్చేలాగా పరుస్తున్నాడు.ఆ శోకేసు షాపుకి ఆయువుపట్టులాంటిది.చాలా మందికి షోకేసులేని షాపుకు వెళ్ళాలంటే మనస్కరించదు..అంచేతనే ఆ షాపు యజమాని ఆ షోకేసుపైనే తన వ్యాపారం ఆధార పడి వున్దనుకొంటాడు.
పూల చీర తనని కనీసం వెనకైనా కడతాదేమో అని ఆశ పడింది.ఆ ఆశ నిరాశే అయింది.చ చ ఏమిబతుకు అనుకోండి.కావాలనుకొన్నది కాక పోయాక అని పమిట కొంగుతో కళ్లు వట్టుకొని,విసురుగా కొంగు విదిలించింది.అది వెళ్లి పక్కనున్న పాంట్ బట్టకి తగిలింది.పాంట్ బట్ట ఉలిక్కి పడింది.
"అరె!ఏమయింది?ఏడుస్తున్నావాకళ్ళలో ఇసక పడిందా?"అంది.
"కళ్ళలో ఏమిటి? వాళ్ళంతా ఇసకే?నేనేమన్నా షోకేసులో బొమ్మకి కట్టిన చీరలమా?మాయకుండా నాలాగా కుండా ఉండటానికి?"అంది.
పాంట్ సన్నగా నవ్వి"ఓస్ అదా!అబ్బ !నాకయితే ఆషోకెసు భోషాణం లా అనిపిస్తుంది.అందులో ఊపిరాడదు.ఒక్క మానవుడి స్పర్స తగలదు సరికదా,ప్రతి వాడూ గుచ్చి గుచ్చి చూస్తాడు.నాకు ఇక్కడే బాగుంటుంది.గాలికి ఉయ్యాల లూగుతూ వచ్చేపోయ్యే వారి మాటలు విన్తూకాలక్షేపం చెయ్యొచ్చు.'అంది పాంట్.
"ఏమి కాలక్షేపం?ఎన్నాళ్ళు కాలక్షేపం?అసలిక్కడ నుంచి కదలడం ఉందా?!"ఏమి కదలక షాపులో వాళ్ళం షాపులోనే ఉంటామా!రోజు బాగుంటే ఇద్దరం ఒకిన్టికే పోదాం,సారా?అంది పాంట్.
ఇంతలో ఒభార్యా భర్తా పిల్లలూ షాపులో జొరబడ్డారు.భార్య చరచరా లోపలికి వెళ్ళింది.వెళ్తూనే వాకిట్లో వున్నా పూల చీర చూపించి"అదిలా పట్రా అబ్బీ!అంది.
చిక్కని నియాన్ లైట్ల కాంతిలో బజారు పెళ్లి పందిరిలా వుంది.మనుష్యులుకూడా పెళ్లి పందిట్లో లాగే హడావుడిగా తిరుగుతున్నారు. అవునుమరి,నెలలో మొదటివారం -ఎంత లేని వాడికయినా అంతో,ఇంతో లక్ష్మి దర్శనమిచ్చేవారం.
కల్పనా షోరూం చిన్న బల్బులు,పెద్ద బల్బులు,ట్యూబ్ లైట్ల మధ్య ఒయారాలు పోతోంది.షో కేసులో వున్నా బొమ్మ మరీ సోకు తిప్పుకొనే గొప్పింటి గారాల బిడ్డలా వుంది.కాక పొతే ఉండాల్సిన చోట్ల బట్ట లేదు..చీరలంటే నామ్కే వాస్తే గానీ ,చలికాలంలో బొంతలా కప్పుకోతానికి కాదు అని సందేశం ఇస్తోంది. కట్టిన చీర మాత్రం చాలా ఖరీదైన సిల్క్ చీర.బొమ్మ గర్వంగా నిలబడి వుంది.చీర ఇంకా నిర్లక్ష్యం గావుంది.నన్నే కదా ఎన్నుకొని అలంకరించారు -అని తననే కదా వచ్చేపోయే వాళ్లు ఆకలి కళ్ళతో ఆరాదిస్తున్నారని కాబోలు.పక్కనే నవ యువకుడి బొమ్మ.దానికి ఖరీదైన పాంట్.,సరిపడిన షర్ట్ అలంకరించారు.రెండిటికీ విడ దీయరాని అనుబంధం. ఎపాంట్ కి ఎషర్ట్ కొనాలో కొట్టులో గుమాస్టాలే చెప్తారు.ఒకవేళ ఎసామాన్యుడో కష్ట పడి డబ్బు దాచి పాంట్ కొనుక్కొందామని వెడితే ఆ షో కేసులో పాంట్ కొందామంటే ,ఆ షర్ట్ కూడా తీసుకొంటే తప్ప పాంట్ ఒక్కటి ఇయ్యడానికి ఒప్పుకోరు. సౌందర్యారాధన తెలియని అనాగరికుడిని చూసినట్టు చూసి,"పోనీ మరో పాంట్ తీసుకోండి."అంటాడు.
"కాదయ్యా షోకేసులోది బాగుంది.'
అయితే షర్టు కూదాతీసుకోండి "'
"అబ్బే! రెండూ ఇప్పుడు కొనలేనయ్యా!"
అయితే మీరు ఎంత డబ్బు తెచ్చారు!చెప్పండి. ఆ డబ్బుకు సరిపడా వేరే పాంట్ షర్ట్ చూపిస్తాను.
"షర్ట్ అఖ్ఖరలేదయ్యా!అన్తోంటే వినవేం "
"మల్లి మీరు వేరే షర్ట్ కొనుక్కోరుసార్ "
"బతుకంతా వాడు ఆ పెద్ద మనిషి వెనకే వున్నట్లు-ఆ పెద్ద మనిషి ఎప్పుడూ పాంట్లు మాత్రం కొని షర్ట్లు కొన్నట్లు మాట్లాడతాడు.ఇవన్నీ నాగరికపు మేర మేచ్చులు,మనిషిని ఊపిరాడనియ్యని ఉచ్చులు.మొత్తని కేలాగాయితేనేమి-షోకేసులో పాంట్లు, షర్ట్లు,చీరలు ఆలస్యంగానే అమ్ముతారు.
షాపు వీధి వేపు గుమ్మంలో కుచ్చెళ్లు పెట్టి వ్రేలాడదీసిన చీరలున్నాయి.రకానికొకటి చొప్పున వ్రేలాడదీసాడు యజమాని.వాటిలో ఒకటి చిన్న చిన్న పూలు అద్దిన చీర వుంది.అడికోట్లోకి వచ్చి ఎన్నో రోజులయింది.దాన్ని యజమాని ప్రతి నేలా మొదటి వారంలో బయట వ్రేలాడకడతాడు.ఆ వారమంతా ఆ చీర ఉదాసీనంగా వుంటుంది.దాని కల్లెప్పుడూ షో కేసులో వున్నా బొమ్మ మీదే వుంటాయి.ప్రతి రోజు ఆ బొమ్మ కట్టిన చీరని గుచ్చి గుచ్చి చూస్తూ వుంటాయి .చీర మీదున్న చిన్నచిన్న పూలు "ఎం మేముబాగాలేమా?"అని గునుస్తాయి.
ఒకసారి ఆబొమ్మకి నన్ను కట్టి చూడు పూల పూల తో ఎంత బాగుంటానో!అనియజమానికి ఎన్నో సార్లు సైగ చేసింది.
అయితేనేం ఆటను వినిపించుకోడు.ఆటను దేశ కాల పరిస్థితిని బట్టి వాడుస్తాడు.ఆ పూల పూల నేత చీరని షోకేసులో బొమ్మకి కదితెచూసే వాళ్ళంతా తన శాపునిండా అలాటి చీరలే వున్నాయని రారేమో?అని భయం.అంచేత సరికొత్త వెరైటీ,సరికొత్త డిజైను ఏరి ఆబోమ్మకు కడతాడు.పొరపాటు, కట్టిస్తాడు.షోకేసులో బొమ్మకి చీర కట్టడానికి చాలాకాలంగా ఒక తాత వస్తుంటాడు.ఆటను చీర కడితే అప్సరస దిగి వచ్చినట్లే ఉంటుందిట.అంచేత యజమాని ఆ తాత అడిగినంత ఇచ్చేవాడు.ఈమధ్య తాత రావడం లేదు.మనమడిని పంపిస్తున్నాడు.మనుమడు వచ్చాక ఆకర్షణీయమైన మార్పులు జరిగాయి.ఇతను బొమ్మకి చీర కట్టడామేకాడు,మూడువేపులా మూడు చీరలు వెనక కడుతున్నాడు.పమిట కొంగులు పైకి వచ్చేలాగా పరుస్తున్నాడు.ఆ శోకేసు షాపుకి ఆయువుపట్టులాంటిది.చాలా మందికి షోకేసులేని షాపుకు వెళ్ళాలంటే మనస్కరించదు..అంచేతనే ఆ షాపు యజమాని ఆ షోకేసుపైనే తన వ్యాపారం ఆధార పడి వున్దనుకొంటాడు.
పూల చీర తనని కనీసం వెనకైనా కడతాదేమో అని ఆశ పడింది.ఆ ఆశ నిరాశే అయింది.చ చ ఏమిబతుకు అనుకోండి.కావాలనుకొన్నది కాక పోయాక అని పమిట కొంగుతో కళ్లు వట్టుకొని,విసురుగా కొంగు విదిలించింది.అది వెళ్లి పక్కనున్న పాంట్ బట్టకి తగిలింది.పాంట్ బట్ట ఉలిక్కి పడింది.
"అరె!ఏమయింది?ఏడుస్తున్నావాకళ్ళలో ఇసక పడిందా?"అంది.
"కళ్ళలో ఏమిటి? వాళ్ళంతా ఇసకే?నేనేమన్నా షోకేసులో బొమ్మకి కట్టిన చీరలమా?మాయకుండా నాలాగా కుండా ఉండటానికి?"అంది.
పాంట్ సన్నగా నవ్వి"ఓస్ అదా!అబ్బ !నాకయితే ఆషోకెసు భోషాణం లా అనిపిస్తుంది.అందులో ఊపిరాడదు.ఒక్క మానవుడి స్పర్స తగలదు సరికదా,ప్రతి వాడూ గుచ్చి గుచ్చి చూస్తాడు.నాకు ఇక్కడే బాగుంటుంది.గాలికి ఉయ్యాల లూగుతూ వచ్చేపోయ్యే వారి మాటలు విన్తూకాలక్షేపం చెయ్యొచ్చు.'అంది పాంట్.
"ఏమి కాలక్షేపం?ఎన్నాళ్ళు కాలక్షేపం?అసలిక్కడ నుంచి కదలడం ఉందా?!"ఏమి కదలక షాపులో వాళ్ళం షాపులోనే ఉంటామా!రోజు బాగుంటే ఇద్దరం ఒకిన్టికే పోదాం,సారా?అంది పాంట్.
ఇంతలో ఒభార్యా భర్తా పిల్లలూ షాపులో జొరబడ్డారు.భార్య చరచరా లోపలికి వెళ్ళింది.వెళ్తూనే వాకిట్లో వున్నా పూల చీర చూపించి"అదిలా పట్రా అబ్బీ!అంది.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Sunday, November 29, 2009
1 comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
కథ
Tuesday, November 24, 2009
ఈ పని ముఖ్యం
ఈ పని ముఖ్యం
నాగరిక ప్రబలిన తరువాత వూరు మారడం ,దేశం మారడం
తప్పనిసరి అయింది. సొంత ఇల్లు అంటు లేకపోతె వున్నా ఊళ్లోనే
ఇల్లు మారాల్సి వస్తూ వుంటుంది. ఇల్లు మారడం ఒక పెద్ద తతంగం .
ఇల్లు మారేటప్పుడు చెంచా మర్చిపోయామేమో! చీపురుకట్ట పెట్టామో లేదో? పాత పేపర్ల కట్ట వరండాలోనే వదిలేసామేమో? అనిఖంగారుపడి మళ్ళిమళ్ళి పదిసార్లు చూసుకుంటాము.
ఇల్లు మారగానే పోస్టల్ వారికి మాత్రం కొత్త అడ్రెసు తెలియపరచం. బధ్ధకిస్తాము. ఇదివరకు పోస్ట్లో క్షేమ సమాచారాల ఉత్తరాలే వచ్చేవి. ఇప్పుడు పోస్ట్ ద్వారా ఎన్నో లావాదేవీలు నడుస్తువుంటాయి. చెక్కులు వస్తాయి, సర్టిఫికెట్లు వస్తాయి, ఉద్యోగాలకి ఆర్డర్లు వస్తాయి. ఇవి అన్ని అడ్రెస్ కొత్తది చెప్పక పొతే ఎటో పోతాయి.
పోస్టలు వారికి కొత్త అడ్రెస్ ముందుగానే తెలియపర్చడం ముఖ్యం.కాకపొతే మనం చెప్పినా పాత అడ్రెస్ కి కొన్నాళ్ళు ఉత్తరాలు వస్తాయి. పక్కనున్న వారికో ,ఇంటి యజమానికో "మాఉత్తరాలు జాగ్రత్త పెట్టండి,మేము వచ్చి తీసుకు వెళ్తాము ,అని చెప్పాలి. కొందరు ఎదుటివారి ఉత్తరాల్ని మహా నిర్లక్ష్యం గా చూస్తారు, ఇల్లు ఖాలిచేసారుగా ఇక వాళ్ళతో మనకేమిటి అనుకొంటారేమో? వాటిని ఏమూలో పడేస్తారు.
మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఖాళి చేసి వస్తూ పక్కనున్నవాళ్ళకి "మాపోస్ట్ జాగ్రత్త పెట్టండి" అని చెప్పి వచ్చారుట.
ఏదో ఉత్తరం వచ్చింది,ఇంటాయన తమ్ముడు "దాన్ని రిటర్న్ చేసేసాడు.
తీరా ఆరా తీస్తే అదిఒ కంపని నుంచి వచ్చింది, అందులో చెక్కు వుంది.
వీళ్ళు మళ్ళి ఆ కంపెనీకి ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాస్తున్నారు వాళ్లు మళ్ళి చెక్కు పంపెదాకా వీళ్ళకి ఖంగారుగావుంది. మరొకరికి అలాగే పోస్ట్ వాళ్ళకి కొత్త అడ్రెస్ చెప్పలేదుట ఉద్యోగానికి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది,వీళ్ళు వెళ్లి అది తెచ్చుకొనే సరికి టైం అయిపొయింది.గవర్నమెంట్ ఉద్యోగం చేయ్యిజారిపోయింది.చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని మార్చి వేస్తుంది.కాస్త జాగ్రత్త బోలెడు సుఖాన్నిస్తుంది.
నాగరిక ప్రబలిన తరువాత వూరు మారడం ,దేశం మారడం
తప్పనిసరి అయింది. సొంత ఇల్లు అంటు లేకపోతె వున్నా ఊళ్లోనే
ఇల్లు మారాల్సి వస్తూ వుంటుంది. ఇల్లు మారడం ఒక పెద్ద తతంగం .
ఇల్లు మారేటప్పుడు చెంచా మర్చిపోయామేమో! చీపురుకట్ట పెట్టామో లేదో? పాత పేపర్ల కట్ట వరండాలోనే వదిలేసామేమో? అనిఖంగారుపడి మళ్ళిమళ్ళి పదిసార్లు చూసుకుంటాము.
ఇల్లు మారగానే పోస్టల్ వారికి మాత్రం కొత్త అడ్రెసు తెలియపరచం. బధ్ధకిస్తాము. ఇదివరకు పోస్ట్లో క్షేమ సమాచారాల ఉత్తరాలే వచ్చేవి. ఇప్పుడు పోస్ట్ ద్వారా ఎన్నో లావాదేవీలు నడుస్తువుంటాయి. చెక్కులు వస్తాయి, సర్టిఫికెట్లు వస్తాయి, ఉద్యోగాలకి ఆర్డర్లు వస్తాయి. ఇవి అన్ని అడ్రెస్ కొత్తది చెప్పక పొతే ఎటో పోతాయి.
పోస్టలు వారికి కొత్త అడ్రెస్ ముందుగానే తెలియపర్చడం ముఖ్యం.కాకపొతే మనం చెప్పినా పాత అడ్రెస్ కి కొన్నాళ్ళు ఉత్తరాలు వస్తాయి. పక్కనున్న వారికో ,ఇంటి యజమానికో "మాఉత్తరాలు జాగ్రత్త పెట్టండి,మేము వచ్చి తీసుకు వెళ్తాము ,అని చెప్పాలి. కొందరు ఎదుటివారి ఉత్తరాల్ని మహా నిర్లక్ష్యం గా చూస్తారు, ఇల్లు ఖాలిచేసారుగా ఇక వాళ్ళతో మనకేమిటి అనుకొంటారేమో? వాటిని ఏమూలో పడేస్తారు.
మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఖాళి చేసి వస్తూ పక్కనున్నవాళ్ళకి "మాపోస్ట్ జాగ్రత్త పెట్టండి" అని చెప్పి వచ్చారుట.
ఏదో ఉత్తరం వచ్చింది,ఇంటాయన తమ్ముడు "దాన్ని రిటర్న్ చేసేసాడు.
తీరా ఆరా తీస్తే అదిఒ కంపని నుంచి వచ్చింది, అందులో చెక్కు వుంది.
వీళ్ళు మళ్ళి ఆ కంపెనీకి ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాస్తున్నారు వాళ్లు మళ్ళి చెక్కు పంపెదాకా వీళ్ళకి ఖంగారుగావుంది. మరొకరికి అలాగే పోస్ట్ వాళ్ళకి కొత్త అడ్రెస్ చెప్పలేదుట ఉద్యోగానికి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది,వీళ్ళు వెళ్లి అది తెచ్చుకొనే సరికి టైం అయిపొయింది.గవర్నమెంట్ ఉద్యోగం చేయ్యిజారిపోయింది.చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని మార్చి వేస్తుంది.కాస్త జాగ్రత్త బోలెడు సుఖాన్నిస్తుంది.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Tuesday, November 24, 2009
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
ఈ పని ముఖ్యం
Friday, November 13, 2009
జివేన శరద: శతం
జీవేన శరద:శ్శతం
వంద ఏళ్ళు ఆరొగ్యంగా జీవించాలి. ఈకోరిక ప్రతి మానవుడికి వుంటుంది. విటమిన్ "సీ " లో
మహత్తర మైన శక్తులున్నాయని శరీరానికి కావలసిన ఆరోగ్యాన్నిచ్చి ,యౌవనాన్ని వృధ్ధి చేసి రోగాలను నివారిస్తుందని వైద్య శాస్త్రం చెపుతుంది.ఈవిషయాన్ని వేయి సంవత్సరాల క్రితం భారత దేశపు వైద్యులు పరిశోధన చేసి నిర్ణయించారు.ఆరోగ్య రక్షణ కోసం వారు ఎన్నో మందులు,చికిత్సలు ,లేహ్యాలు కనిపెట్టారు.అందులో చ్యవన ప్రాశ ఒకటి. చ్యవన ప్రాశ ప్రాశస్త్యం తెలిసినా తెలియక పోయినా అది తినడం వలన శరీరంలో ఉష్ణత నిలకడగా
వుంటుందని, జలుబులు దగ్గులు రావని నమ్ముతారు.ఇది తియ్యగా వుండటం వలన పిల్లలు మారాం చేయకుండా తింటారు.మనం ఒకచెంచా పెడితే వాళ్ళు ఇంకో చెంచా తింటారు.
చ్యవన ప్రాశకు సంబంధించి ఒక కథ కూడావుంది.చ్యవన మహర్షి పేరుతో ఈ లేహ్యం పుట్టిందిట.వృధ్ధు డైన చ్యవన మహర్షి ఒక వనం లో తపస్సు చేసుకొంటున్నాడట. చాలా సంవత్శరాలు ఒకేచోట కూర్చోవడం వల్ల ఆయన చుట్టు చెదలు పుట్టలు పెట్టాయి.శరీరం అంతా నిడి కళ్ళు మాత్రం కనిపించేవిట .సుకన్య అనే రాజకుమారి ఆవనానికి చెలికత్తెలతో వాహ్యాళికి వెళ్ళిందిట.ఈపుట్ట చూసింది. కళ్ళు మాత్రం మెరుస్తున్నాయిట.సుకన్య కుతూహలం తో ఆకళ్ళల్లో పొడిచింది.ఆయన కు కళ్ళు పోయాయి.సుకన్య చాలా పశ్చాత్తప పడి ఆఋషిని పెళ్ళీ చేసుకొంది.దేవతల వైద్యులు అశ్వని కుమారులను ప్రార్ధించింది,తన భర్తకు చూపు తెప్పించమని.వారు ఔషధం తయారు చేసి ఇచ్చారు.ఆయనకి చూపు రావడమే కాక పున: యౌవనం కూడా వచ్చిందిట.ప్రాశ అంటే తినడం చ్యవనుడు తిన్న ఔషధ కనుక దినికి చ్యవన ప్రాశ అని పేరు వచ్చింది.
అంటె ఇఔషఢానికి ఇంత శక్తి వుంది.ఇంతలాభం జరుగుతుందా?ఇప్పటికి? అని శంసయం రావచ్చు.
ఔషధాలు,ఉపకరణాలు పెట్టి రోగిని ఒక గదిలో నిర్ణీత కాలం పెట్టేవారుట.బయట ప్రపంచం తో రోగికి సంబంధం వుందేది కాదుట.అప్పుడు చ్యవన ప్రాశ పెట్టే వారుట.
అప్పుడు కాయాకల్పం జరిగేదిట.పండిత మదన మోహన మాలవ్యా గారు కూడా కొంతకాలం ఈచికిత్స పొందారట.ఇది పూర్తిగా ఫలితాన్నియ్యాలంటే దీన్ని తాజాగా సేవించాలి..తయారు చేసాక ఒక సంవస్తరం దాటగానే ఇందులో వేసిన పదార్ధాల శాక్తి తగ్గు ముఖం పడుతుందంటారు.పూర్వ వాళ్ళు ఈఔషధ ఇలా తయారు చేసి అలా రోగికి ఇచ్చేవారుట.
చ్యవనప్రాశ తయారు చేయడానికికాలము,శ్రమ ఎక్కువ వినియోగించాలి.ఔష్ధీయుక్త మైన వేర్లు,ఆకులు కొమ్మలు అడవులలో తిరిగి వెతికివెతికి తేవాల్సి వుంటుంది.పదిమంది పది దిక్కులకు పోయినాకూడా సమయం బాగానేపడుతుంది.చరక సమ్హిత మొదలైన ఆయుర్వేద గ్రంధాలలో చ్యవన ప్రాశ తయారీ,దాని ప్రాశస్త్యము వివరించారు.దీనిని శీతాకాలం లో సేవించడం చాలా మంచిది. దీనిని తయారు చేయడం కూడా శీతాకాలం లోనే చేస్తారుట.
పక్వానికి వచ్చిన్ తాజాగా పండిన ఉసిరికాయలు,వేర్లు,ఆకులు తెచ్చి కళాయిపెట్టిన పాత్రలో నీళ్ళు పోసి ఉడికిస్తారు.శీతాకాలం లో ఉసిరికాయలు పుష్కలం గాదొరుకుతాయి వాటిలో విటమిన్ "సి" పుష్కలం గావుంటుంది.గులాబి,బిల్వపత్రం,పగడ చెట్టు ఆకులు,విష్ణు క్రాంత ఆకులు,రావీఅకు,ఎండ్రగబ్బ కొమ్మ ఆకు,మునక్కయ ,కరక్కాయ,జీవంతి,నేల ఉసిరి,కజ్జూరం,తామరదుంప,చందనం,ఆకుపచ్చ ఏలకులు,సొంటి అష్టవర్గ మొదలైనవి దీనిలో వేస్తారు.అందుకే చ్యవన ప్రాశ సీసాల పై విశేష అష్ట వర్గలతో చేసింది అని వ్రాస్తారు.తమ్మి వేరు,కాకి దొండ చెట్టు,వ్రుధ్ధ మెదా,మహామదా,రుషభుక్,జీవక కాకోలీ,క్షీరకాకోలి ఈఎనిమిది ని అష్టవర్గ అంటారు.
ఇవి దుర్గమ మైన హిమాలయ పర్వతాలలో మంచు ప్రదేశం లో పుడతాయి.సన్నని సెగ మీద నెయ్యి కాచి ఇవన్ని అందులొ వేసి ఎర్రగా వేగనిస్తారు.పూర్తిగా వేగాక నెయ్యి పైకి వస్తుంది.వెరే నీళ్ళు బాణలిలో వేసిపొంగాక పంచదార వేసి పాకం పడ్తారు.ఇందులొ వేగించిన దినుసులు వేసి హల్వాలా చేస్తారు.పిప్పలి,నాగ కేసరి,తేజపత్తా,ఏలకులు,వంశలోచన్,దాల్చీని,మెత్తగా నూరి ఇందులో కలుపుతారు.చల్లబడ్డాక సీసాలలో నింపుతారు.
ఉదయం ఫలహారం చేసేముందు పాలతోకానీ,వేడినీటితో కాని 20 గ్రాములు పుచ్చుకోవాలి.రాత్రి ఇలాగేసేవించాలి.ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.ఇది శ్రేష్ట మైన రసాయనం. వూపిరితిత్తులకి,మస్తిష్కానికిశక్తినిస్తుంది.గుండెలోని ధమనులని,నాడులని బలపరుస్తుంది.విద్యార్ధులకి,బుధ్ధిజీవులకి శ్మరణ శాక్తిని పెంచుతుంది.పేగులలో మలం చేరితే వచ్చే రోగాలని నిరోధిస్తుంది.నియమంగా పుచ్చుకొంటే రక్త వౄధ్ధి,శరీరంలో కాంతి కల్గుతాయి.ఇందులో వుండే వంశలోచన అంటే ప్రక్రుతి సిధ్ధమైన "క్యాలిషం "వలన ఎముకలు గట్టిపడతాయి.కాని అన్ని మంచి గుణాలే అని అందరు సెవించకూడదు.వాయుపీడితులు,విరోచనాలయ్యె వాళ్ళు,ఆకలి లేనివాళ్ళు,అజీర్ణం తో బాధ పడే వాళ్ళు పుచ్చుకోకూడదు.ఎదిగేపిల్లలకి ఇది ఎంతో మంచిది.ఇది సహజ మైన,సులభ మైన దివ్యౌధం.శీతాకాలం లో జలుబులు,దగ్గులు,జ్వరాలు రానియ్యదు.తియ్యగా వుండటం వల్ల పిల్లలు తినడానికి ఇష్ట పడతారు.
స్వాగత్ సౌజన్యంతో
వంద ఏళ్ళు ఆరొగ్యంగా జీవించాలి. ఈకోరిక ప్రతి మానవుడికి వుంటుంది. విటమిన్ "సీ " లో
మహత్తర మైన శక్తులున్నాయని శరీరానికి కావలసిన ఆరోగ్యాన్నిచ్చి ,యౌవనాన్ని వృధ్ధి చేసి రోగాలను నివారిస్తుందని వైద్య శాస్త్రం చెపుతుంది.ఈవిషయాన్ని వేయి సంవత్సరాల క్రితం భారత దేశపు వైద్యులు పరిశోధన చేసి నిర్ణయించారు.ఆరోగ్య రక్షణ కోసం వారు ఎన్నో మందులు,చికిత్సలు ,లేహ్యాలు కనిపెట్టారు.అందులో చ్యవన ప్రాశ ఒకటి. చ్యవన ప్రాశ ప్రాశస్త్యం తెలిసినా తెలియక పోయినా అది తినడం వలన శరీరంలో ఉష్ణత నిలకడగా
వుంటుందని, జలుబులు దగ్గులు రావని నమ్ముతారు.ఇది తియ్యగా వుండటం వలన పిల్లలు మారాం చేయకుండా తింటారు.మనం ఒకచెంచా పెడితే వాళ్ళు ఇంకో చెంచా తింటారు.
చ్యవన ప్రాశకు సంబంధించి ఒక కథ కూడావుంది.చ్యవన మహర్షి పేరుతో ఈ లేహ్యం పుట్టిందిట.వృధ్ధు డైన చ్యవన మహర్షి ఒక వనం లో తపస్సు చేసుకొంటున్నాడట. చాలా సంవత్శరాలు ఒకేచోట కూర్చోవడం వల్ల ఆయన చుట్టు చెదలు పుట్టలు పెట్టాయి.శరీరం అంతా నిడి కళ్ళు మాత్రం కనిపించేవిట .సుకన్య అనే రాజకుమారి ఆవనానికి చెలికత్తెలతో వాహ్యాళికి వెళ్ళిందిట.ఈపుట్ట చూసింది. కళ్ళు మాత్రం మెరుస్తున్నాయిట.సుకన్య కుతూహలం తో ఆకళ్ళల్లో పొడిచింది.ఆయన కు కళ్ళు పోయాయి.సుకన్య చాలా పశ్చాత్తప పడి ఆఋషిని పెళ్ళీ చేసుకొంది.దేవతల వైద్యులు అశ్వని కుమారులను ప్రార్ధించింది,తన భర్తకు చూపు తెప్పించమని.వారు ఔషధం తయారు చేసి ఇచ్చారు.ఆయనకి చూపు రావడమే కాక పున: యౌవనం కూడా వచ్చిందిట.ప్రాశ అంటే తినడం చ్యవనుడు తిన్న ఔషధ కనుక దినికి చ్యవన ప్రాశ అని పేరు వచ్చింది.
అంటె ఇఔషఢానికి ఇంత శక్తి వుంది.ఇంతలాభం జరుగుతుందా?ఇప్పటికి? అని శంసయం రావచ్చు.
ఔషధాలు,ఉపకరణాలు పెట్టి రోగిని ఒక గదిలో నిర్ణీత కాలం పెట్టేవారుట.బయట ప్రపంచం తో రోగికి సంబంధం వుందేది కాదుట.అప్పుడు చ్యవన ప్రాశ పెట్టే వారుట.
అప్పుడు కాయాకల్పం జరిగేదిట.పండిత మదన మోహన మాలవ్యా గారు కూడా కొంతకాలం ఈచికిత్స పొందారట.ఇది పూర్తిగా ఫలితాన్నియ్యాలంటే దీన్ని తాజాగా సేవించాలి..తయారు చేసాక ఒక సంవస్తరం దాటగానే ఇందులో వేసిన పదార్ధాల శాక్తి తగ్గు ముఖం పడుతుందంటారు.పూర్వ వాళ్ళు ఈఔషధ ఇలా తయారు చేసి అలా రోగికి ఇచ్చేవారుట.
చ్యవనప్రాశ తయారు చేయడానికికాలము,శ్రమ ఎక్కువ వినియోగించాలి.ఔష్ధీయుక్త మైన వేర్లు,ఆకులు కొమ్మలు అడవులలో తిరిగి వెతికివెతికి తేవాల్సి వుంటుంది.పదిమంది పది దిక్కులకు పోయినాకూడా సమయం బాగానేపడుతుంది.చరక సమ్హిత మొదలైన ఆయుర్వేద గ్రంధాలలో చ్యవన ప్రాశ తయారీ,దాని ప్రాశస్త్యము వివరించారు.దీనిని శీతాకాలం లో సేవించడం చాలా మంచిది. దీనిని తయారు చేయడం కూడా శీతాకాలం లోనే చేస్తారుట.
పక్వానికి వచ్చిన్ తాజాగా పండిన ఉసిరికాయలు,వేర్లు,ఆకులు తెచ్చి కళాయిపెట్టిన పాత్రలో నీళ్ళు పోసి ఉడికిస్తారు.శీతాకాలం లో ఉసిరికాయలు పుష్కలం గాదొరుకుతాయి వాటిలో విటమిన్ "సి" పుష్కలం గావుంటుంది.గులాబి,బిల్వపత్రం,పగడ చెట్టు ఆకులు,విష్ణు క్రాంత ఆకులు,రావీఅకు,ఎండ్రగబ్బ కొమ్మ ఆకు,మునక్కయ ,కరక్కాయ,జీవంతి,నేల ఉసిరి,కజ్జూరం,తామరదుంప,చందనం,ఆకుపచ్చ ఏలకులు,సొంటి అష్టవర్గ మొదలైనవి దీనిలో వేస్తారు.అందుకే చ్యవన ప్రాశ సీసాల పై విశేష అష్ట వర్గలతో చేసింది అని వ్రాస్తారు.తమ్మి వేరు,కాకి దొండ చెట్టు,వ్రుధ్ధ మెదా,మహామదా,రుషభుక్,జీవక కాకోలీ,క్షీరకాకోలి ఈఎనిమిది ని అష్టవర్గ అంటారు.
ఇవి దుర్గమ మైన హిమాలయ పర్వతాలలో మంచు ప్రదేశం లో పుడతాయి.సన్నని సెగ మీద నెయ్యి కాచి ఇవన్ని అందులొ వేసి ఎర్రగా వేగనిస్తారు.పూర్తిగా వేగాక నెయ్యి పైకి వస్తుంది.వెరే నీళ్ళు బాణలిలో వేసిపొంగాక పంచదార వేసి పాకం పడ్తారు.ఇందులొ వేగించిన దినుసులు వేసి హల్వాలా చేస్తారు.పిప్పలి,నాగ కేసరి,తేజపత్తా,ఏలకులు,వంశలోచన్,దాల్చీని,మెత్తగా నూరి ఇందులో కలుపుతారు.చల్లబడ్డాక సీసాలలో నింపుతారు.
ఉదయం ఫలహారం చేసేముందు పాలతోకానీ,వేడినీటితో కాని 20 గ్రాములు పుచ్చుకోవాలి.రాత్రి ఇలాగేసేవించాలి.ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.ఇది శ్రేష్ట మైన రసాయనం. వూపిరితిత్తులకి,మస్తిష్కానికిశక్తినిస్తుంది.గుండెలోని ధమనులని,నాడులని బలపరుస్తుంది.విద్యార్ధులకి,బుధ్ధిజీవులకి శ్మరణ శాక్తిని పెంచుతుంది.పేగులలో మలం చేరితే వచ్చే రోగాలని నిరోధిస్తుంది.నియమంగా పుచ్చుకొంటే రక్త వౄధ్ధి,శరీరంలో కాంతి కల్గుతాయి.ఇందులో వుండే వంశలోచన అంటే ప్రక్రుతి సిధ్ధమైన "క్యాలిషం "వలన ఎముకలు గట్టిపడతాయి.కాని అన్ని మంచి గుణాలే అని అందరు సెవించకూడదు.వాయుపీడితులు,విరోచనాలయ్యె వాళ్ళు,ఆకలి లేనివాళ్ళు,అజీర్ణం తో బాధ పడే వాళ్ళు పుచ్చుకోకూడదు.ఎదిగేపిల్లలకి ఇది ఎంతో మంచిది.ఇది సహజ మైన,సులభ మైన దివ్యౌధం.శీతాకాలం లో జలుబులు,దగ్గులు,జ్వరాలు రానియ్యదు.తియ్యగా వుండటం వల్ల పిల్లలు తినడానికి ఇష్ట పడతారు.
స్వాగత్ సౌజన్యంతో
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, November 13, 2009
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Monday, November 2, 2009
బ్లాగ్వనంలో వనభోజనం - క్యారెట్ జామ్
కార్తీకమాసం సందర్భంగా ప్రమదలందరూ కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుందామా అని చర్చిస్తుంటే నాకు వంటలు ఆట్టే రావు అందుకే నోరుమూసుకొన్నా! ఐనా అమెరికాలో ఉండి మన తెలుగువంటలేం చేస్తాంలే అనుకున్నా.హైదరాబాదు వెళ్లాక చేద్దాం అంటే జ్యోతి ఊరుకుంటుందా! హెచ్చరిక చేసింది. సరే అని మీకోసం ఆపిల్ జామ్ చేశాను,
కారెట్ ,కొబ్బరి, పెసరపప్పు వేసి ,కరివేపాకు,అల్లము,పచ్చిమిర్చి, ఆవాలు,జీలకర్ర మినప పప్పు, ఒక్క ఎండు మిరప కాయ (ఎక్కువ మిర్చి వేస్తే కారెట్ రుచి తగ్గిపోతుంది) వేసి ఘాటుగా తిరగమూత పెట్టా. బటానీలు ఒక్క వుడుకు రానిచ్చి నీళ్లు ఓడ్చి జీలకర్ర ఉప్పుకారం వేసి పోగిచాను.అరటి పళ్ళు పవిత్ర మైన కార్తిక మాసంలో అన్ని విధాలా శ్రేష్టం కదా! అవిపెట్టాను. కారెట్ పడవలాచేసి వెడల్పాటి గిన్నెలో ఒక్క ఉడుకు రానిచ్చి జాగ్రత్తగా బయటికి తీసి , మధ్యలో గుజ్జు తిసేసి అందులో జామ్ నింపా. ఆపిల్ ముక్కతో తెరచాప చేశా. పడవ వాడు వున్నాడుగాని, పనికి రాదు. తక్కినవి తినవచ్చు.పరీక్షకి చదవని వాడు బలవంతంగా వెళ్లి హాజరు అవుతాడే! అలాగన్నమాట. ఏమి అన్యదా భావించకండి.
మీ జ్ఞాన ప్రసూన
Posted by
జ్ఞాన ప్రసూన
at
Monday, November 02, 2009
10
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
నామాట
Subscribe to:
Posts (Atom)

