Posted by జ్ఞాన ప్రసూన

జివేన శరద: శతం

0

జీవేన శరద:శ్శతం
వంద ఏళ్ళు ఆరొగ్యంగా జీవించాలి. ఈకోరిక ప్రతి మానవుడికి వుంటుంది. విటమిన్ "సీ " లో
మహత్తర మైన శక్తులున్నాయని శరీరానికి కావలసిన ఆరోగ్యాన్నిచ్చి ,యౌవనాన్ని వృధ్ధి చేసి రోగాలను నివారిస్తుందని వైద్య శాస్త్రం చెపుతుంది.ఈవిషయాన్ని వేయి సంవత్సరాల క్రితం భారత దేశపు వైద్యులు పరిశోధన చేసి నిర్ణయించారు.ఆరోగ్య రక్షణ కోసం వారు ఎన్నో మందులు,చికిత్సలు ,లేహ్యాలు కనిపెట్టారు.అందులో చ్యవన ప్రాశ ఒకటి. చ్యవన ప్రాశ ప్రాశస్త్యం తెలిసినా తెలియక పోయినా అది తినడం వలన శరీరంలో ఉష్ణత నిలకడగా
వుంటుందని, జలుబులు దగ్గులు రావని నమ్ముతారు.ఇది తియ్యగా వుండటం వలన పిల్లలు మారాం చేయకుండా తింటారు.మనం ఒకచెంచా పెడితే వాళ్ళు ఇంకో చెంచా తింటారు.
చ్యవన ప్రాశకు సంబంధించి ఒక కథ కూడావుంది.చ్యవన మహర్షి పేరుతో ఈ లేహ్యం పుట్టిందిట.వృధ్ధు డైన చ్యవన మహర్షి ఒక వనం లో తపస్సు చేసుకొంటున్నాడట. చాలా సంవత్శరాలు ఒకేచోట కూర్చోవడం వల్ల ఆయన చుట్టు చెదలు పుట్టలు పెట్టాయి.శరీరం అంతా నిడి కళ్ళు మాత్రం కనిపించేవిట .సుకన్య అనే రాజకుమారి ఆవనానికి చెలికత్తెలతో వాహ్యాళికి వెళ్ళిందిట.ఈపుట్ట చూసింది. కళ్ళు మాత్రం మెరుస్తున్నాయిట.సుకన్య కుతూహలం తో ఆకళ్ళల్లో పొడిచింది.ఆయన కు కళ్ళు పోయాయి.సుకన్య చాలా పశ్చాత్తప పడి ఆఋషిని పెళ్ళీ చేసుకొంది.దేవతల వైద్యులు అశ్వని కుమారులను ప్రార్ధించింది,తన భర్తకు చూపు తెప్పించమని.వారు ఔషధం తయారు చేసి ఇచ్చారు.ఆయనకి చూపు రావడమే కాక పున: యౌవనం కూడా వచ్చిందిట.ప్రాశ అంటే తినడం చ్యవనుడు తిన్న ఔషధ కనుక దినికి చ్యవన ప్రాశ అని పేరు వచ్చింది.
అంటె ఇఔషఢానికి ఇంత శక్తి వుంది.ఇంతలాభం జరుగుతుందా?ఇప్పటికి? అని శంసయం రావచ్చు.
ఔషధాలు,ఉపకరణాలు పెట్టి రోగిని ఒక గదిలో నిర్ణీత కాలం పెట్టేవారుట.బయట ప్రపంచం తో రోగికి సంబంధం వుందేది కాదుట.అప్పుడు చ్యవన ప్రాశ పెట్టే వారుట.
అప్పుడు కాయాకల్పం జరిగేదిట.పండిత మదన మోహన మాలవ్యా గారు కూడా కొంతకాలం ఈచికిత్స పొందారట.ఇది పూర్తిగా ఫలితాన్నియ్యాలంటే దీన్ని తాజాగా సేవించాలి..తయారు చేసాక ఒక సంవస్తరం దాటగానే ఇందులో వేసిన పదార్ధాల శాక్తి తగ్గు ముఖం పడుతుందంటారు.పూర్వ వాళ్ళు ఈఔషధ ఇలా తయారు చేసి అలా రోగికి ఇచ్చేవారుట.
చ్యవనప్రాశ తయారు చేయడానికికాలము,శ్రమ ఎక్కువ వినియోగించాలి.ఔష్ధీయుక్త మైన వేర్లు,ఆకులు కొమ్మలు అడవులలో తిరిగి వెతికివెతికి తేవాల్సి వుంటుంది.పదిమంది పది దిక్కులకు పోయినాకూడా సమయం బాగానేపడుతుంది.చరక సమ్హిత మొదలైన ఆయుర్వేద గ్రంధాలలో చ్యవన ప్రాశ తయారీ,దాని ప్రాశస్త్యము వివరించారు.దీనిని శీతాకాలం లో సేవించడం చాలా మంచిది. దీనిని తయారు చేయడం కూడా శీతాకాలం లోనే చేస్తారుట.
పక్వానికి వచ్చిన్ తాజాగా పండిన ఉసిరికాయలు,వేర్లు,ఆకులు తెచ్చి కళాయిపెట్టిన పాత్రలో నీళ్ళు పోసి ఉడికిస్తారు.శీతాకాలం లో ఉసిరికాయలు పుష్కలం గాదొరుకుతాయి వాటిలో విటమిన్ "సి" పుష్కలం గావుంటుంది.గులాబి,బిల్వపత్రం,పగడ చెట్టు ఆకులు,విష్ణు క్రాంత ఆకులు,రావీఅకు,ఎండ్రగబ్బ కొమ్మ ఆకు,మునక్కయ ,కరక్కాయ,జీవంతి,నేల ఉసిరి,కజ్జూరం,తామరదుంప,చందనం,ఆకుపచ్చ ఏలకులు,సొంటి అష్టవర్గ మొదలైనవి దీనిలో వేస్తారు.అందుకే చ్యవన ప్రాశ సీసాల పై విశేష అష్ట వర్గలతో చేసింది అని వ్రాస్తారు.తమ్మి వేరు,కాకి దొండ చెట్టు,వ్రుధ్ధ మెదా,మహామదా,రుషభుక్,జీవక కాకోలీ,క్షీరకాకోలి ఈఎనిమిది ని అష్టవర్గ అంటారు.
ఇవి దుర్గమ మైన హిమాలయ పర్వతాలలో మంచు ప్రదేశం లో పుడతాయి.సన్నని సెగ మీద నెయ్యి కాచి ఇవన్ని అందులొ వేసి ఎర్రగా వేగనిస్తారు.పూర్తిగా వేగాక నెయ్యి పైకి వస్తుంది.వెరే నీళ్ళు బాణలిలో వేసిపొంగాక పంచదార వేసి పాకం పడ్తారు.ఇందులొ వేగించిన దినుసులు వేసి హల్వాలా చేస్తారు.పిప్పలి,నాగ కేసరి,తేజపత్తా,ఏలకులు,వంశలోచన్,దాల్చీని,మెత్తగా నూరి ఇందులో కలుపుతారు.చల్లబడ్డాక సీసాలలో నింపుతారు.
ఉదయం ఫలహారం చేసేముందు పాలతోకానీ,వేడినీటితో కాని 20 గ్రాములు పుచ్చుకోవాలి.రాత్రి ఇలాగేసేవించాలి.ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.ఇది శ్రేష్ట మైన రసాయనం. వూపిరితిత్తులకి,మస్తిష్కానికిశక్తినిస్తుంది.గుండెలోని ధమనులని,నాడులని బలపరుస్తుంది.విద్యార్ధులకి,బుధ్ధిజీవులకి శ్మరణ శాక్తిని పెంచుతుంది.పేగులలో మలం చేరితే వచ్చే రోగాలని నిరోధిస్తుంది.నియమంగా పుచ్చుకొంటే రక్త వౄధ్ధి,శరీరంలో కాంతి కల్గుతాయి.ఇందులో వుండే వంశలోచన అంటే ప్రక్రుతి సిధ్ధమైన "క్యాలిషం "వలన ఎముకలు గట్టిపడతాయి.కాని అన్ని మంచి గుణాలే అని అందరు సెవించకూడదు.వాయుపీడితులు,విరోచనాలయ్యె వాళ్ళు,ఆకలి లేనివాళ్ళు,అజీర్ణం తో బాధ పడే వాళ్ళు పుచ్చుకోకూడదు.ఎదిగేపిల్లలకి ఇది ఎంతో మంచిది.ఇది సహజ మైన,సులభ మైన దివ్యౌధం.శీతాకాలం లో జలుబులు,దగ్గులు,జ్వరాలు రానియ్యదు.తియ్యగా వుండటం వల్ల పిల్లలు తినడానికి ఇష్ట పడతారు.
స్వాగత్ సౌజన్యంతో

Read on »

Posted by జ్ఞాన ప్రసూన

బ్లాగ్వనంలో వనభోజనం - క్యారెట్ జామ్

10




కార్తీకమాసం సందర్భంగా ప్రమదలందరూ కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుందామా అని చర్చిస్తుంటే నాకు వంటలు ఆట్టే రావు అందుకే నోరుమూసుకొన్నా! ఐనా అమెరికాలో ఉండి మన తెలుగువంటలేం చేస్తాంలే అనుకున్నా.హైదరాబాదు వెళ్లాక చేద్దాం అంటే జ్యోతి ఊరుకుంటుందా! హెచ్చరిక చేసింది. సరే అని మీకోసం ఆపిల్ జామ్ చేశాను,


కారెట్ ,కొబ్బరి, పెసరపప్పు వేసి ,కరివేపాకు,అల్లము,పచ్చిమిర్చి, ఆవాలు,జీలకర్ర మినప పప్పు, ఒక్క ఎండు మిరప కాయ (ఎక్కువ మిర్చి వేస్తే కారెట్ రుచి తగ్గిపోతుంది) వేసి ఘాటుగా తిరగమూత పెట్టా. బటానీలు ఒక్క వుడుకు రానిచ్చి నీళ్లు ఓడ్చి జీలకర్ర ఉప్పుకారం వేసి పోగిచాను.అరటి పళ్ళు పవిత్ర మైన కార్తిక మాసంలో అన్ని విధాలా శ్రేష్టం కదా! అవిపెట్టాను. కారెట్ పడవలాచేసి వెడల్పాటి గిన్నెలో ఒక్క ఉడుకు రానిచ్చి జాగ్రత్తగా బయటికి తీసి , మధ్యలో గుజ్జు తిసేసి అందులో జామ్ నింపా. ఆపిల్ ముక్కతో తెరచాప చేశా. పడవ వాడు వున్నాడుగాని, పనికి రాదు. తక్కినవి తినవచ్చు.పరీక్షకి చదవని వాడు బలవంతంగా వెళ్లి హాజరు అవుతాడే! అలాగన్నమాట. ఏమి అన్యదా భావించకండి.


మీ జ్ఞాన ప్రసూన

Read on »

Posted by జ్ఞాన ప్రసూన

అరుదైన గౌరవం

1

అరుదైన గౌరవం
ప్రొద్దున్నే పేపర్ తిరగేస్తుంటే " హైదరాబాదు మహిళకు అరుదైన గౌరవం "అని కనపడింది . అహా! మనవూరే! ఎవరికి? అని చదివాను. "కల్పలత "అనివుంది.ఇంకేమి? మా కల్పలతే అయివుంటుంది అనుకొన్నాను. కల్పలత ఫొటో వుంది. నెను తనని చూసి ఎన్నో ఏళ్ళయింది. చిన్నప్పటి కల్పలతే నా స్మ్రుతి పధం లో వుంది. తన చలాకి తనం, తెలివి తేటలు,
మర్యాద అయిన ప్రవర్తన ఏమిటో తను ప్రత్యేకం గా అనిపించేది. ఫోటోలో చూస్తే ఆకళ్ళు, ఆనవ్వు మన కల్పలతే అనుకొన్నాను.
చాలా కాలం కింద మా అక్కా,బావగారూ,దోమలగూడాలో వుండే వాళ్ళు.
మెము పక్క భాగంలో వుండే వాళ్ళము. కల్పలత వాళ్ళూ మాఇంటికి దగ్గరలోనే వుండే వారు.వాళ్ళింట్లో అందరమ్మాయిల పేర్లు లతలే! వాళ్ళ ఇంటికి "లతా నికుంజం" అని పేరు వుండేది. కల్పలత మా అక్కయ్య గారి అమ్మాయి ఉమ మంచి జిగరీ దోస్తులు. రోజు కలిసేవాళ్ళు.కల్పలత మాడపాటి హనుమంత రావు గారి స్కూలులో చదివింది. ఆ తరవాత
నేనా స్కూలు లో పని చెస్తానని ఎన్నడూ వూహించలేదు.ఇప్పుడు కల్ప లత "అమెరికన్ చష్ట్ ఫిజీషియన్స్ కాలేజీకి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. నవెంబెర్ 1స్ట్ న బాధ్యతలు స్వీకరిస్తుంది. కల్ప లతకి "అరుదైన గౌరవం అందిందంటే మా వూరు అమ్మాయి, మా ఉమ స్నేహితురాలు,ఒకేవీధిలో వుండే వాళ్ళము,మా స్కూలు విద్యార్ధిని ఇన్ని కారణాలుగా
కల్పలత గురించి విని నా మనస్సు పొంగి పోయింది.
ఆర్భాటం గా అమెరికా వచ్చి ఆర్ధికంగా నిలదొక్కుకున్న వాళ్ళున్నారు.
ఈగడ్డ పై ప్రత్యేక గౌరవం అందుకొడంలో ఎంతో గర్వంగా వుంది. కల్ప్ లత చెసిన భ్రుహత్ కార్యక్రమాలు వ్యాసం లో పొందు పరిచారు,కల్పలత సాధించిన విజయం చదివి "ఆయురారోగ్యాభి వ్రుధ్ధిగ్గా ఆశీర్వ దిస్తున్నాను.
జ్ఞాన ప్రసూన {సచిత}
28-10- 09 అంధ్ర జ్యోతి దినపత్రికలో ఈమె పై ప్రచురించిన వ్యాసం చదవండి.

Read on »

Previous Post