Pages

Saturday, September 26, 2009

కృష్ణా పత్రికలో రావూరు కురిపించిన వడగళ్ళు

కృష్ణా పత్రికలో రావూరు కురిపించిన వడగళ్ళు
కృష్ణా పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం రావూరుగారి హాస్య ప్రధాన మైన "వడగళ్ళు" కురిసేవి.శ్రీ ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయం చదవాలని,వడగళ్ళు చదివి నవ్వుకోవాలని పాఠకులందరూ శుక్రవారం విడుదల అయ్యే కృష్ణా పత్రిక కోసం ఎదురుచూసేవారు.హాస్యం అందరికి ఇష్టమే!హాస్యంగా వ్రాయడం సులువైన పనికాదు.రావూరు అందులో కృత క్రుత్యు లయారు.వడగళ్ళే
కాక కప్పుకాఫీ ,ఆషామాషీ ,గులాబిముళ్ళు,పిల్లన గ్రోవి ఇలాఎన్నో హాస్యరచనల పరంపర వారి కలం నుండి వెలువడ్డాయి .
ఎవరితోనో మాట్లాడుతుంటేనో ,పేపర్లో ఏదో వార్త చదివో ,చుట్టు
పక్కల జరిగిన ఏసంఘతనో ,మనుషుల బలహీనతలను,అలవాట్లు ,ఊతపదాలు,రాజకీయాలు,సినిమాలు,ధరలు ఎన్నో ఈ వడగళ్ళలో చోటు చేసుకొనేవి.ఇంతేకాక వడగళ్ళ పందిరికింద ముసిముసి నవ్వులు నవ్వుతూ కధానాయకుడు మల్లినాధసూరిగారు వారం వారం కనిపించేవారు.
చాలాకాలం క్రితం యువభారతి సంస్థ వారు "వడగళ్ళు" చిన్న పొత్తం అచ్చు వేసారు.ఛి వంశీ తనసైటులో"వ్యాసావళి " శీర్షిక లో ఆ వడగల్లనికురిపిస్తున్నాడు.ఒకదానివేనక ఒకటి ధారావాహికంగా వస్తున్నాయి.మాగంటి .ఆర్గ్ లోకి వెళ్లి హాస్య ప్రియులు చదివి ఆనందించి,ఆ ఆనందాన్ని వంశీకి అందించండి.
జ్ఞాన ప్రసూన

No comments: