Pages

Tuesday, January 10, 2012

nannu prabhaavitam chesina vyaktulu

                                              రాజమ్మ టీచరుగారు
 
                                     మా అమ్మ     హిందీ     చదువుకొనే టప్పుడు     రాజమ్మ టీచరుగారి   హాలులోకి వున్న
మా   గది  తలుపుతీసి     నన్ను    ఆ  గుమ్మంలో       కూర్చోమనేది.    రాజమ్మ   టీచరుగారు   కూడా  క్లాసులో   నేర్చుకొనే వారు. అప్పటినుంచే   మాఇంట్లో      నాన్న  గారు,అమ్మ    ఖద్దరు   కట్టడం    ప్రారంభించారు.    నాకూ   ఖద్దరే!దుప్పట్లు ,తువాళ్ళు,చేతి రుమాలాలు    అన్ని  ఖద్దరే!  మానాన్నగారు,అమ్మ    పెళ్లిళ్లకు   వెడితే   వీళ్ళకోసం  
ప్రత్యేకం   ఖద్దరుబట్టలు    కొని   పెట్టేవారు.   నేను   అప్పుడే   హిందీ  భాష    విన్నాను.  మాణి  క్యామ్బగారు  పాఠం
చెబుతుంటే ,   హిందీ  కవితలు   పాడుతుంటే    ఏమిటో    తెలియని   ఆనందం.

                             అంత       చిన్నప్పటి    విషయాలు     నాకుబాగా    జ్ఞాపకం వున్నాయి.   చంటి   పిల్లలు,వాళ్ళకేం  తెలుసు  అనుకొంటాం గాని     ఆవయసులో    మనసుకి ప్రతి   విషయాన్ని   హత్తుకొని మనసులో   ముద్రించుకొనే    శక్తి     అపారంగా  వుంటుంది.   ఆ  విషయాలను     మళ్లి   మళ్లి నెమరు    వేసుకొంటే     టీచరు అంటే   అలా  వుండాలికాబోలు,   నాన్నగారిమీద     అంత   మమకారం    వుంటుంది   కాబోలు , ఆట పాటల్లో   హాయి,    కల్మష   రహిత మైన    స్నేహ సంపద   అలా వుంటుంది   కాబోలు    అనిపిస్తుంది.   ఇప్పటికి   నాకు    మీనాక్షి   ఎక్కడైనా    కనిపిస్తే    బాగుండును   అనిపిస్తుంది,అత్తవారు  ఏలూరు అనిచెప్పారు.భోగరాజు  వారికిచ్చారని   విన్నాను.కాని  ఇంకేమీ  తెలియదు.రాజమ్మ    గారి  రూపం   ఇప్పటికి  గుర్తుంది.  ఆమెపై   ఆరాధన  
నా  గుండెల్లో   దీపాలు  వెలిగిస్తూనే   వుంది.

Monday, January 9, 2012

nannu prabhaavitam chesina vyaktulu

                                           రాజమ్మ   టీచరుగారు
                                 
                                ఒక రోజున     రాజమ్మ    టీచరుగారు,హిందీ    టీచరుగారు     కలిసి    హిందీ   క్లాసులో   చదివే   వాళ్ళందరిని    సినిమాకి     బయలుదేరతీసారు . రాజమ్మ     టీచరుగారు     పిల్లలందరికీ    ముందే   వార్నింగ్   ఇచ్చారు,సినిమాహాల్లో      అల్లరి,ఏడుపులు      కుదరవని.     మా  అమ్మ   మంచి  చీర   కట్టుకొని  తయారైంది.   అప్పుడు   బందరులో    మూడే   సినిమా  హాళ్ళు    ఉండేవి,  ఒకటి  మినర్వాహాలు,రెండుబృందావన్ హాలు,మూడు సరస్వతిహాలు.   మాఇంటికి   మినర్వా  హాలు  దగ్గర     .నడిచి              అక్కడికి వెళ్లాం.   కూర్చున్నాం ఇంట్రవెల్  లో  న్యూస్ చూపించారు.   ఆసినిమాపేరు   బాలనాగమ్మ   మొదట్లోనే  అందులో   ఒకపాము  వచ్చి  అక్కడున్న  పళ్ళ మీద    పాకింది. నాకు  ఎంత   భయం   వేసిందో  చెప్పలేను,   అది  నాభుజం  మీద   పాకినంతగా
వణికి పోయాను.   కళ్ళు   ఘట్టిగా   మూసేసుకొన్నా,ఎక్కిఎక్కి  ఏడుపు,  తరవాత   మా అమ్మ    పాము   వెళ్ళిపోయింది,ఇకరాదు   అని  ధైర్యం   చెప్పింది.    కాస్త     కళ్లువిప్పి చూడ టానికి   ప్రయత్నిస్తుండగా    ఆకధలో   హీరోయిన్     పొయ్యిలోకి    కట్టేలులేక     కాలుపెట్టి  వంట  చేసింది.   ఇక  చూసుకో!  నాకు  దు"ఖ  ఆగలేదుబాధతో . ఇంటికి    వెళ్లి పోవాల్సిందే   అని  గోల  చేసాను,మా  అమ్మకి   ఎప్పుడూ   కోపం రాదు,ఆ వేళ  వచ్చింది.  శబ్దం   కాకుండా  వీపుమీద   రెండు   దెబ్బలేసింది.    రాజమ్మ   గారు  చూసి  నన్ను రెక్కపుచ్చుకొని "నువ్వుసినిమా చూడు  సువర్చలా,నేను  సచితని     ఇంట్లోదిమ్పి  చెల్లెలికి   అప్పగించి   వస్తా.అనిలాక్కు వెళ్ళారు..
                            "ఆసంగతి   గుర్తు   వచ్చినపుడల్లా "ఛీ !అవాళ  ఎందుకలా  చేసాను?అని   విచారిస్తూవుంటా. 
అలా  టీచరుగారు  మా లో  ఒకరుగా  వుండేవారు.   హటాత్తుగా     నావంక  చూసి   రాజ మ్మ  టీచరుగారు   నాచేవుల  వంక   చూసి    మా  అమ్మని  కేకలేశారు"పిల్లకి  చెవులు  కుట్టించ లేదేం?   ముదిరిపోవూ!ఈసందు లోనే
  కుట్టేవాడున్నాడుపద.అన్నారు   మాఅమ్మ    బయలుదేరింది.టీచరుగారు     మాతో   వచ్చారు.   నా  చెవుల   మీద  నాము   తో   గుర్తు     పెట్టాడాయన.మా  అమ్మ  వంక  చూసాను,ఆవిడ  లేచి  వెళ్లి  సందు  చివర   నుంచుంది నే   చూడలేను   బాబూ!అని.   రాజమ్మ   టీచరు గారు వున్నారగా   నేను  ధైర్యంగావున్నా ,ఆవిడే  ఇంటికి  తీసుకు  వచ్చారు.
                                 అట్లతదియ      వచ్చిందంటే     హాలులో   ఆడ   పిల్లల్ని    చుట్టూ   కూర్చోపెట్టుకొని    రాజమ్మ   టీచరుగారు   గోరింటాకు   పెట్టేవారు.   మా  ఇంటికి   దగ్గరగా  దుళ్ళ రమణ మ్మగారు   ,జానకీరాణి  వుండేవారు.అప్పటినుంచి   జానకీరాణి తో  స్నేహం.   వాళ్ళ  ఇంటిదగ్గర   పెద్ద   మైదానం  వుందేది .   అక్కడ  అట్లతదియ కి  రోటి   ఉయ్యాల  వేసేవారు.   బలమైన   గుంజ  నేలలో  పాతి    దానిపై  రోలు  తిరగేసి  దిగేసేవారు. రోలు  నడుమ  సన్నగా  వుండాలి.  అక్కడనాలుగు   వెదురు  వాసపు ముక్కలు  అటురెండు,ఇటురెండూ  వచ్చేలా  పెట్టి    తాళ్ళతో   ఘట్టిగా   బిగించేవారు.   నాలుగువేపులా     వున్న వాసాలకి  నాలుగు   వుయ్యాలాలు   కట్టే వారు.   ఉయ్యాలలో   కూర్చునేందుకు  ఘట్టి    వెదురు  బొంగు కట్టేవారు.   వుయ్యాలల్లో  నలుగురూ   కూర్చున్నాక    ,నలుగురు   యువకులు    వాసాలు  ఒకకోస  వాళ్ళు  పట్టుకొని  రెండో  కొస  వుయ్యలల్లో వున్నవారికిచ్చి  ఘట్టిగా  పట్టుకోమని  వాళ్ళు  నెమ్మదిగా  గుంజ  చుట్టూ  తిరుగుతూ   వేగం   ఎక్కించేవారు.   వుయ్యాలాలు  విస్తరించి     గుండ్రంగా  గాలిలోకి  తేలి  తిరిగేవి.    మేము   గుడ్లప్పగించి   చూస్తూ  నిలబడే  వాళ్ళం.మాకోసం  వసారాలలో   వుయ్యాలాలు  వేసేవారు.  తెల్లవారు   ఝామున  తలలుదువ్వి  ,జడే సుకొని,పూలు పెట్టుకొని,   మంచి  దుస్తులు  ధరించి      గోంగూర   పచ్చడి ,పొట్లకాయ  కూర ,పెరుగుతో  అన్నాలుతిని   ఆరోజంతా  ఆడుకోడం,వుయ్యాలాలూగడం  అదే  పని.  
                                              ఎందుకో   ఆఇంట్లో  సంగతులు  బాగా  జ్ఞాపకం  వున్నాయి.   మీనాక్షి  అక్కయ్యగానూ,టీచరుగారు   మమ్మల్ని   నడిపించే  నాయకురాలిగానూ,మాణి క్యాంబ  గారు  ఎక్కడినుంచో  దిగివచ్చిన   దేవకన్య  లానూ  అనిపించేది.   మాఇంట్లో   నేనోక్కత్తేనే   కావడం  చేత      వాళ్ళతోనే    కాలం  గడిపేదాన్ని.
                                    మా   నాన్నగారు     చాలా  ముద్దు  చేసేవారు.  రోజూ  ఆఫీసుకు   వెళ్ళేటప్పుడు    నేనెక్కడున్నా  పిలిచి  ఆఫీసుకువెళ్లి వస్తా     ,అల్లరిచేయ్యకుఅని  చెప్పి వెళ్ళేవారు.   ఒకరోజున  ఏదో   హడావుడిలో   చెప్పకుండా  వెళ్ళారు,పదినిముషా లయాక  చూస్తె   నాన్నగారు   ఇంట్లో   కనిపించలా.  నాన్న లేరు  ఎక్కడికో   వెళ్లి పోయారు ,నాతొ  చెప్పకుండా  వెళ్ళారు  అని  దు:ఖం వచ్చి  రోడ్డుమీదికివెళ్ళా   నాన్న  గొడుగు  వేసుకొని  వెడుతూ  కనిపించారు.  ఏడుస్తున్నాను,పిలుస్తున్నాను,గొంతు  దాటి   పిలుపు  పైకి  రావడం  లేదు,నాన్నగారు  వెళ్ళిపోతున్నారు. ఎలా   వెళ్ళానో     కోటవారి   తుళ్ళ దాకా  వేల్లానునాన్నగారు  ఎవరో  ఏఅడు స్తున్నారనుకిని   వెనక్కి తిరిగి    చూడలేదు,అది  ఇంకా  దు:ఖం  పెంచింది.   అక్కడ  ఎడం వేపుకి  తిరుగుతూ నాన్నగారు ఇతి  చూసారు. నే  కనపడ్డాను.  "తల్లీ!సచితా!  ఏమిటమ్మా!ఎదుపెందుకు అనిఎత్తుకొన్నారు,మీరు  చెప్పకుండా  వేల్లిపోయారుగా  అన్నాను.  ఎత్తుకోనిబుజాన  వేసుకుని  ఒక  చేత్తో  గొడుగు  వేసుకొని  ఇంటికి  తీసుకు  వచ్చి  దింపారు.    అమ్మని పిలచి"  పిల్ల  ఎక్కడున్నదో  చూసుకోనక్కరలేదా?అని  గదమాయించారు. ఆయన  అటుఆఫీసుకు  వెళ్ళాక   మా  అమ్మ   చేతిలో   వున్నా   ఉప్పు   బుట్ట తో  నన్ను  ఒక  తోపు  తోసి "నేనులేనా!'అంది.ఆ తరవాత   నాన్నగారు  ఎప్పుడూ  చెప్పకుండా  వెళ్ళలేదు.       

Sunday, January 8, 2012

nannu prabhaavitam chesina vyaktulu

                                            రాజమ్మ    టీచరు గారు

                             మా ఇంటి    పక్కన      ఆంధ్రా     బాంక్   వుండేది  ,అవుటపల్లి     హనుమంతరావు   గారు   వుండేవారు. వెనక     కంచి వాసుదేవరాగారు,కంచి కృష్ణ మోహన్, వాళ్ళ అక్కగారు    జయలక్ష్మి    గారు  వుండేవారు.
మాఇంటికి   వాళ్ళింటికి     మధ్యన   వున్నా  ప్రహరీగోడ     విరిగి     దారి   ఏర్పడింది.    వాళ్ళ వేపు  దేవదారు    చెక్క పెట్టెలో    పిల్లి    పిల్లల్ని   పెట్టింది.   ఎండ     పేలిపోతున్నా సరే    మేము  ఆపిల్లి పిల్లలతో      ఆడుకొనే   వాళ్ళం .ఎండలో    ఆడుతుంటే    అమ్మ,నాన్న     చూస్తె    కోప్పడతారనే     భయం    కన్నా ,తీచారుగారు  చూస్తె కోప్పదతారనే   భయం   ఎక్కువగా    వుండేది.    ఆతరవాత   మేం ఇల్లు   మారితే      కృష్ణ మోహ న      చూడటానికి   వచ్చాడు,అబ్బా!   ఎంత  మంచి   స్నేహితుడో!   అనుకొన్నాను.    మళ్ళీ     ఎంత కాలానికో   అంటే తొంభై అయిదులో   హైదరాబాదు    వచ్చాక    చూసాను.  నా  స్నేహితుడు     మంచి   రచయితగా     పేరు  తెచ్చుకొన్నందుకు     గర్వ పడ్డాను. ఆతను   గతించా డన్నపుడు      నా   హృదయం    మూల్గింది.
                                                టీచరుగారికి       భయపడి      ఎప్పుడూ పాఠాలు    చదువుకోనేదాన్ని ,మంచి   మార్కులు వచ్చి    నాలుగో   క్లాసుకి     ప్రమోషన్     ఇచ్చారు.  ఆక్లాసులో   ఉండగానే    "రావే!  రావే!  కోకిలా "అని   ఒకపాటేదో    నేర్చుకొని    పాడేవాళ్ళం. ఆక్లాసులో    ఏదో     ఫంక్షన్     జరిగింది. పిల్ల లందరికి      రాజమ్మ   టీచరుగారు     డాన్స్ నేర్పించామన్నారు,నేర్చుకోన్నాం,అదీ     భయంభయం గానే!   డాన్స్ కి      పట్టు పరికిణీ    కట్టుకు రమ్మన్నారు.  మనదగ్గర లేదు.    కొనడం   అసంభవం .మా అమ్మ    రెండు   బారల   కంబారుతాడు {కొబ్బరిపీచుతో    పేనిన  తాడు,}  తెచ్చింది.  దానిమీద    అమ్మ పట్టు చీర     కుచ్చెళ్లు పెట్టి     అడ్డంగా     వేసింది. అది నా న డుముకు    నాలుగు  రెట్లు పొడవుంది.   తిప్పితిప్పి మొత్తానికి   పరికిణా కట్టింది.   జాకెట్?   గౌనువేసినది .ఉబ్బిపోయిన  పొట్ట,చచ్చే బరువు చీర    ఈడ్చుకొంటూ వెళ్లాం.   టీచరుగారు   వెంటే  వున్నారు.

                        "ఎలా వచ్చెనమ్మ కృష్ణు డేలా వచ్చెనే!
                       ఈ     మాయదారి   కృష్ణు డోచ్చి  మహిమ   చేసెనే!
                       ఉట్టిమీద     పాలు,పెరుగు     ఎట్లా దించెనే!
                        నే  కొట్టబోతే     దొరక డమ్మా  చిన్ని కృష్ణుడు"
                                   నా కష్టా నికి    ఫలితంగా      నాకు   కృష్ణుడి బొమ్మ   బహుమానం గా  ఇచ్చారు.కృష్ణుడు  తెల్లటి  గోవుని    ఆనుకొని   నుంచుని     పిల్లన  గ్రోవి     ఊదుతున్న   బొమ్మ. నీలంరంగులో వుండేది,ఇప్పటికి   నాకళ్ళల్లో    కనిపిస్తూ   వుంటుంది.  అవాళ     టీచరుగారు    దగ్గరికి   తీసుకొని     అబ్బో!  బొమ్మ   సంపాదిన్చావే!అన్నారు.

                ఒకరోజు    మధ్యాన్నం     టీచరు   గారి   హాలులో      చాలా      హడావుడిగా     కబుర్లు  వినిపించాయి.
వాళ్ళ    హాలులోకి  వున్నా  గుమ్మం  తలుపులు     ఎప్పుడూ  తెరిచేవాళ్ళం కాదు.  మా  అమ్మ   తలుపులు   తెరిచింది.  అప్పటికే  అక్కడ  చాలా  మంది   ఆడవాళ్ళు   వున్నారు.  ఒకావిడ చేతులు   ఊపుతూ  కళ్ళు   తిప్పుతూ   ఏదో   చెపుతున్నది. చిరునవ్వులు   నవ్వుతూ  కళ్ళతో    అందర్నీ   పలకరిస్తో    హుషారు  చేస్తున్నది.
అప్పుడు  రాజమ్మ    టీచరుగారు వచ్చి   ఇవాళ  నుంచి   మన  ఇంట్లో   అందరం    హిందీ  నేర్చుకొందాం.  ఈవిడే  హిందీ  టీచరు అని  చెప్పారు.  స్వాతంత్ర్యము     భారత దేశంలో     ఇంకా  అడుగు  పెట్టని  రోజులు.  స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి      హిందీ   నేర్చుకోవడం,   రాట్నం వడకటం,ఖద్దరు    కట్టడం,ఉద్యమాలలో  పాల్గొనడం అత్యవసరంగా    పౌరుల   బాధ్యతగా      నమ్మిన  రోజులు.   హిందీ  టీచరుగారి పేరు   "మోగంటి    మాణి క్యాంబ గారు.  జలపాతం   లాటి   మనిషి.    గడగడా    కవితలు  చెపుతూ  వుండేవారు.   మా అమ్మ కూడా   రాష్ట్ర భాష దాకా   అక్కడే  పరీక్షలు వ్రాసింది.