దసరా శుభా కాంక్షలు
ఉత్సాహంగా ,స్ప్ఫూర్తితో ,ఐకమత్యంతో ,ఆయురారోగ్యాలతో ,అందరూ చల్లగావుండేలా దీవించమని అమ్మలగన్న అమ్మని ప్రార్ధిస్తూ
జ్ఞానప్రసూన
Friday, October 8, 2010
దసరా శుభా కాంక్షలు
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, October 08, 2010
2
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
దసరా శుభాకాంక్షలు
Thursday, October 7, 2010
రాకపోకలు
రాకపోకలు
సమాజంలో ఐకమత్యంగా ఉండాలన్నా,భందుత్వాలు బతకాలన్నా రాకపోకలు కావాలి. మేము డిల్లి లో వున్నపుడు పెళ్ళిళ్ళకి,ఒడుగులకి,పండగలకి,పబ్బాలకి దేనికి రాలేకపోయే వాళ్ళం.
ఎందుకంటే ఆంధ్రా రావాలంటే కనీసం పది రోజులయినా సెలవులు కావాలి.
పిల్లలకి ,ఈయనకి ఎప్పుడు సెలవలు కలిసి వచ్చేవి కావు. అందువలన
సెలవుల లోనే ఆంధ్రా వచ్చేవాళ్ళం.బెజవాడ వెళ్ళాలి,ఏలూరు వెళ్ళాలి
హైదరాబాదులో అందరిని కలవాలి. రాగానే వారాలు చెప్పుకొని ఒకోరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. మాస్నేహితురాలు గుమ్మంలో అడుగు పెట్టగానే అడిగేది"చూసిపోదామని వచ్చావా?ఉండటానికి వచ్చావా?"అని.
వుండాటానికి టైమే ఎదే? చూసిపోదామనే వచ్చాను అంటే "సరే !చూసావుగాపో!లోపలి కూడా ఎందుకు?అనేది.మనం కావాలనుకొని మనతో మనసు విప్పి మాట్లాడే వాళ్ళ ఇంటికి వెళ్లి గడపలేముకాని,సతాయించి ,సాగాదీసుకొనే వాళ్ళ ఇళ్ళకి తప్పక వెళ్ళాల్సి వచ్చేది.డిల్లి లో అందరం నెలకొక సారైనా ఏదో వంకన కలుసుకొనే వాళ్ళం.మరీ వీలుకాకపోతే ఫోనులో తప్పక మాట్లాడుకొనే వాళ్ళం. ఇక్కడికి వచ్చి బందువల ఇళ్ళకి వెళ్లి "ఎరాబావా! నారాయణ్ బాబాయి ఎలావున్నాడురా?అంటే "ఏమోనే!వెళ్లి చాలారోజులయింది"అనేవాడు మాబావ."ఏమి వాళ్ళు ఇల్లు మారారా?"అబ్బే !అదెఇల్లు ,పక్క సందులోనే కదా? నాకు చాలా ఆశ్చర్యం వేసేది.పక్కపక్కనే వుంది ఆరు నెలలయినా ఒకరింటికి ఒకరు వెళ్ళకుండా వున్నారా?అని.పనేమన్నా వుంటే వెళ్ళాలి,ఏమీ లేదు అనేవాడు.వాళ్ళింట్లో ఏదో శుభ కార్యమయి భోజనానికిపిలిస్తే వెడతాడట .వూరికే వెళ్ళకూడదా?హాయిగా సాయంత్రం పూట వెళ్లి కాసేపు కూచుని పిచ్చా పాటి మాట్లాడుకొని రాకూడదా?మళ్ళి వాళ్ళని తన ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పుకో కూడదా?ఎంత తెలిసిన వాళ్ళ యినా సరే చూస్తె నవ్వాలని,నవ్వితే పలకరించాలని,పలకరిస్తే ఏదైనా పని చెపుతారని ఇలా ఊహించుకొని అసలు మొహం తిప్పెసుకొంటారు.
మాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములున్నారు.ఈరోజుల్లో అందరికి ఉద్యోగాలేగా!కాని ప్రతి ఆదివారం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు కలుసుకోనేవారు.ఒకసారి వీళ్ళు వెడితే ఒకసారి వాళ్ళు వచ్చే వారు. ఆప్యాయంగా కలిసి భోంచేసి ఇద్దరు కలిసి ఎస్నేహితులింటికో వెళ్లి
రాత్రికి ఎవరి గూటికి వాళ్ళు చేరేవారు.అందువలన ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కలిసిపోయి ఆడుకొనే వాళ్ళు.శివరాత్రికి సంకురాత్రికి కలిస్తే ఒకళ్ళని చూస్తె ఒకళ్ళకి కొత్తదనం,భయం .రాకపోకల మధ్య దూరం ఎక్కువయితే భందుత్వాలుకూడా తుప్పు పట్టిపోతాయి.
సమాజంలో ఐకమత్యంగా ఉండాలన్నా,భందుత్వాలు బతకాలన్నా రాకపోకలు కావాలి. మేము డిల్లి లో వున్నపుడు పెళ్ళిళ్ళకి,ఒడుగులకి,పండగలకి,పబ్బాలకి దేనికి రాలేకపోయే వాళ్ళం.
ఎందుకంటే ఆంధ్రా రావాలంటే కనీసం పది రోజులయినా సెలవులు కావాలి.
పిల్లలకి ,ఈయనకి ఎప్పుడు సెలవలు కలిసి వచ్చేవి కావు. అందువలన
సెలవుల లోనే ఆంధ్రా వచ్చేవాళ్ళం.బెజవాడ వెళ్ళాలి,ఏలూరు వెళ్ళాలి
హైదరాబాదులో అందరిని కలవాలి. రాగానే వారాలు చెప్పుకొని ఒకోరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. మాస్నేహితురాలు గుమ్మంలో అడుగు పెట్టగానే అడిగేది"చూసిపోదామని వచ్చావా?ఉండటానికి వచ్చావా?"అని.
వుండాటానికి టైమే ఎదే? చూసిపోదామనే వచ్చాను అంటే "సరే !చూసావుగాపో!లోపలి కూడా ఎందుకు?అనేది.మనం కావాలనుకొని మనతో మనసు విప్పి మాట్లాడే వాళ్ళ ఇంటికి వెళ్లి గడపలేముకాని,సతాయించి ,సాగాదీసుకొనే వాళ్ళ ఇళ్ళకి తప్పక వెళ్ళాల్సి వచ్చేది.డిల్లి లో అందరం నెలకొక సారైనా ఏదో వంకన కలుసుకొనే వాళ్ళం.మరీ వీలుకాకపోతే ఫోనులో తప్పక మాట్లాడుకొనే వాళ్ళం. ఇక్కడికి వచ్చి బందువల ఇళ్ళకి వెళ్లి "ఎరాబావా! నారాయణ్ బాబాయి ఎలావున్నాడురా?అంటే "ఏమోనే!వెళ్లి చాలారోజులయింది"అనేవాడు మాబావ."ఏమి వాళ్ళు ఇల్లు మారారా?"అబ్బే !అదెఇల్లు ,పక్క సందులోనే కదా? నాకు చాలా ఆశ్చర్యం వేసేది.పక్కపక్కనే వుంది ఆరు నెలలయినా ఒకరింటికి ఒకరు వెళ్ళకుండా వున్నారా?అని.పనేమన్నా వుంటే వెళ్ళాలి,ఏమీ లేదు అనేవాడు.వాళ్ళింట్లో ఏదో శుభ కార్యమయి భోజనానికిపిలిస్తే వెడతాడట .వూరికే వెళ్ళకూడదా?హాయిగా సాయంత్రం పూట వెళ్లి కాసేపు కూచుని పిచ్చా పాటి మాట్లాడుకొని రాకూడదా?మళ్ళి వాళ్ళని తన ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పుకో కూడదా?ఎంత తెలిసిన వాళ్ళ యినా సరే చూస్తె నవ్వాలని,నవ్వితే పలకరించాలని,పలకరిస్తే ఏదైనా పని చెపుతారని ఇలా ఊహించుకొని అసలు మొహం తిప్పెసుకొంటారు.
మాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములున్నారు.ఈరోజుల్లో అందరికి ఉద్యోగాలేగా!కాని ప్రతి ఆదివారం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు కలుసుకోనేవారు.ఒకసారి వీళ్ళు వెడితే ఒకసారి వాళ్ళు వచ్చే వారు. ఆప్యాయంగా కలిసి భోంచేసి ఇద్దరు కలిసి ఎస్నేహితులింటికో వెళ్లి
రాత్రికి ఎవరి గూటికి వాళ్ళు చేరేవారు.అందువలన ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కలిసిపోయి ఆడుకొనే వాళ్ళు.శివరాత్రికి సంకురాత్రికి కలిస్తే ఒకళ్ళని చూస్తె ఒకళ్ళకి కొత్తదనం,భయం .రాకపోకల మధ్య దూరం ఎక్కువయితే భందుత్వాలుకూడా తుప్పు పట్టిపోతాయి.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Thursday, October 07, 2010
1 comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Friday, October 1, 2010
మా బందరు
చల్ల బజారు
చెమ్మన గిరి పేటలో వుండగా మా తాతయ్యతో [నాన్నగారినాన్న}పెరుగు కొనడానికి" చల్లబజారు" కు వెళ్ళే కార్యక్రమం చాలా సరదాగా వుండేది.మాఇంటి పక్క సందులోకి వెళ్లి ఎడమ చేతి వేపుకు తిరిగితే పెద్ద మైదానం వుండేది,అదే చల్ల బజారు.ఎవరికన్నా ఇంటి గుర్తులు చెప్పాలంటే అదేనండీ!చల్లబజారు ఆనుకొని వున్నా సందులోనే మూడో ఇల్లుమాది.అని చెప్పేవారు.చల్లబజారు చాలా ఫేమస్ .చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అక్కడ పెరుగు అమ్మేవారు.పెరుగు బజారు అంటే చల్ల వుండ దనుకొంటా రానో ఏమో చల్లబజారు అనేవారు,కాని అక్కడ పెరుగు,చల్ల ,వెన్న కొండొకచో కూరలుకూడా ఉండేవి.గురజాడ రాఘవ శర్మగారు కూడా మా చల్ల బజారుకు రావలసిందే!అక్కడ ఎవరేనా రసజ్ఞులు తారస పడితే పదిపద్యాలువినిపించ వలసిందే! చల్ల బజారులో పెరుగు జాడీలు పట్టుకు నుంచుని ఘంటల తరబడి జనాలు మాట్లాడుకొనే వాళ్ళు.చుట్టరికాలు తిరగేసేవాళ్ళు,అంతెందుకు పెళ్లి సంభందాలు కూడా కుదుర్చుకొనే వాళ్ళు.
తెల్లవారేసరికి ఆ మైదానం అంతా గొల్ల భామలతో వారి తట్టలతో నిండిపోయేది. తోడూ పెట్టిన పెరుగు ముంతలు చిన్నా పెద్దా తట్టలో సర్దుకొని దానిపై ఒక పాత గుడ్డ కప్పి పట్టుకోచేవారు. చుట్టూ పక్కల గ్రామాల వారంతా మా బందరు బస్తీలో ఎక్కువ ఖరీదుకు పెరుగు అమ్ముకోవాలని వచ్చేవారు."పెరుగుసంత"అనోచ్చుదాన్ని. మా తాతయ్య సన్నగా పొడుగ్గా ఉండేవాడు. ఎప్పుడూ ఎండల్లో తిరిగితిరిగి కమిలిన వంకాయ రంగులో వుండేది ఆయన శరీరం.అయిదు ఊళ్ళకి కరిణీకం చేసేవారట. ఆయన చొక్కా వేసుకొనే వారుకాదు.పంచె ఉత్తరీయం .ఉత్తరీయం బుజాన వేసుకు ఒకకోస కుడి చేతి కిందనుంచి ముంజేతి పైకి వేసుకొనేవారు.చంకలో పొడుగాటి జాది ఇరికిన్చుకొని ఎడంచేత్తో నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవారు. పెరుగు కొనడానికి ఆస్థాన రుచి విశేష జ్ఞురాలిని
నేను. ఆమైదానంలో పెరుగుతట్టలు అర్ధ చంద్రాకారంగా పెట్టుకు కూర్చునే వారు.అణా ముంత ,బేడముంత ,పావలా ముంత,రూపాయిముంత అని సైజు వారీగా ముంత లుండేవి.పెరుగు అరచేతిలో వేయించుకొని పుల్లగా వుందో,తియ్యగా వుందో తిని చెప్పడం మన పని.ఒక కొస నుండి మొదలుపెట్టేవాడుతాతయ్య."బాబుగారూ!మా పెరుగుకొనండి!తియ్యగా ఘట్టిగా వుందండి అని పిలుస్తూ వుండేవారు.మా తాతయ్యకి చాలా మంది తెలుసు కాబోలు ఆ గొల్లవారితో హాస్యాలాడేవాడు. హాస్యంలో చనువు ,హుందాతనం,సరసం తొంగి చూసేవి,వాళ్ళేమి అనేవారుకాదు.ఒకోతట్ట దగ్గర నిలబడి నేను చెయ్యి పెడితే నా చెయ్యి కిందకి దింపి "ఇది మొగుడికే గడ్డ పెరుగు వెయ్యదు మనకేమి అమ్ము తున్దిలే అని లాక్కుపోయేవాడు.ఒకొరి మున్తల్లో పెరుగు పైన నీరు తేలుతూ వుండేది,కొనండి బాబూ అనేదామే ,సరేలే!నీపెరుగెంత ఘట్టిదో తెలుస్తూనేవుంది.నిగనిగలాడే నీవోళ్ళు,ముంత నిండా నీళ్ళు. అనేవాడు.నేను అలాగే కాస్త కాస్త పెరుగుతింటూ ఎప్పుడు పొట్ట నిండితే అప్పుడు పెరుగు పుల్లగావున్న సరే "ఇది తీసుకో తాతయ్యా!అనేదాన్ని.అప్పుడు తాతయ్య జాడీ నిండా పెరుగు కొనేవాడు.రోజు ఈ కార్య క్రమం ఘంటా రెండు ఘంటలు నడిచేది.తాతయ్య జాడీ నిండా పెరుగుకోనడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే "వాళ్ళ అబ్బాయి ఆపెరుగు సగం అన్న పోసుకోవాలని.మానాన్న కి పెరుగుకి ఆరు మైళ్ళ దూరం. విస్తట్లో నాలుగు మెతుకులు పెట్టుకొని దానిమీద చెంచా పోసుకోనేవాడుమా నాన్న.తరవాత జాడీ చూసి మా తాతయ్య అమ్మని నన్ను కూకలేసేవాడు. "వంట చెయ్యగానే సరా! ప్రేమగా కొసరివడ్డించాలి. అని.
చెమ్మన గిరి పేటలో వుండగా మా తాతయ్యతో [నాన్నగారినాన్న}పెరుగు కొనడానికి" చల్లబజారు" కు వెళ్ళే కార్యక్రమం చాలా సరదాగా వుండేది.మాఇంటి పక్క సందులోకి వెళ్లి ఎడమ చేతి వేపుకు తిరిగితే పెద్ద మైదానం వుండేది,అదే చల్ల బజారు.ఎవరికన్నా ఇంటి గుర్తులు చెప్పాలంటే అదేనండీ!చల్లబజారు ఆనుకొని వున్నా సందులోనే మూడో ఇల్లుమాది.అని చెప్పేవారు.చల్లబజారు చాలా ఫేమస్ .చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అక్కడ పెరుగు అమ్మేవారు.పెరుగు బజారు అంటే చల్ల వుండ దనుకొంటా రానో ఏమో చల్లబజారు అనేవారు,కాని అక్కడ పెరుగు,చల్ల ,వెన్న కొండొకచో కూరలుకూడా ఉండేవి.గురజాడ రాఘవ శర్మగారు కూడా మా చల్ల బజారుకు రావలసిందే!అక్కడ ఎవరేనా రసజ్ఞులు తారస పడితే పదిపద్యాలువినిపించ వలసిందే! చల్ల బజారులో పెరుగు జాడీలు పట్టుకు నుంచుని ఘంటల తరబడి జనాలు మాట్లాడుకొనే వాళ్ళు.చుట్టరికాలు తిరగేసేవాళ్ళు,అంతెందుకు పెళ్లి సంభందాలు కూడా కుదుర్చుకొనే వాళ్ళు.
తెల్లవారేసరికి ఆ మైదానం అంతా గొల్ల భామలతో వారి తట్టలతో నిండిపోయేది. తోడూ పెట్టిన పెరుగు ముంతలు చిన్నా పెద్దా తట్టలో సర్దుకొని దానిపై ఒక పాత గుడ్డ కప్పి పట్టుకోచేవారు. చుట్టూ పక్కల గ్రామాల వారంతా మా బందరు బస్తీలో ఎక్కువ ఖరీదుకు పెరుగు అమ్ముకోవాలని వచ్చేవారు."పెరుగుసంత"అనోచ్చుదాన్ని. మా తాతయ్య సన్నగా పొడుగ్గా ఉండేవాడు. ఎప్పుడూ ఎండల్లో తిరిగితిరిగి కమిలిన వంకాయ రంగులో వుండేది ఆయన శరీరం.అయిదు ఊళ్ళకి కరిణీకం చేసేవారట. ఆయన చొక్కా వేసుకొనే వారుకాదు.పంచె ఉత్తరీయం .ఉత్తరీయం బుజాన వేసుకు ఒకకోస కుడి చేతి కిందనుంచి ముంజేతి పైకి వేసుకొనేవారు.చంకలో పొడుగాటి జాది ఇరికిన్చుకొని ఎడంచేత్తో నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవారు. పెరుగు కొనడానికి ఆస్థాన రుచి విశేష జ్ఞురాలిని
నేను. ఆమైదానంలో పెరుగుతట్టలు అర్ధ చంద్రాకారంగా పెట్టుకు కూర్చునే వారు.అణా ముంత ,బేడముంత ,పావలా ముంత,రూపాయిముంత అని సైజు వారీగా ముంత లుండేవి.పెరుగు అరచేతిలో వేయించుకొని పుల్లగా వుందో,తియ్యగా వుందో తిని చెప్పడం మన పని.ఒక కొస నుండి మొదలుపెట్టేవాడుతాతయ్య."బాబుగారూ!మా పెరుగుకొనండి!తియ్యగా ఘట్టిగా వుందండి అని పిలుస్తూ వుండేవారు.మా తాతయ్యకి చాలా మంది తెలుసు కాబోలు ఆ గొల్లవారితో హాస్యాలాడేవాడు. హాస్యంలో చనువు ,హుందాతనం,సరసం తొంగి చూసేవి,వాళ్ళేమి అనేవారుకాదు.ఒకోతట్ట దగ్గర నిలబడి నేను చెయ్యి పెడితే నా చెయ్యి కిందకి దింపి "ఇది మొగుడికే గడ్డ పెరుగు వెయ్యదు మనకేమి అమ్ము తున్దిలే అని లాక్కుపోయేవాడు.ఒకొరి మున్తల్లో పెరుగు పైన నీరు తేలుతూ వుండేది,కొనండి బాబూ అనేదామే ,సరేలే!నీపెరుగెంత ఘట్టిదో తెలుస్తూనేవుంది.నిగనిగలాడే నీవోళ్ళు,ముంత నిండా నీళ్ళు. అనేవాడు.నేను అలాగే కాస్త కాస్త పెరుగుతింటూ ఎప్పుడు పొట్ట నిండితే అప్పుడు పెరుగు పుల్లగావున్న సరే "ఇది తీసుకో తాతయ్యా!అనేదాన్ని.అప్పుడు తాతయ్య జాడీ నిండా పెరుగు కొనేవాడు.రోజు ఈ కార్య క్రమం ఘంటా రెండు ఘంటలు నడిచేది.తాతయ్య జాడీ నిండా పెరుగుకోనడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే "వాళ్ళ అబ్బాయి ఆపెరుగు సగం అన్న పోసుకోవాలని.మానాన్న కి పెరుగుకి ఆరు మైళ్ళ దూరం. విస్తట్లో నాలుగు మెతుకులు పెట్టుకొని దానిమీద చెంచా పోసుకోనేవాడుమా నాన్న.తరవాత జాడీ చూసి మా తాతయ్య అమ్మని నన్ను కూకలేసేవాడు. "వంట చెయ్యగానే సరా! ప్రేమగా కొసరివడ్డించాలి. అని.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, October 01, 2010
5
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
మా బందరు
Subscribe to:
Posts (Atom)
