కత్తికోతపై సుత్తి దెబ్బ
కత్తికోతపై సుత్తి దెబ్బ పడ్డట్టుగా, మా వదిన గారు పోయిన పది రోజులకే మా చిన్న మేన మామ చని పోయారు. కొన్నాళ్ళు గా అనారోగ్యం తో బాధపడుతున్నారు. ఒకవిధంగా చుస్తే ఆయన బాధల నుండి విముక్తి చెందారు. వున్నవాళ్ళకి ఆక్రోశం, ఆవేదన. ఇలాంటప్పుడు సముద్రాలకివల వుంది వున్నపలాన వెళ్ళలేక ఇరుక్కుపోతే మనసెంత గిల గిల లాడుటుందో అనుభవైక వేద్యం అయ్యింది ఈ సారి. మనం వెళ్ళాక పొతే ఏమి ఆగవు. మనం వెళ్లి చేసేది ఏది లేదు అనుకున్నా మనసు వినకుండా స్తంభానికి కట్టేసినవాడు గిమ్జుకున్నట్టు గింజుకుంది. ఇలాటి స్థితిలో బంధువుల మధ్య అనుభవించిన దుఃఖానికి దురాంగా కుర్చుని అనుభవించిన దుఃఖానికి ఎంత తేడా వుంటుందో తెలిసి వచ్చింది. చివరి క్షణాలలో దగ్గర వుండి నలుగురితో కలసి కాస్సేపు ఏడిస్తే, వాళ్ళతో కలిపి ఆ పది రోజులు గడిపితే ఆ దుఃఖం పంచుకున్నట్టు అవుతుంది. తల్లి తరివాత తల్లి అంతటిది పిన్న తల్లి అంటారు. మేనమామకి కూడా ఒక గౌరవ స్థానం వుంటుంది మనసులో. వాళ్ళు కూడా అక్క పిల్లల మంచి చెడ్డలు చూసుకుంటూవుంటారు. మేన మామ పోతే నాకే ఇలా అనిపిస్తే, మాతృ దేశంలో తల్లో తండ్రో చనిపోతే ఇక్కడున్నవాళ్ళ పరిస్థితి ఎంత భయంకరమో ఊహకందనిది. డబ్బు చేతిలో వుండాలి, టిక్కట్లు దొరకాలి, అంతదాకా అక్కడ సంబాళించే ఆత్మీయులుండాలి. చివరి చూపు లభ్యం అవ్వాలి. ఇక్కడున్న మా బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఒకరికందిన సమాచారం మరొకరు చెప్పుకుని, ఓదార్చుకున్నాము. ఇంటికి ఫోన్లో మాట్లాడి శాంతిద్దామంటే, గొంతు పూడుకుపోయి మనం, అవతల వాళ్ళు ఏడుస్తూ ఏదో చెప్తున్నారు, ఒక్క మాట తెలీలేదు. మా పిన్నతల్లి తన పెద్ద కూతురుని తమ్ముడుకిచ్చి పెళ్ళిచేసింది. ఆవిడిప్పుడు 80 ఏళ్ళ పండుటాకు. ఇటు తమ్ముడు, అటు అల్లూడు, రెండువిధాలా ఆమెకి గుండె కోత. ఆడ పిల్లలు ఒకటే ఏడుపు. ఎంత ఏడ్చినా ఏడుపాగటంలేదు అక్కాయ్యా, పొంగి పొంగి వస్తూనేవుంది అంది. తల్లి తండ్రి చనిపోతే, గుండెలోచి ఒక ముక్క కోసి అవతల పారేసినట్లనిపుస్తుంది. నిజానికి మనిషికి, మనిషి మనసుకి ఒంటరి తనం అప్పుడే మొదలవుతుంది. ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, భార్యకి భాధ్యతలేవి లేకుండా వెళ్ళిపోయాడు మామయ్య. అయినా భార్యకెంత దుఃఖం!ఇన్ట్లోనిన్చీ జీవితంలోంచి ఆవ్యక్తి తప్పుకోన్నాక మాననిగాయం,పూడ్చాలేనిగోయ్యి
సంసార వృక్షం పెకలించినట్లయిపోతుంది,తిరగేసినట్లవుతుంది,చిఇకట్లో నడిచినట్లున్తుంది,సక్తిఅంతా పాదాలలోకి వస్తుంది,మనమేలేనట్లు మనకేనీ లేనట్లు అనిపిస్తుంది.అందుకేఅంటారు,"ఒక మంగలసుఉత్రం
కదిలితే వెయ్యి సూత్రాలు కడులుతాయని .ఇదంతా బ్లాగ్లో ఎందుకువ్రాస్తున్నానంటే అదొక స్వాంతన .వ్రాయడానికి సంకోచించాను కానీ "ఈబ్లొగ్ ఎంత ఉపయోగ పడుతున్నదోనీబ్లొగే నీకు తోడునీడా
నేపాఠకులేనేకుతోబుట్టువులు "అనుకోని వ్రాసా.
Showing posts with label శ్రద్ధాంజలి. Show all posts
Showing posts with label శ్రద్ధాంజలి. Show all posts
Thursday, July 17, 2008
Sunday, July 13, 2008
శేష స్మృతి
సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగా ఆడపిల్ల జీవితం రెండుభాగాలు ,
ఒకటి పుట్టిల్లు ,రెండు అత్తిల్లు .పెళ్లి , అత్తవారిల్లు అనగానే ఆడపిల్లలకి 'అ ""ఆ " లంటే ["అ " అత్తగారు ""ఆ ""ఆడబడుచు "] భయం మనసులో పీకుతూ వుంటుంది . మాకు ముగ్గురు ఆడపడుచులు .మధ్య ఆమె పేరు సేషమ్మగారు . మా అత్తవారింటి ఇలవేలుపు నాగేంద్రుడు . అందుకని అందరికి ఆయన పేరు కలుపుతారు . నాపెళ్ళి అయేసరికి శేష వదినగారు బి .కాం ,బి .ఎల్ పాసయ్యారు .
సమాన మైన ఎత్తు ,పొడుగు ,చాయగల శరీరం ,ఖంగుమనే గొంతు ,అన్నిటికి మించి ఆమె కళ్లు చూసిన వాళ్ళని మిన్గేస్తాయెమో అన్నంత పవర్ఫుల్ గా వుండేవి . ఆమె మనస్సులోని భావాలు
నోటి మాట ద్వారా బహిర్గతంయ్యేముండు ఆమె కళ్ళద్వారా తెలిసిపోయేవి . ఆమె నాకంటే పదేళ్ళు పెద్ద .బందుత్వంలో నూ పెద్దే ! కానీ మేము ఇద్దరమూ స్నేహంగా వుండేవాళ్ళము .మా మూడో ఆడపడుచుకూడా అప్పటికి యుక్త వయస్కురాలే ! వీరిద్దరికీ పెళ్లి చేయకుండా మా ఆయనకీ ఎందుకు ముందర పెళ్లి చేసారా ?అని నేను ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ప్రస్నించుకోన్నాను ,కానీ అది జవాబు లేని ప్రశ్న గానే మిగిలిపోయింది .వీళ్ళిద్దరూ అవివాహితులుగానే పోయారు .
చిన్నమే పెద్దామే ముండుపోయారు ,మొన్ననే శేష వదినగారు గతించారు .ఎన్ని పుస్తకాలు చదివినా ,ఏమతం ఆచరించిన ,ఎధర్మాలు బోధించిన ,ఎనిర్నయాలు తీసుకొన్నా సొంతాని కొచ్చేసరికి అవన్నీ పక్కకు తప్పుకొని దు :ఖమే మిగులుతుంది . చావు పుట్టుకలు సహజమని తెలుసు ,
మనస్సు నిగ్రహించుకోవడం కొందరికే సాధ్యం .చివరి క్షణాల లో దగ్గరవుండి చూడకపోతే ఆలోటు తీరనిదే అవుతుంది . ఆసమయంలో నలుగురితో ఆ విషాదం పంచుకొంటే మనసు చల్లబడుతుంది .విదేశాలలో వుండి వెళ్ళలేని చేతకానితనం మరీ బాధగా వుంటుంది .
వదినగారు కుట్లు ,అల్లికలు బాగా చేసేవారు .కళాత్మకం గా వుండేవి .పాట పాడేవారు ,ఆమె తరుచుగా "దేవదేవధవలాచల మందిర ,గంగాధరా హర నమో నమో " అనేపాట పాడేవారు .నాజూకుగా తినేవారు , పని అలాగే నాజూకుగా చేసేవారు . మాపెద్ద మరదికి ఎం .ఎస్సి లో రికమెందేడ్ డిగ్రీ వచ్చి చాలా డీలా పడిపోయాడు .అప్పుడు మా మామ గారు ఈమెను తోడిచ్చి ఇద్దరినీ లా చదివించారు .మనకు తెలియకుండానే ఏవో త్యాగాలు జరిగిపోతుంటాయి ,అవి అవతల వాళ్లకు లాభించడం మాట ఏమోగానీ మనజీవితం పక్క దారి పడుతుంది . లా అయాక అబ్బాయికడా అని అతనిని ఎన్రోలు చేయించారు .కొన్నాళ్ళు వూరికే వున్నారామే .ఆసమయంలో హైదరాబాదు లో పేరెన్నికగల హైస్కూలులో ప్రధానోపాధ్యాయినిగా ఉద్యోగం ఇస్తానన్నారు .మా మామ గారు ఆడపిల్లని అంతదూరం పంపానని వేల్లనియ్యలేదు .ఆతరవాత ఆమెకు వచ్చిన ఉద్యోగం పగలు రాత్రి పల్లెటూళ్ళకి కాంపులు తిరిగేది . శరత్ బాబు అంటాడు ఒకచోట "కొన్ని పనులు ఎందుకు కాలేదు అంటే దానికి జవాబు లేదు , అవి అవలేదు అంటే !"అని .సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు సరదాగా గడిపే వాళ్లము .ఇద్దరికీ కుట్లు ,అల్లికలు ఇష్టం .ఆమెతో మాట్లాడుతున్నపుదల్లా ఆమెకు పెల్లికాలేడనే బాధ లోపల మెలి తిరిగేది .రెండు దిగ్రీలుంది ,రూపసి అయిన పిల్లకి కూడా రెండో పెళ్లి వాడయినా సరే పది వేలు ఇరవై వేలూ కట్నం అడిగేవారు . ఆమెకి కోపం వచ్చేది ."ఇన్ని రూపాయలు పోసి వాడిని కట్టుకొంతెవాదేలాటి వాడవుతాడో ?ఇప్పుడేమి తక్కువయింది ?హాయిగా వుద్యోగం చేసుకొని ఇంట సంపాయిన్చుకొంతున్నాము కాదమ్మా !అనేవారు .ఆమాటలలో ఎంత నిర్లిప్తత వుందో అర్ధం చేసుకొనేవారికి తెలుస్తూంది .తమ చుట్టూవున్న వారు పెళ్ళికి ఆలస్యం చేస్తున్నారని ,శ్రద్ధ చూపడం లేదని తెలిసినా అయినింటి ఆడపిల్లలు అలా మర్యాదగానే మాట్లాడతారు .
తన ప్రేమని తమ కుటుంబానికి ,అక్క పిల్లలకి ,సమాజానికి అందించడం అలవర్చుకొన్నారు . మా వారు ఫై .హెచ్ ^డి .చేయ దానికి వెళ్ళినప్పుడు "హలో !డార్లింగ్ !నేనున్నాగానీకు హాఫ్ హస్బండ్ ^ని !నీకేమికావాలన్నా నాతొ చెప్పు ."అని ధైర్యం చెప్పేవారు .మరదల్లము వారి తమ్ముళ్ళని ఏదైనా అంటే మాటల తూణీరాలు రెడీగా పెట్టుకు మాపై విసురుతూ వుండేవారు .మల్లి మాకు మల్లెపువ్వులు కొనిపెట్టి , మన ఇంటి కోడల్లమ్మా !అని గారవించేవారు .
మంచం దిగి పని చెయ్యలేనిఅనారోగ్యం తో వున్నా మేము వెడితే కూరలు ,పళ్ళు ,పాలు ఎక్కువ తెప్పించి ,స్వీట్లు ,హాటులు తెప్పించి బాగా తినిపించేవారు . ఎవరికైనా ఉత్తరాలు వ్రాసి పెట్టడం ,కోర్టుకు సంబంధించిన విషయాలలో సలహాలివ్వడం , పిల్లలకి పాఠాలు చెప్పడం ఇష్టం . ఒక అమ్మాయి సవతితల్లి ,తండ్రి బాధ పెద్తూంటే ఆ అమ్మాయిని తెచ్చి మా ఇంట్లో నాలుగురోజులు దాచి తరువాత అనాధాశ్రమంలో చేర్పించి పెళ్లిచీసారామీ .ఇతరుల సుఖంలో తనసుఖం చూసుకొన్నారు .ఒంటరి జీవితాన్ని ప్రేమించారు .తన లోట్లకి ఇతరులని భాధ్యులు చేసి నిలబెట్టి ప్రస్నాలదగలేదు .
ఇష్టమైన పనులు చేస్తాముగానీ ,చేయవలసినపనుల్లో ఇష్టం కల్పించుకోలేము .అలా చేయాలంటే క్రమశిక్షణ ,త్యాగము ,ప్రేమా చాలా అవుసరం .ఎవరెవరి పట్ల వారి వారి బాధ్యతలు నిర్వహించదమనేది సంసారం నడిపే వారికీ ముఖ్య కర్తవ్యమ్ .స్వ సుఖ్స్ము ,స్వేచ్చ ,స్వార్ధము ,కర్తవ్యాల పై బండరాల్లలా పడిపోతాయి .కర్తవ్యాలు అడుగునుంచి కీచు మంతున్నా -ఈకోరికల కోలాహలంలోఅవి చేవిదాకా రావు . ఆత్మా ఎమూలనుంచో "ఈపని నువ్వు చేస్తే బాగుంటుంది ,చెయ్యాలి అన్తూనేవుంటుంది .దాని నోరుమూసిగొను సంచీలో మూటకట్టి మానవుడు తన అవసరాల వెనుక పరుగెత్తు తూ వుంటాడు .ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఇక ఏరుతువులోనూ చిగార్చని మోడులలా అంతమయి పోతుంటాయి నా కన్నీరు వాళ్ళపై పన్నీరు జల్లు కావాలి .
ఒకటి పుట్టిల్లు ,రెండు అత్తిల్లు .పెళ్లి , అత్తవారిల్లు అనగానే ఆడపిల్లలకి 'అ ""ఆ " లంటే ["అ " అత్తగారు ""ఆ ""ఆడబడుచు "] భయం మనసులో పీకుతూ వుంటుంది . మాకు ముగ్గురు ఆడపడుచులు .మధ్య ఆమె పేరు సేషమ్మగారు . మా అత్తవారింటి ఇలవేలుపు నాగేంద్రుడు . అందుకని అందరికి ఆయన పేరు కలుపుతారు . నాపెళ్ళి అయేసరికి శేష వదినగారు బి .కాం ,బి .ఎల్ పాసయ్యారు .
సమాన మైన ఎత్తు ,పొడుగు ,చాయగల శరీరం ,ఖంగుమనే గొంతు ,అన్నిటికి మించి ఆమె కళ్లు చూసిన వాళ్ళని మిన్గేస్తాయెమో అన్నంత పవర్ఫుల్ గా వుండేవి . ఆమె మనస్సులోని భావాలు
నోటి మాట ద్వారా బహిర్గతంయ్యేముండు ఆమె కళ్ళద్వారా తెలిసిపోయేవి . ఆమె నాకంటే పదేళ్ళు పెద్ద .బందుత్వంలో నూ పెద్దే ! కానీ మేము ఇద్దరమూ స్నేహంగా వుండేవాళ్ళము .మా మూడో ఆడపడుచుకూడా అప్పటికి యుక్త వయస్కురాలే ! వీరిద్దరికీ పెళ్లి చేయకుండా మా ఆయనకీ ఎందుకు ముందర పెళ్లి చేసారా ?అని నేను ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ప్రస్నించుకోన్నాను ,కానీ అది జవాబు లేని ప్రశ్న గానే మిగిలిపోయింది .వీళ్ళిద్దరూ అవివాహితులుగానే పోయారు .
చిన్నమే పెద్దామే ముండుపోయారు ,మొన్ననే శేష వదినగారు గతించారు .ఎన్ని పుస్తకాలు చదివినా ,ఏమతం ఆచరించిన ,ఎధర్మాలు బోధించిన ,ఎనిర్నయాలు తీసుకొన్నా సొంతాని కొచ్చేసరికి అవన్నీ పక్కకు తప్పుకొని దు :ఖమే మిగులుతుంది . చావు పుట్టుకలు సహజమని తెలుసు ,
మనస్సు నిగ్రహించుకోవడం కొందరికే సాధ్యం .చివరి క్షణాల లో దగ్గరవుండి చూడకపోతే ఆలోటు తీరనిదే అవుతుంది . ఆసమయంలో నలుగురితో ఆ విషాదం పంచుకొంటే మనసు చల్లబడుతుంది .విదేశాలలో వుండి వెళ్ళలేని చేతకానితనం మరీ బాధగా వుంటుంది .
వదినగారు కుట్లు ,అల్లికలు బాగా చేసేవారు .కళాత్మకం గా వుండేవి .పాట పాడేవారు ,ఆమె తరుచుగా "దేవదేవధవలాచల మందిర ,గంగాధరా హర నమో నమో " అనేపాట పాడేవారు .నాజూకుగా తినేవారు , పని అలాగే నాజూకుగా చేసేవారు . మాపెద్ద మరదికి ఎం .ఎస్సి లో రికమెందేడ్ డిగ్రీ వచ్చి చాలా డీలా పడిపోయాడు .అప్పుడు మా మామ గారు ఈమెను తోడిచ్చి ఇద్దరినీ లా చదివించారు .మనకు తెలియకుండానే ఏవో త్యాగాలు జరిగిపోతుంటాయి ,అవి అవతల వాళ్లకు లాభించడం మాట ఏమోగానీ మనజీవితం పక్క దారి పడుతుంది . లా అయాక అబ్బాయికడా అని అతనిని ఎన్రోలు చేయించారు .కొన్నాళ్ళు వూరికే వున్నారామే .ఆసమయంలో హైదరాబాదు లో పేరెన్నికగల హైస్కూలులో ప్రధానోపాధ్యాయినిగా ఉద్యోగం ఇస్తానన్నారు .మా మామ గారు ఆడపిల్లని అంతదూరం పంపానని వేల్లనియ్యలేదు .ఆతరవాత ఆమెకు వచ్చిన ఉద్యోగం పగలు రాత్రి పల్లెటూళ్ళకి కాంపులు తిరిగేది . శరత్ బాబు అంటాడు ఒకచోట "కొన్ని పనులు ఎందుకు కాలేదు అంటే దానికి జవాబు లేదు , అవి అవలేదు అంటే !"అని .సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు సరదాగా గడిపే వాళ్లము .ఇద్దరికీ కుట్లు ,అల్లికలు ఇష్టం .ఆమెతో మాట్లాడుతున్నపుదల్లా ఆమెకు పెల్లికాలేడనే బాధ లోపల మెలి తిరిగేది .రెండు దిగ్రీలుంది ,రూపసి అయిన పిల్లకి కూడా రెండో పెళ్లి వాడయినా సరే పది వేలు ఇరవై వేలూ కట్నం అడిగేవారు . ఆమెకి కోపం వచ్చేది ."ఇన్ని రూపాయలు పోసి వాడిని కట్టుకొంతెవాదేలాటి వాడవుతాడో ?ఇప్పుడేమి తక్కువయింది ?హాయిగా వుద్యోగం చేసుకొని ఇంట సంపాయిన్చుకొంతున్నాము కాదమ్మా !అనేవారు .ఆమాటలలో ఎంత నిర్లిప్తత వుందో అర్ధం చేసుకొనేవారికి తెలుస్తూంది .తమ చుట్టూవున్న వారు పెళ్ళికి ఆలస్యం చేస్తున్నారని ,శ్రద్ధ చూపడం లేదని తెలిసినా అయినింటి ఆడపిల్లలు అలా మర్యాదగానే మాట్లాడతారు .
తన ప్రేమని తమ కుటుంబానికి ,అక్క పిల్లలకి ,సమాజానికి అందించడం అలవర్చుకొన్నారు . మా వారు ఫై .హెచ్ ^డి .చేయ దానికి వెళ్ళినప్పుడు "హలో !డార్లింగ్ !నేనున్నాగానీకు హాఫ్ హస్బండ్ ^ని !నీకేమికావాలన్నా నాతొ చెప్పు ."అని ధైర్యం చెప్పేవారు .మరదల్లము వారి తమ్ముళ్ళని ఏదైనా అంటే మాటల తూణీరాలు రెడీగా పెట్టుకు మాపై విసురుతూ వుండేవారు .మల్లి మాకు మల్లెపువ్వులు కొనిపెట్టి , మన ఇంటి కోడల్లమ్మా !అని గారవించేవారు .
మంచం దిగి పని చెయ్యలేనిఅనారోగ్యం తో వున్నా మేము వెడితే కూరలు ,పళ్ళు ,పాలు ఎక్కువ తెప్పించి ,స్వీట్లు ,హాటులు తెప్పించి బాగా తినిపించేవారు . ఎవరికైనా ఉత్తరాలు వ్రాసి పెట్టడం ,కోర్టుకు సంబంధించిన విషయాలలో సలహాలివ్వడం , పిల్లలకి పాఠాలు చెప్పడం ఇష్టం . ఒక అమ్మాయి సవతితల్లి ,తండ్రి బాధ పెద్తూంటే ఆ అమ్మాయిని తెచ్చి మా ఇంట్లో నాలుగురోజులు దాచి తరువాత అనాధాశ్రమంలో చేర్పించి పెళ్లిచీసారామీ .ఇతరుల సుఖంలో తనసుఖం చూసుకొన్నారు .ఒంటరి జీవితాన్ని ప్రేమించారు .తన లోట్లకి ఇతరులని భాధ్యులు చేసి నిలబెట్టి ప్రస్నాలదగలేదు .
ఇష్టమైన పనులు చేస్తాముగానీ ,చేయవలసినపనుల్లో ఇష్టం కల్పించుకోలేము .అలా చేయాలంటే క్రమశిక్షణ ,త్యాగము ,ప్రేమా చాలా అవుసరం .ఎవరెవరి పట్ల వారి వారి బాధ్యతలు నిర్వహించదమనేది సంసారం నడిపే వారికీ ముఖ్య కర్తవ్యమ్ .స్వ సుఖ్స్ము ,స్వేచ్చ ,స్వార్ధము ,కర్తవ్యాల పై బండరాల్లలా పడిపోతాయి .కర్తవ్యాలు అడుగునుంచి కీచు మంతున్నా -ఈకోరికల కోలాహలంలోఅవి చేవిదాకా రావు . ఆత్మా ఎమూలనుంచో "ఈపని నువ్వు చేస్తే బాగుంటుంది ,చెయ్యాలి అన్తూనేవుంటుంది .దాని నోరుమూసిగొను సంచీలో మూటకట్టి మానవుడు తన అవసరాల వెనుక పరుగెత్తు తూ వుంటాడు .ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఇక ఏరుతువులోనూ చిగార్చని మోడులలా అంతమయి పోతుంటాయి నా కన్నీరు వాళ్ళపై పన్నీరు జల్లు కావాలి .
Subscribe to:
Posts (Atom)